దేశ రాజధాని ఢిల్లీలో ఏం చేయడానికైనా వెనకాడం లేదు దుండగులు. పట్టపగలు ఓ మహిళను నడిరోడ్డుపై దారుణంగా గొంతకోసి చంపేశాడు. సదరు మహళ కూరగాయల బండి పెట్టుకొని జీవిస్తుంది. రాజపురిలోని సోమ్ బజార్ ప్రాంతంలో ఈ ఘోరం వెలుగు చూసింది. దీనికి సబంధించి వీడియో అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డు అయింది.
ఢిల్లీలోని డాబ్రి ప్రాంతంలో రద్దీగా ఉండే రాజపురిలోని సోమ్ బజార్ మార్కెట్లో ఈ ఘటన జరిగింది. రాజపురిలోని సోమ్ బజార్ రోడ్డులో విభ (30) అనే మహిళ ఇద్దరు పిల్లలతో చిన్న కూరగాయల షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తోంది. ఆమె దగ్గరకు దిలీప్ అనే వ్యక్తి కూరగాయలు తీసుకొని డబ్బులు చెల్లించలేదు. వాటిని తాను అప్పుగా తీసుకున్నాని పేర్కొన్నాడు.
అప్పు చెల్లించాలని ఆ మహిళ ప్రశ్నించడంతో ఆ వ్యక్తి కత్తితో ఆమె గొంతుకోసినట్లు పోలీసులు వెల్లడించారు. గొడవ అనంతరం తొలుత సదరు మహిళ వద్దకు రావడానికి నిందితుడు ప్రయత్నించాడు. దీంతో చీపురు చూపించి ఆ మహిళ అతన్ని బెదిరించింది. దీంతో తన చేతిలోని సంచిని కింద పెట్టిన నిందితుడు దీపక్.. సంచిలో నుంచి కత్తి తీసి మహిళపై దాడి చేశాడు.
ఆమె గొంతు కోసి పరారయ్యే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన స్థానికులు అతడి పట్టుకొని చితక్కొట్టారు. ఆమెను అక్కడ నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె చనిపోయిదంటూ వైద్యులు వెల్లడించారు. అక్కడ జరిగిన ఈ ఉదంతం మొత్తం సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి. గాయపడిని ఆ నిందితుడిని పోలీసులు మొదట ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా తీవ్ర విషాదంతో నిండిపోయింది. బాధిత మమిళ చిన్న పిల్లలు అనాథలుగా మారారు.
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విడుదలకు సిద్ధమైంది. గత…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్యూటీ రంగంలో అత్యంత ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో "కొరియన్ స్కిన్కేర్" ఒకటి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలపై…
తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…
హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…