Connect with us

Featured

LB Sriram: ఏఎన్ఆర్ నాగార్జున సినిమాలకు అతనిని వద్దని నన్ను పెట్టుకున్నారు… దాసరి, రాఘవేంద్ర కొడతారేమోనని భయపడ్డాను: ఎల్బీ శ్రీరామ్

Published

on

LB Sriram: తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా రచయితగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎల్బీ శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలలో అద్భుతమైన నటనను కనపరిచిన ఈయన రచయితగా కూడా పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందిన ఎల్బీ శ్రీరామ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ.. తాను దర్శకుడు క్రాంతి కుమార్ అన్ని సినిమాలకు తానే మాటలు రాస్తానని తెలిపారు. జయభేరి ప్రొడక్షన్స్ లో రాజేశ్వరి కళ్యాణం, వారసుడు సినిమాలు రెండు నిర్మిస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాలకు తాను మాటలు రాయాలని చెప్పారు.రాజేశ్వరి కళ్యాణంలో ఏఎన్ఆర్ గారి నటించగా వారసుడు సినిమాలో కృష్ణ గారు నాగార్జున గారు నటిస్తున్నారు. ఇలా వీరిద్దరికీ డైలాగులు రాయడం అంటే సర్వసాధారణమైన విషయం కాదని తెలిపారు.

నిజానికి జయభేరి వాళ్లు ముందుగా ఈ రెండు సినిమాలకు డైలాగులు రాయడానికి గణేష్ పాత్రోని తీసుకున్నారు. అతనికి కొంతమేర అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అయితే ఆయనను కాదని ఆ సినిమాలో డైలాగులు రాయడానికి నన్ను తీసుకున్నారని ఎల్బీ శ్రీరామ్ వెల్లడించారు.ఇకపోతే రాజేంద్ర ప్రసాద్ గారు నటించిన ఓ సినిమా కోసం ఈయన డైలాగులు రాసారని అయితే ఆ రోజు సినిమా షూటింగ్ మొదలు కాగా ఈ సినిమా కెమెరా స్విచ్ ఆన్ చేయడానికి, క్లాప్ కొట్టడానికి ప్రముఖ దర్శకులైనటువంటి రాఘవేంద్రరావు దాసరి గారిని ఆహ్వానించారని తెలిపారు.

Advertisement

LB Sriram: దాసరి ప్రశంసలు కురిపించారు…


ఈ సినిమా ముహూర్తం షార్ట్ కాగానే ఆహా ఎంత శుభవార్త చెప్పవయ్యా దాసరి రాఘవేంద్ర అనే డైలాగ్ రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. ఇలా ఈయన డైలాగ్ చెప్పడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయి భయంతో చెట్టు చాటున దాక్కున్నానని తెలిపారు. ఈ సినిమా ఓపెనింగ్ దాసరి రాఘవేంద్రరావు రావడం అదే సమయంలో డైలాగ్ చెప్పడంతో వారిద్దరూ నన్ను కొడతారని ఫిక్స్ అయిపోయి దాక్కున్నానని ఎల్బీ శ్రీరామ్ తెలిపారు.ఈ డైలాగ్ విన్నటువంటి దాసరి రాఘవేంద్ర రావు గారు ఎవరు అద్భుతంగా రాశారు అంటూ సంతోషం వ్యక్తం చేశారు. అప్పటికి నన్ను పిలిచి మన ఎల్బీ శ్రీరాం గారు ఈయన అద్భుతమైన రచయిత కానీ నోట్లో నాలుక లేదని రాజేంద్రప్రసాద్ పరిచయం చేయగా నాలుకను తీసి కలంలో పెడితే అతనికి నాలుక ఎక్కడుంటుంది అంటూ దాసరి చమత్కరించారంటూ ఎల్బీ శ్రీరామ్ ఈ సందర్భంగా తెలిపారు.

Featured

AP politics: పొత్తు ధర్మాన్ని పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు.. పవన్ స్ట్రాంగ్ వార్నింగ్!

Published

on

AP politics: రేపు ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఎలాంటి పొత్తు లేకుండా ఎన్నికల బరిలోకి దిగిపోతుంది కానీ తెలుగుదేశం పార్టీతో జనసేన బిజెపి పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే ఇలా కూటమిగా ఏర్పడి ఎన్నికలలో గెలిచి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ముందుకు నడిపించాలని ధ్యేయంగా ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లు వెల్లడించారు.

ఇలా ఈ మూడు పార్టీల కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగుతున్నటువంటి తరుణంలో కొన్ని నియోజకవర్గాలలో పార్టీల కోసం ఎంతో కష్టపడినటువంటి వారికి సీట్లు రాకపోవడంతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోనే జనసేనలోనూ కూడా అభ్యర్థులు అలకలు మొదలుపెట్టారు. ఇటీవల బీజేపీ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయవాడ వెస్ట్ సీటు జనసేన పార్టీకే కేటాయిస్తారని, పార్టీ తరపున తనకే సీటు వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న పోతిన మహేష్ ఈ సీటు బీజేపీకి వెళ్లిపోవడంతో చాలా అసంతృప్తికి గురయ్యారు.

ఇలా బిజెపికి సేటు కేటాయించడంతో మహేష్ ఏకంగా జనసేన పార్టీ కార్యాలయం ముందు రెండు గంటల పాటు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఇక ఈయనని పవన్ కళ్యాణ్ పిలిపించుకొని తనని బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు పదవి తప్పకుండా ఇస్తామని చెప్పిన మహేష్ మాత్రం తనకు టికెట్ కావాలని కోరారు.

Advertisement

పొత్తు ధర్మాన్ని పాటించండి..
ఇలా అభ్యర్థులు సహకరించకపోవడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు.పొత్తు ధర్మాన్ని పాటిద్దామని కూటమిని గెలిపిద్దామంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రెస్‌నోట్‌ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసమే కూటమి ఏర్పాటు చేశామని ప్రస్తావించారు. ఆ పొత్తు ధర్మాన్ని పాటించకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

Advertisement
Continue Reading

Featured

AP Politics: షర్మిల సునీతపై జగన్ ఘాటు వ్యాఖ్యలు.. హంతకులకే మద్దతంటూ?

Published

on

AP Politics: ఏపీ ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నటువంటి తరుణంలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ బస్సు యాత్రలో భాగంగా ప్రొద్దుటూరులో బహిరంగ సభ నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ సభలో తన బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య గురించి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనగా మారాయి. మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరో రాష్ట్ర తెలుసనీ, తన చెల్లెలు షర్మిల సునీతను కూడా తమ రాజకీయాలలో పావులుగా వాడుకున్నారని తెలిపారు.

నా చెల్లెమ్మలు ఇద్దరూ కూడా హంతకులకే మద్దతు తెలుపుతున్నారని జగన్ మండిపడ్డారు. చెల్లెమ్మలు చిన్నాన్నను చంపిన వారితో చేతులు కలపగా నేను మాత్రం ప్రజల పక్షమే ఉంటానని జగన్ తెలిపారు. ఇలాంటి హంతకులతో అవినీతిపరులతో యుద్ధం చేయడానికి ఈ అర్జునుడు సిద్ధం మీరు సిద్ధమేనా అంటూ ఈ కార్యక్రమంలో జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.

Advertisement

కూటమి అంటే కుట్రలు..
వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు నాయుడికి 45 ఏళ్ల అనుభవం ఉందని చెప్పారు. ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి చంపి, ఆయన విగ్రహాలకు పూలమాలలు వేశారని అన్నారు. కూటమి అంటే కుట్రలు కుతంత్రాలని జగన్ తెలిపారు. తమ జెండా మాత్రం మరో జెండాతో జతకట్టలేదని చెప్పారు. కేంద్రం నుంచి ఓ పార్టీని తెచ్చుకున్నారని అన్నారు. ఇటీవల చోటుచేసుకున్న డ్రగ్స్‌ కేసు వెనుక చంద్రబాబు వదిన గారి చుట్టం ఉన్నారంటూ డ్రగ్స్ వ్యవహారంపై కూడా జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Continue Reading

Featured

Meena: రెండో పెళ్లి వార్తలపై ఘాటుగా రియాక్ట్ అయిన మీనా… డబ్బుల కోసమే అంటూ?

Published

on

Meena: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మీనా గురించి ఇటీవల కాలంలో తరచూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎప్పుడైతే ఈమె భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారో అప్పటినుంచి మీనా రెండో పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విధంగా మీనా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె ఇదివరకే పలు సందర్భాలలో రెండో పెళ్లి గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె మరోసారి రెండో పెళ్లి వార్తలపై స్పందించారు.

ఈ సందర్భంగా మీనా రెండో పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో దారుణమైనటువంటి వార్తలు వస్తున్నాయి. కేవలం డబ్బు కోసమే ఇలాంటి వార్తలు రాయొద్దు రాసేటప్పుడు నిజా నిజాలు తెలుసుకొని రాయాలని ఈమె సూచించారు.

Advertisement

అలాంటి ఆలోచన లేదు..
ఇప్పటికే రెండో పెళ్లి గురించి పలు సందర్భాలలో తాను చెప్పానని ఇప్పుడు కూడా చెబుతున్నానని తెలిపారు. తాను రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఏమాత్రం లేనని తనకు ఆ ఆలోచన కూడా లేదని తెలిపారు. ఒకవేళ అలాంటి ఆలోచనలు కలిగి నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ విషయాన్ని నేనే అందరికీ తెలియజేస్తాను అంటూ ఈ సందర్భంగా మీనా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!