Tag Archives: dasari

LB Sriram: ఏఎన్ఆర్ నాగార్జున సినిమాలకు అతనిని వద్దని నన్ను పెట్టుకున్నారు… దాసరి, రాఘవేంద్ర కొడతారేమోనని భయపడ్డాను: ఎల్బీ శ్రీరామ్

LB Sriram: తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా రచయితగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎల్బీ శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలలో అద్భుతమైన నటనను కనపరిచిన ఈయన రచయితగా కూడా పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందిన ఎల్బీ శ్రీరామ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ.. తాను దర్శకుడు క్రాంతి కుమార్ అన్ని సినిమాలకు తానే మాటలు రాస్తానని తెలిపారు. జయభేరి ప్రొడక్షన్స్ లో రాజేశ్వరి కళ్యాణం, వారసుడు సినిమాలు రెండు నిర్మిస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాలకు తాను మాటలు రాయాలని చెప్పారు.రాజేశ్వరి కళ్యాణంలో ఏఎన్ఆర్ గారి నటించగా వారసుడు సినిమాలో కృష్ణ గారు నాగార్జున గారు నటిస్తున్నారు. ఇలా వీరిద్దరికీ డైలాగులు రాయడం అంటే సర్వసాధారణమైన విషయం కాదని తెలిపారు.

నిజానికి జయభేరి వాళ్లు ముందుగా ఈ రెండు సినిమాలకు డైలాగులు రాయడానికి గణేష్ పాత్రోని తీసుకున్నారు. అతనికి కొంతమేర అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అయితే ఆయనను కాదని ఆ సినిమాలో డైలాగులు రాయడానికి నన్ను తీసుకున్నారని ఎల్బీ శ్రీరామ్ వెల్లడించారు.ఇకపోతే రాజేంద్ర ప్రసాద్ గారు నటించిన ఓ సినిమా కోసం ఈయన డైలాగులు రాసారని అయితే ఆ రోజు సినిమా షూటింగ్ మొదలు కాగా ఈ సినిమా కెమెరా స్విచ్ ఆన్ చేయడానికి, క్లాప్ కొట్టడానికి ప్రముఖ దర్శకులైనటువంటి రాఘవేంద్రరావు దాసరి గారిని ఆహ్వానించారని తెలిపారు.

LB Sriram: దాసరి ప్రశంసలు కురిపించారు…


ఈ సినిమా ముహూర్తం షార్ట్ కాగానే ఆహా ఎంత శుభవార్త చెప్పవయ్యా దాసరి రాఘవేంద్ర అనే డైలాగ్ రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. ఇలా ఈయన డైలాగ్ చెప్పడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయి భయంతో చెట్టు చాటున దాక్కున్నానని తెలిపారు. ఈ సినిమా ఓపెనింగ్ దాసరి రాఘవేంద్రరావు రావడం అదే సమయంలో డైలాగ్ చెప్పడంతో వారిద్దరూ నన్ను కొడతారని ఫిక్స్ అయిపోయి దాక్కున్నానని ఎల్బీ శ్రీరామ్ తెలిపారు.ఈ డైలాగ్ విన్నటువంటి దాసరి రాఘవేంద్ర రావు గారు ఎవరు అద్భుతంగా రాశారు అంటూ సంతోషం వ్యక్తం చేశారు. అప్పటికి నన్ను పిలిచి మన ఎల్బీ శ్రీరాం గారు ఈయన అద్భుతమైన రచయిత కానీ నోట్లో నాలుక లేదని రాజేంద్రప్రసాద్ పరిచయం చేయగా నాలుకను తీసి కలంలో పెడితే అతనికి నాలుక ఎక్కడుంటుంది అంటూ దాసరి చమత్కరించారంటూ ఎల్బీ శ్రీరామ్ ఈ సందర్భంగా తెలిపారు.

Chiranjeevi: దాసరి నిర్ణయంతో ఆ రోజు చిరంజీవి మొహం చూడలేకపోయాను.. దవళ సత్యం కామెంట్స్ వైరల్!

Chiranjeevi:తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న దవల సత్యం దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కాయి. ధవళ సత్యం దాసరి గారి జూనియర్ కావడంతో ఆయన సహాయంతో ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇండస్ట్రీలోకి రాకముందు ఇద్దరూ కలిసి నాటకాలు వేస్తూ ఉండేవాళ్లమని అనంతరం దాసరి సహాయంతోనే ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు.

Chiranjeevi: దాసరి నిర్ణయంతో ఆ రోజు చిరంజీవి మొహం చూడలేకపోయాను.. దవళ సత్యం కామెంట్స్ వైరల్!

ఇకపోతే దాసరి దర్శకత్వంలో తెరకెక్కిన శివరంజని సినిమా కోసం ధవళ సత్యం కో-డైరెక్టర్ గా పనిచేశారు. ఇక ఈ సినిమాకి నలుగురు హీరోలు ఆప్షన్ గా ఉన్నారు. చిరంజీవి, సుధాకర్, హరిప్రసాద్, ఇంకొక హైదరాబాద్ చెందిన ఒక అబ్బాయి నలుగురు హీరోలు ఆప్షన్ గా ఉన్నారు. నా ఒపీనియన్ అయితే నేను శివరంజని సినిమా కోసం చిరంజీవిని తీసుకోవాలని దాసరి గారికి చూపించాను. ఇక పద్మజా వదిన సుధాకర్ పేరు ప్రస్తావించారు.

Chiranjeevi: దాసరి నిర్ణయంతో ఆ రోజు చిరంజీవి మొహం చూడలేకపోయాను.. దవళ సత్యం కామెంట్స్ వైరల్!

ఇకపోతే హైదరాబాద్ నుంచి కొందరు రాజకీయ నాయకుల హరిప్రసాద్ ను హీరోగా తీసుకోవాలని ఫోన్లు చేసేవారు. ఇక ఈ విషయంలో బాగా ఆలోచించిన దాసరిగారు ఈ సినిమాకి హరి ప్రసాద్ ను ఫైనల్ చేశారు.అదేంటి అన్నయ్య అలా చేసావంటే ఇండస్ట్రీలో కొన్ని కొన్ని విషయాలలో ఇలాగే వ్యవహరించాల్సి ఉంటుంది. నువ్వు ఎలా చేస్తావో తెలియదు హరి ప్రసాద్ ని హీరోగా అద్భుతంగా చూపించాలి అంటూ దాసరి గారు చెప్పారు.

రాజకీయ నాయకుల ఒత్తిడే కారణం….

ఈ విధంగా శివరంజని సినిమా కోసం హీరోగా హరి ప్రసాద్ ను సెలెక్ట్ చేయగానే నేను బయటకు వెళ్లి పోయాను.అయితే బయట చిరంజీవి గారు నా కోసం ఎదురు చూస్తున్నారు. నేను కనబడితే నాకు చెప్పేసి వెళ్లిపోవాలని ఆయన ఎదురు చూస్తున్నారు. అయితే ఆ సమయంలో నేను చిరంజీవి మొహం చూడలేకపోయానని ఈ సందర్భంగా దవళ సత్యం శివరంజని సినిమా సమయంలో జరిగిన సంఘటన గురించి తెలియజేశారు. అయితే ఈ సినిమా పెద్దగా హిట్ కాలేదని హరిప్రసాద్ స్థానంలో చిరంజీవిని పెట్టి ఉంటే సినిమానే వేరే ఉండేది అంటూ ఆయన తెలిపారు. ఇకపోతే తాను డైరెక్టర్ అయిన తర్వాత జాతర సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవిని హీరోగా సెలెక్ట్ చేశానని, ఆ విషయంలో ఎవరు చెప్పినా వినకుండా చిరంజీవి హీరోగా పెట్టి జాతర సినిమా చేశానని తెలిపారు.

Chiranjeevi: దాసరి వచ్చి చిరంజీవిని తీసేసి చంద్రమోహన్ ని హీరోగా పెట్టమన్నారు… డైరెక్టర్ దవళ సత్యం షాకింగ్ కామెంట్స్!

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలకు దర్శకుడిగా, నిర్మాతగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ధవళ సత్యం. ఈయన ఎంతో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించి ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇకపోతే ఈయన కూడా దాసరి శిష్యుడు. ఇలా దాసరి శిష్యుడుగా ఇండస్ట్రీలో కొనసాగిన ధవళ సత్యం దర్శకుడిగా మారిన తరువాత మొట్టమొదటిసారి మెగాస్టార్ చిరంజీవితో జాతర అనే సినిమా తెరకెక్కించారు.

Chiranjeevi: ఆ సినిమా విషయంలో దాసరి చిరంజీవి ని తీసేసి చంద్రమోహన్ నీ పెట్టమన్నారు… డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

ఇక ఈ సినిమా తెరకెక్కే సమయంలో అందరూ కొత్తవాళ్ళే. ప్రొడ్యూసర్ నుంచి మొదలుకొని డైరెక్టర్, కెమెరా మెన్స్ అందరూ కూడా కొత్త వాళ్లే. ఇక ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంపిక చేశాను. అయితే గతంలో తన సినిమాలో మెగాస్టార్ చిరంజీవిని హీరోగా చూపిస్తానని ఆయనకు మాటిచ్చాను. ఈ క్రమంలోనే జాతర సినిమాలో తనను హీరోగా తీసుకున్నానని తెలిపారు.

Chiranjeevi: ఆ సినిమా విషయంలో దాసరి చిరంజీవి ని తీసేసి చంద్రమోహన్ నీ పెట్టమన్నారు… డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

ఇక ఈ సినిమాలో చిరంజీవిను తీసుకోవడం అందరికీ
ఇష్టమే అయితే దాసరి గారు వచ్చి అందరూ కొత్తవాళ్ళే చిరంజీవి కాకుండా వేరే హీరోను తీసుకోవచ్చు కదా అంటే తనకు సలహా ఇచ్చారు. ఆ సమయంలో నేను మాట్లాడుతూ అతని మొహంలో ఏదో ఫెయిర్ ఉంది. ఈ పాత్రకు కరెక్టుగా సరిపోతాడని నమ్మకం ఉందని చెప్పాను.ఏంట్రా నమ్మకం చిరంజీవిని తీసేసి చంద్రమోహన్ ని పెట్టుకో అంటూ చెప్పారు.

రంగస్థలం సినిమా కూడా అదే…

గురువుగారు అలా చెప్పినప్పటికీ జాతర సినిమాలో చిరంజీవి గారిని హీరోగా తీసుకుని సినిమా చేశామని ఈ సందర్భంగా ధవళ సత్యం జాతర సినిమా గురించి తెలిపారు.ఈ సినిమా రంగస్థలం సినిమా ఒకటే కాన్సెప్ట్ అని ప్రశ్నించగా… నిజం చెప్పాలంటే ఆ రెండు ఒకే కథ అంటూ ధవళ సత్యం ఈ సందర్భంగా తెలిపారు.

Actor Kadambari Kiran: దాసరి తర్వాత ఇండస్ట్రీ పెద్ద చిరంజీవే… ఆరెంజ్ మెగా స్టార్ కి మాత్రమే ఉంది: కాదంబరి కిరణ్

Actor Kadambari Kiran: టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొంతకాలం నుంచి ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతోంది. ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లభించలేదు.దాసరి నారాయణరావు మరణం తర్వాత ఇండస్ట్రీ పెద్దదిక్కును కోల్పోయింది. దాసరి ఉన్నప్పుడు ఇండస్ట్రీ సమస్యలను ఎంతో చక్కగా పరిష్కరిస్తూ ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరించే వారు.ఇక ఆయన మరణం తర్వాత ఇండస్ట్రీ బాధ్యతలను ఎవరు తీసుకోలేదు.

Actor Kadambari Kiran: దాసరి తర్వాత ఇండస్ట్రీ పెద్ద చిరంజీవే… ఆరెంజ్ మెగా స్టార్ కి మాత్రమే ఉంది: కాదంబరి కిరణ్

ఈ క్రమంలోనే ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనే ప్రశ్న మొదలైన ప్రతిసారి మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ పెద్ద అంటూ పలువురు భావిస్తున్నారు. చిరంజీవి అవునన్నా…కాదన్న ఆయననే ఇండస్ట్రీ పెద్దగా భావిస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా నటుడు కాదంబరి కిరణ్ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొనగా ఆయనకు ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనే విషయం గురించి ప్రశ్న ఎదురయింది.

Actor Kadambari Kiran: దాసరి తర్వాత ఇండస్ట్రీ పెద్ద చిరంజీవే… ఆరెంజ్ మెగా స్టార్ కి మాత్రమే ఉంది: కాదంబరి కిరణ్

ఈ ప్రశ్నకు కాదంబరి సమాధానం చెబుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి గారు ఇండస్ట్రీ పెద్దగా బాధ్యతలను తీసుకోవడానికి వెనకడుగు వేశారు.ఇండస్ట్రీలో ఏదైనా సమస్య వస్తే ఆదుకోవడానికి ముందుంటాను కానీ ఇలాంటి బాధ్యతలు నాకొద్దు అంటూ చిరంజీవి చెప్పారు. ఇక ఈ విషయం గురించి కాదంబరి మాట్లాడుతూ చిరంజీవి గారు అలా మాట్లాడటం పూర్తిగా తప్పు అని వెల్లడించారు. నాయకత్వం అనేది ఇచ్చేది కాదు.. నాయకత్వం ఆయన తెచ్చుకున్నది కాదు. తమకు కష్టం వస్తే తన దగ్గరకు వెళితే ఆ సమస్య పరిష్కారం అవుతుందని ఆ సమస్యను వారి ముందు చెప్పుకోవడమే పెద్దమనిషితనం.

ఆయనే ఇండస్ట్రీకి అండ

ప్రస్తుతం ఈ స్థాయిలో మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. ఎవరికైనా ఏ సమస్య వచ్చినా తన వద్దకు వెళితే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.మెగాస్టార్ చిరంజీవి తప్ప ఇండస్ట్రీ సమస్యలను భుజాలపై వేసుకొని మోసేవారు మరొకరు లేరు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తర్వాత అలాంటి రేంజ్ కేవలం మెగాస్టార్ కి మాత్రమే ఉంది. ఎప్పటికైనా ఆయనే ఇండస్ట్రీ పెద్ద.. ఆయనే ఇండస్ట్రీకి అండ అంటూ కాదంబరి కిరణ్ మెగాస్టార్ చిరంజీవి గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు

దాసరిని తక్కువ అంచనా వేసి ఓ బ్లాక్ బాస్టర్ సినిమాను వదులుకున్న శోభన్ బాబు..

లెజెండ్ డైరెక్టర్ దాసరి నారాయణరావు దర్శకుడిగా పరిచయం చేసిన సినిమా ‘తాత మనవడు’ ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనిని కె. రాఘవ ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. అయితే ఈ చిత్రం దాసరికి.. రాఘవకు తొలి సినిమా. 1973లో వచ్చిన ఈ సినిమాలో టైటిల్ రోల్స్‌ను ఎస్వీ రంగారావు, రాజబాబు పోషించారు. అయితే ఇది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఇక్కడ రాజబాబు క్యారెక్టర్‌ను శోభన్‌బాబు చేయాల్సి ఉంది.

కానీ.. ఆ పాత్రను రాఘవ ఆఫర్ చేసినప్పుడు శోభన్‌బాబు చెయ్యనని చెప్పారంట. డైరెక్టర్ కొత్తవాడు కావడంతో సినిమాను వదులుకున్నాడంట. అంతేకాకుండా తనతో ఎక్స్‌పెరిమెంట్ చేయొద్దని కూడా అన్నారంట. మరో సినిమాను చేద్దాంలే అని ఆ సినిమా నుంచి తప్పించుకున్నాడంట. సినిమా పెద్ద హిట్ కావడంతో దాసరిని తక్కువ అంచనా వేసినందకు శోభన్ బాబు అప్పట్లో బాధపడ్డాడు.

ఆ తరువాత నుంచి దాసరి నుంచి ఏ ఆఫర్ వచ్చినా ఎప్పుడూ వెంటనే కాదని చెప్పలేదంట. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా ‘బలిపీఠం’ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఆ తరువాత వచ్చిన ‘గోరింటాకు’ మరింత హిట్‌ తీసుకొచ్చింది.

ఆ తర్వాత వీరిద్దరి మధ్య అభిమన్యుడు, దీపారాధన, కృష్ణార్జునులు, స్వయంవరం, ధర్మపీఠం దద్దరిల్లింది వంటి చిత్రాలు వచ్చాయి. అప్పటి నుంచి ఏ సినిమాను కాదని అనకుండా ఎన్నో సినిమాలను చేశారు. ఇద్దరు ఒకరినొకరు “బావా బావా” అనుకునేంత సన్నిహితత్వంగా ఉండేవారు. వాళ్లిద్దరు సెట్ లో ఉంటే ఎంతో సరదాగా ఉండేవారు.

ఒకప్పుడు ఈ రెండు రిక్షాలు ఢీ కొన్నాయి. కట్ చేస్తే.. బాక్సాఫీస్ పగిలిపోయింది.

ఈ నటులు ఇద్దరు కలిసి ఒకే తెరపై కనిపించారు. కొన్ని సంవత్సరాల తేడాతోనే వెండితెరకు పరిచయమయ్యారు. ఒకరు కోదండరామిరెడ్డి దర్శకత్వంలో విజయాలను అందుకుంటే మరొకరు దాసరి దర్శకత్వంలో తెరపై కనిపించారు. ప్రాణం ఖరీదు, కోతలరాయుడు లాంటి చిత్రాల్లో చిరంజీవి హీరోగా నటించగా, నారాయణమూర్తి సపోర్టింగ్ క్యారెక్టర్ లో చిరంజీవి పక్కన కనిపించారు.

చిరంజీవి సోలో హీరోగా ఎదుగుతూ అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు. 1980 ప్రథమార్థంలో నారాయణమూర్తి స్నేహాచిత్ర బ్యానర్ స్థాపించి, హీరోగా నటిస్తూనే నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఇకపోతే 1995 వచ్చేసరికి చిరంజీవి, నారాయణ మూర్తి ఇద్దరూ బాక్సాఫీసు వద్ద పోటీ పడ్డారు. దాసరి చిత్రాల్లో ఎక్కువగా సపోర్టింగ్ రోల్ లో కనిపించిన నారాయణమూర్తిని హీరోగా పెట్టి ఏకంగా ఓ సినిమానే మొదలు పెట్టడం జరిగింది.

దాసరి ఫిల్మ్ యూనివర్సిటీ, దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన “ఒరేయ్ రిక్షా” చిత్రంలో ఆర్.నారాయణమూర్తి, రవళి హీరో, హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమాలో నారాయణమూర్తి కష్టపడి రిక్షానడుపుతూ.. తన గారాబాల చెల్లిని పెంచి పోషించే ఒక అన్నగా ఆర్.నారాయణమూర్తి నటించారు. 1995 నవంబర్ 9న ఒరేయ్ రిక్షా సినిమా విడుదలై బాక్సాఫీసు బరిలో సిద్ధంగా ఉంది.

ఇదే సంవత్సరంలో క్రాంతి కుమార్ నిర్మాణం కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన “రిక్షావోడు” చిత్రంలో చిరంజీవి, నగ్మా, సౌందర్య హీరో, హీరోయిన్లుగా నటించారు. కోడిరామకృష్ణ, చిరంజీవి కాంబినేషన్ లో ఇంట్లోరామయ్య వీధిలో కృష్ణయ్య, ఆలయ శిఖరం, గూడచారి నెం1, సింహపురిసింహం లాంటి చిత్రాలు వచ్చాయి. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత 1995 డిసెంబర్ 14న “రిక్షావోడు” చిత్రంతో బాక్సాఫీస్ వద్ద పోటీలో నిలిచింది. ఈ రెండు చిత్రాలు రిక్షా అనే టైటిల్ తో వచ్చి బాక్సాఫీస్ బరిలో ఉండటం ప్రేక్షకులతో సహా సినీ పరిశ్రమ తీవ్ర ఉత్కంఠతో గమనించింది. బ్లాక్ బస్టర్ లాంటి చిత్రాలతో మోత మోగించిన మెగాస్టార్ ఈ సంవత్సరం ఊహించని విధంగా కొంత చతికిల పడ్డారు. ఆయన‌ నటించిన “రిక్షావోడు” చిత్రాన్ని వెనక్కు నెట్టి నారాయణమూర్తి తన రిక్షాను ముందుకు నడిపించి, బాక్సాఫీస్ వద్ద కనక వర్షాన్ని కురిపించాడు.