ఇటీవల కాలంలో ప్రేమ, పెళ్లి పేరుతో యువతులు మోస పోతున్నారు. దీంతో పోలీస్ స్టేషన్లో ఇలాంటి కేసులు కుప్పలు కుప్పలుగా వచ్చి పడుతున్నాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఇద్దరు కలిసి చెట్టా పట్టాలేసుకొని తిరిగి .. చివరకు పెళ్లి మాట ఎత్తితే ముఖం చాటేసే మోసగాళ్లు ఈ మధ్య ఎక్కువయ్యారు.
అలాంటి వారికి దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నా గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి విజయవాడలోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ.. పెజ్జోనిపేటకు చెందిన ఓ యువతి ప్రైవేటు కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతోంది.
మొదట్లో తన తోటి మహిళలతో స్నేహం చేసిన సదరు యువతి.. తర్వాత తన క్లాస్ కు చెందిన యువకుడితో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయాన్ని అతడు తనకు అనుకూలంగా మార్చుకున్నాడు తోటి విద్యార్థి సుహృద్. ప్రేమిస్తున్నట్లు వెంట పడ్డాడు. ఆమె మొదట నిరాకరించింది. పెళ్లి చేసకుంటానని నమ్మించాడు.
తర్వాత ఆమెను తీసుకొని బయట తిరగడం ప్రారంభించాడు. ఇలా పలుమార్లు ఆమెపై లైగికంగా దగ్గరయ్యాడు. తర్వాత ఓ రోజు సదరు యువతి పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయగా అతడి నిజ స్వరూపం బయటపడింది. ఒత్తిడి ఎక్కువగా రావడంతో ఆమెకు దూరంగా ఉంటూ.. తప్పించుకొని తిరగడం ప్రారంభించాడు. దీంతో యువతి తనను మోసం చేశాడని తెలుసుకొని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో అతడిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…