LB Sriram: తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా రచయితగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎల్బీ శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలలో అద్భుతమైన నటనను కనపరిచిన ఈయన రచయితగా కూడా పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందిన ఎల్బీ శ్రీరామ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ.. తాను దర్శకుడు క్రాంతి కుమార్ అన్ని సినిమాలకు తానే మాటలు రాస్తానని తెలిపారు. జయభేరి ప్రొడక్షన్స్ లో రాజేశ్వరి కళ్యాణం, వారసుడు సినిమాలు రెండు నిర్మిస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాలకు తాను మాటలు రాయాలని చెప్పారు.రాజేశ్వరి కళ్యాణంలో ఏఎన్ఆర్ గారి నటించగా వారసుడు సినిమాలో కృష్ణ గారు నాగార్జున గారు నటిస్తున్నారు. ఇలా వీరిద్దరికీ డైలాగులు రాయడం అంటే సర్వసాధారణమైన విషయం కాదని తెలిపారు.
నిజానికి జయభేరి వాళ్లు ముందుగా ఈ రెండు సినిమాలకు డైలాగులు రాయడానికి గణేష్ పాత్రోని తీసుకున్నారు. అతనికి కొంతమేర అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అయితే ఆయనను కాదని ఆ సినిమాలో డైలాగులు రాయడానికి నన్ను తీసుకున్నారని ఎల్బీ శ్రీరామ్ వెల్లడించారు.ఇకపోతే రాజేంద్ర ప్రసాద్ గారు నటించిన ఓ సినిమా కోసం ఈయన డైలాగులు రాసారని అయితే ఆ రోజు సినిమా షూటింగ్ మొదలు కాగా ఈ సినిమా కెమెరా స్విచ్ ఆన్ చేయడానికి, క్లాప్ కొట్టడానికి ప్రముఖ దర్శకులైనటువంటి రాఘవేంద్రరావు దాసరి గారిని ఆహ్వానించారని తెలిపారు.
ఈ సినిమా ముహూర్తం షార్ట్ కాగానే ఆహా ఎంత శుభవార్త చెప్పవయ్యా దాసరి రాఘవేంద్ర అనే డైలాగ్ రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. ఇలా ఈయన డైలాగ్ చెప్పడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయి భయంతో చెట్టు చాటున దాక్కున్నానని తెలిపారు. ఈ సినిమా ఓపెనింగ్ దాసరి రాఘవేంద్రరావు రావడం అదే సమయంలో డైలాగ్ చెప్పడంతో వారిద్దరూ నన్ను కొడతారని ఫిక్స్ అయిపోయి దాక్కున్నానని ఎల్బీ శ్రీరామ్ తెలిపారు.ఈ డైలాగ్ విన్నటువంటి దాసరి రాఘవేంద్ర రావు గారు ఎవరు అద్భుతంగా రాశారు అంటూ సంతోషం వ్యక్తం చేశారు. అప్పటికి నన్ను పిలిచి మన ఎల్బీ శ్రీరాం గారు ఈయన అద్భుతమైన రచయిత కానీ నోట్లో నాలుక లేదని రాజేంద్రప్రసాద్ పరిచయం చేయగా నాలుకను తీసి కలంలో పెడితే అతనికి నాలుక ఎక్కడుంటుంది అంటూ దాసరి చమత్కరించారంటూ ఎల్బీ శ్రీరామ్ ఈ సందర్భంగా తెలిపారు.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…