మహిళా గర్భం దాల్చడం అనేది ఒక వరం లాంటిది. అటువంటి సమయంలో ఏ ఫుడ్ తీసుకోవాలో చాలామందికి తెలవదు. ఎక్కువగా ప్రోటీన్లు, విటమిన్లు కలిగిన ఆహారాన్ని తీసుకుంటే పుట్టే బేబి ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా ఆరోగ్య కరమైన గర్భాధారణ కోసం ప్రతీ మహిళ తెలుసుకోవాల్సిన కొన్ని చిట్కాల గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం.
గర్భం వచ్చిందా.. రాలేదా అనేది శరీరంలో వచ్చే మార్పుల ఆధారంగా తెలుసుకోవచ్చు. శరీరంలో మార్పులను గమినిస్తే వెంటనే ప్రెగ్నేన్సీ టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ పాజిటివ్ గా రిపోర్ట్ వస్తే.. అటు వంటి సమయంలో ఏం తినాలి.. ఎలాంటి వాటికి దూరంగా ఉండాలి అనే వాటిని ఇంటి పెద్దలను అడిగి తెలుసుకోవాలి. ఒక వేళ ఇంట్లో ఎవరూ లేకపోతే.. ఇక్కడ చెప్పే కొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది.
సాధారణంగా గర్భం దాల్చిన మహిళతో పొల్చితే సాధారణ మహిళలు బరువు తక్కువగా ఉంటారు. ప్రతీ నెల ప్రెగ్నెన్సీ వచ్చిన మహిళ బరువు పెరుగుతూ ఉంటారు. ప్రెగ్నెన్సీ సమయంలో అధిక బరువు ఉండటం కూడా ప్రమాదకరమే. దాదాపు 10 నుంచి 12 కిలోల వరకు బరువు పెరిగితే పర్వాలేదు కానీ.. అంత కంటే ఎక్కువగా బరువు పెరిగితే ప్రమాదం అని నిపుణులు తెలుపుతున్నారు. ఇక తినే పండ్ల విషయంలో అధికంగా పోలిక్ యాసిడ్ ఉన్న పండ్లను తీసుకోవాలి.
నీటిని ఎక్కువగా తాగాలని వైద్యులు తెలుపుతున్నారు. రెండో నెలలో 350 అదనపు కేలరీలు.. మూడో నెలలో 450 అదనపు కేలరీలను తీసుకోవాలి. వైద్యుల సూచనల మేరకు వ్యాయామం, స్విమ్మింగ్ చేయడం వంటివి చేస్తుండాలి. పడుకునే సమయం దాదాపు 6 నుంచి 8 గంటల మధ్య ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెరుగుతున్న శిశువు ఆరోగ్యకరంగా జన్మిస్తాడు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…