Tag Archives: divorced

Manchu Manoj: విడాకులకు కారణాలు తెలిపిన మనోజ్… అందుకే ప్రణతితో విడిపోయారా?

Manchu Manoj: మంచు మనోజ్ గత నెల మూడవ తేదీ భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. గత నాలుగు సంవత్సరాలుగా మౌనికతో రిలేషన్ లో ఉన్నటువంటి మనోజ్ పెద్దలను ఒప్పించి పెద్దల సమక్షంలో తన వివాహాన్ని చేసుకున్నారు. అయితే ఇది ఇద్దరికీ రెండో పెళ్లి కావడం గమనార్హం. ఇలా పెళ్లి తర్వాత భూమా మౌనికతో కలిసి ఈయన పలు ప్రాంతాలకు వెళుతూ సందడి చేస్తున్నారు.

మొదటిసారి భార్యతో కలిసి మనోజ్ ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. వెన్నెల కిషోర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అలా మొదలైంది కార్యక్రమంలో ఈయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో ఈయన తన భార్యతో విడాకులు తీసుకోవడానికి గల కారణాలను వెల్లడించినట్టు తెలుస్తోంది.

ఈ కార్యక్రమంలో మనోజ్ మాట్లాడుతూ తనకు లవ్ లైఫ్ కావాలా లేదా నాకు నచ్చిన సినిమాలను ఎంపిక చేసుకొని కొనసాగాల అన్న సందిగ్ధంలో పడిపోయాను. నేను పంచిన ప్రేమ తిరిగి వెనక్కి రాలేదు. చాలా సార్లు నేను తన (ప్రణతి) కోసం ఇష్టం లేని పనులు చేయాల్సొచ్చింది. నాకు అసౌకర్యంగా అనిపించింది.
ఒక టైమ్ లో నేను ఎక్కడ నిలబడి ఉన్నాను? ఎవరి కోసం నిలబడ్డానో తెలియక తికమక పడ్డాను. అప్పుడే విడాకులు తీసుకున్నాను అంటూ తెలిపారు.

Manchu Manoj: నాలుగేళ్ల ప్రేమ….


2015 వ సంవత్సరంలో ఎంతోమంది అతిరథ మహారధుల సమక్షంలో ప్రణతి రెడ్డి మెడలో మూడు ముళ్ళు వేసిన మనోజ్ 2019వ సంవత్సరంలో విడిపోయారు. అనంతరం ఒంటరిగా ఉన్న ఈయన గత నాలుగు సంవత్సరాలుగా భూమా మౌనికతో ప్రేమలో ఉన్నారని,అందరిని ఒప్పించి తమ పెళ్ళి చేసుకున్నా అంటూ ఈ సందర్భంగా మనోజ్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Krishna Vamshi: మరోసారి విడాకుల వార్తలపై ఘాటుగా స్పందించిన డైరెక్టర్ కృష్ణ వంశీ… శాడిస్ట్ పనులంటూ కామెంట్స్!

Krishna Vamshi: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ కృష్ణ వంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. అయితే ఈ మధ్యకాలంలో కృష్ణవంశీ చాలా తక్కువ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా కృష్ణ వంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణతో రంగమార్తాండ అనే సినిమాతో బిజీగా ఉన్నారు.

త్వరలోనే ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ సినిమా గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు అదే విధంగా తన వ్యక్తిగత విషయాల గురించి కూడా ఈ సందర్భంగా మాట్లాడారు.గత కొంతకాలంగా రమ్యకృష్ణ కృష్ణవంశీ విడాకులు తీసుకున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి అయితే ఈ విడాకులు వార్తలను కృష్ణవంశీ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు.

తాజాగా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మరోసారి విడాకుల ప్రస్తావన రావడంతో కృష్ణవంశీ ఈ విషయం గురించి మాట్లాడుతూ నేను రమ్యకృష్ణ విడివిడిగా ఉంటున్నాం అయితే వృత్తిపరమైన విషయాల వల్ల తను చెన్నైలోనూ నేను హైదరాబాదులోనూ ఉంటున్నాము తప్ప మా ఇద్దరికీ ఎలాంటి మనస్పర్ధలు లేవని మేము విడాకులు తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు.

Krishna Vamshi: వృత్తిపరంగా ఇద్దరం విడిగా ఉంటున్నాం…

ఇలా మేమిద్దరం విడాకులు తీసుకున్నామంటూ వార్తలు రావడం చాలా బాధాకరం. ఇలాంటి వార్తలను రాసిన వారిని చూస్తే చాలా పాపం అనిపిస్తుంది. రాయడానికి ఇంతకన్నా ఎక్కువగా ఆలోచించలేకపోతున్నారా అనిపిస్తుందని ఇలాంటి పనులన్నీ చాలా శాడిస్ట్ పనులంటూ ఈ సందర్భంగా కృష్ణవంశీ మరోసారి తన విడాకుల వార్తలపై స్పందించి ఘాటుగా రిప్లై ఇచ్చారు. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రముఖ సీరియల్ నటి పల్లవిని.. ఆ పని చేసినందుకు బ్యాన్ చేశారట..

పల్లవి గౌడ ప్రముఖ తెలుగు సీరియల్ నటి. ఆమె 1993 లో సెప్టెంబర్ లో కర్ణాటకలో జన్మించారు. మొదట ఆమె 2010 సంత్సరంలో ‘మనే ఒండు మూర్’ ఈటీవీ కన్నడలో ప్రసారం అయిన సీరియల్ లో నటించారు. అప్పటి నుంచి ఆమె బుల్లితెర ప్రస్థానం మొదలైంది. ఇక తెలుగు విషయానికి వస్తే.. 2011 నుంచి 2014 వరకు ప్రసారం అయిన ‘పసుపు కుంకుమ’ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయం అయ్యారు.

తర్వాత 2014 లోనే సావిత్రి అనే సీరియల్ లో కూడా ఆమె నటించారు. తర్వాత తెలుగుకు మళ్లీ దూరం అయి కన్నడం, మళయాలంలో ఎన్నో రకాల సీరియల్స్ ను చేసింది. ప్రస్తుతం పల్లవి.. తెలుగులో రెండు సీరియల్స్ లో నటిస్తోంది. అందులో ఒకటి చదరంగం.. మరొకటి సూర్యాకాంతం. చదరంగంలో కొంచెం నెగెటీవ్ రోల్స్ లో నటిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఆమెను ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో బ్యాన్ చేశారని ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది. ఎందుకంటే.. సావిత్రి సీరియల్ లో నటించే క్రమంలో అప్పుడు మరే సీరియల్ నటించనని అగ్రిమెంట్ తీసుకున్నారట. ఆమె కూడా దానికి ఒప్పుకొని సంతకం కూడా చేసింది.

కానీ వాళ్లు అదే అదునుగా భావించి చేసిన పనికి కనీసం పేమెంట్ ఇవ్వకుండా తిప్పారని.. అందుకే తాను మరో సీరియల్ చేయడానికి చేసేందుకు సిద్ధం అయినట్లు పేర్కొన్నారు. ఇచ్చిన అగ్రిమెంట్ ను బ్రేక్ చేసినందకు ఆమెపై బ్యాన్ విధించినట్లు ఆమె చెప్పారు. తర్వాత చాలా రోజుల తర్వాత మళ్లీ తెలుగులో ఆమె చదరంగం, సూర్యాకాంతం అనే సీరియల్స్ లో నటిస్తోంది.

భర్తతో విడిపోయిన భార్య..కొన్నాళ్ళకు తన భర్త తండ్రిని వివాహం చేసుకుంది.. కానీ చివరికి?

ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు..కొద్ది రోజులు సుఖంగా సాగిన వారి సంసారంలో కొన్ని విభేదాలు రావడంతో తన భర్తతో విడాకులు తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది.ఆమె వెళ్ళిపోయిన కొన్ని రోజులకు తన తండ్రి కూడా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తన తండ్రి ఆచూకీ కోసం ఫిర్యాదు చేసిన కొడుకు దిమ్మతిరిగే నిజం బయటపడింది.తనతో విడాకులు తీసుకున్న భార్య తన తండ్రిని పెళ్లి చేసుకుని భార్య స్థానం నుంచి సవతి తల్లి గా మారిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​ బదాయూ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

2016వ సంవత్సరంలో ఓ వ్యక్తి ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆరునెలల పాటు ఎంతో సుఖంగా సాగిన వారి సంసారంలో అభిప్రాయభేదాలు వచ్చాయి. తరచు వారిరువురు ఏదో ఒక కారణం చేత గొడవ పడేవారు.ఈ క్రమంలోనే తన భర్త తాగుడును భరించలేకపోతున్నానని సదరు యువతి విడాకులను తీసుకుంది.విడాకులు ఇచ్చినప్పటికీ తిరిగి తన భర్త భార్యతో కలిసి జీవించాలని ప్రయత్నించాలని చూసిన ఆమె నిరాకరించింది.

ఈ విధంగా తన భార్య విడాకులు తీసుకున్న కొంతకాలానికి తన తండ్రి కూడా ఇంటి నుంచి మాయమయ్యాడు. ఈ క్రమంలోనే తన తండ్రి ఆచూకీ కోసం ఆ కొడుకు జిల్లా పంచాయతీ అధికారులను ఆశ్రయించాడు. తన తండ్రి వివరాలు సేకరించాలని ఆర్​టీఐ దాఖలు చేశాడు. ఇక్కడే అసలు ఈ విషయం బయటపడింది. తన తండ్రి తాను విడాకులు ఇచ్చిన భార్యను పెళ్లి చేసుకుని సంభాల్​ ప్రాంతంలో కలిసి జీవిస్తున్నారని తెలియడంతో ఆ కొడుకు దిమ్మతిరిగిపోయింది.

తనకు భార్యగా ఉండాల్సిన ఆమె తన తండ్రిని పెళ్లిచేసుకుని సవతి తల్లిగా మారింది అన్న విషయం తెలియగానే అతని నోట మాట రాలేదు. క్రమంలోనే పోలీసులు వీరిని పిలిచి పంచాయతీ పెట్టగా సదరు యువతి తన మొదటి భర్త కన్నా తన రెండవ భర్తతో తనకు సుఖంగా ఉందని మొదటి భర్త దగ్గరకు వెళ్లే ప్రసక్తే లేదని ఆ మహిళ తేల్చి చెప్పడం గమనార్హం.