ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రలో కనిపించగా…. రష్మిక శ్రీ వల్లి పాత్రలో సందడి చేయనున్నారు.ఈ క్రమంలోనే తాజాగా శ్రీవల్లి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ కోసం చిత్రబృందం విడుదల చేయగా విశేషమైన ఆదరణ దక్కింది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్ లు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఇకపోతే ఇప్పటికే అల్లు అర్జున్ పై ఇప్పటికే ఈ సినిమా నుంచి పస్ట్ సింగిల్ విడుదల అయి ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. దాక్కో దాక్కో మేక అంటూ ఐదు భాషలలో విడుదలైన ఈ పాట విశేష ఆదరణ దక్కించుకుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి తాజాగా సరికొత్త అప్డేట్ విడుదల చేశారు. ఇందులో భాగంగా శ్రీవల్లి పాత్రలో నటిస్తున్నటువంటి రష్మిక పై సెకండ్ సింగిల్ విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే శ్రీవల్లి సెకండ్ సింగిల్ ఎప్పుడు రాబోతుంది అనే విషయాన్ని చిత్రబృందం అధికారకంగా తెలియజేశారు. ఈ క్రమంలోనే ఈనెల 13వ తేదీ శ్రీ వల్లి సెకండ్ సింగిల్ విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అధికారకంగా తెలియజేస్తూ ఒక పోస్టర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అందించిన బాణీలు విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పటికే సుకుమార్ , బన్నీ,దేవిశ్రీ కాంబినేషన్లో తెరకెక్కిన ఆర్య, ఆర్య 2 సినిమాలోని పాటలు విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ రెండు సినిమాలకు మించి పుష్ప సినిమా ఉండబోతోందని ఈ సందర్భంగా చిత్ర బృందం తెలియజేశారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. హారర్…
వరుస పరాజయాలతో కొంత వెనుకబడిన యువ హీరో నితిన్, ఈసారి హిట్ ట్రాక్లోకి రావాలనే లక్ష్యంతో కొత్త ప్రాజెక్ట్ను ఎంపిక…
సినిమాల్లో యాంగ్రీమ్యాన్గా గుర్తింపు పొందిన సీనియర్ నటుడు రాజశేఖర్, నిజ జీవితంలో మాత్రం ఎంతో మానవతా భావంతో కూడిన వైద్యుడని…
ఐపీఎల్ 2026 సీజన్ ముంబై ఇండియన్స్కు కష్టకాలంగా మారింది. వరుస ఓటములతో ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న జట్టుకు, చెన్నై సూపర్…
బాలీవుడ్ నటి కాజోల్ తాజాగా తన కెరీర్కు సంబంధించిన ఒక ఆసక్తికర అనుభవాన్ని పంచుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో…
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కుటుంబం మరోసారి వార్తల్లో…