దొంగతనం చేయడంలో కూడా చాలామందికి తమకంటూ ఓ ప్రత్యేక స్టైల్ ను ఫాలో అవుతూ ఉంటారు. వారి శైలి మరే ఇతర దొంగ కూడా అనుసరించలేడు. అయితే దొంగల్లో కూడా కొంతమంది మంచి దొంగ ఉంటాడు. చెడుదొంగ కూడా ఉంటారు.
వాళ్లు ఏం చేసినా దొంగతనం అనేది మాత్రం నేరం. ఇక్కడ అవి రెండు కాకుండా మరో దొంగను చూడొచ్చు. అదే సరదా దొంగ. దొంగల్లో చాలా మంది దొచుకున్న సొమ్మును ఆస్తులు కొనడం, బ్యాంకుల్లో ఆ నగదును దాచుకోవడం వంటివి చేసుకొని వారి వృత్తికి న్యాయం చేస్తూ ఉంటారు. వీరు ఏ ఇంటిలో పడినా డబ్బులతో పాటు నగలును కూడా దొచుకెళ్తుంటారు.
మరికొంత మంది కేవలం నగదును మాత్రమే తీసుకెళ్తారు. ఇలాంటి దొంగ గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం.. ఒడిషాకు చెందిన హేమంత్ దాస్ 35 ఏళ్లుగా చోరీలకు పాల్పడుతూ ఉన్నాడు. అతడు పెద్ద చదువులే చదువుకున్నా.. బుద్ధి మాత్రం దోపిడీల వైపు మళ్లించింది. అతడు దొంగగా మారడానికి కారణం.. అతడు కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో ఓ గొడవలో అతడిని అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకెళ్లారు.
అందులో ఒక దొంగ పరిచయమయ్యాడు. అతడి వద్ద మెళకువలు నేర్చొకొని బయటకు వచ్చి అదే పని చేయడం ప్రారంభించాడు. తర్వాత అతడు చిన్నగా ప్రొఫెషనల్ దొంగగా ఎదిగాడు. అతడు ఇలా దొచుకున్న డబ్బులను సిమ్లా, గ్యాంగ్ టక్, కశ్మీర్ వెళ్లి ఎంజాయ్ చేస్తాడు. ఆ తర్వాత మళ్లీ వచ్చి దొంగతనాలు చేస్తాడు. కేవలం డబ్బులను మాత్రమే తీసుకెళ్తాడు. తాజాగా మళ్లీ కటక్ లో ఇలా చోరీకి పాల్పడుతుండగా.. పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…