ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు..కొద్ది రోజులు సుఖంగా సాగిన వారి సంసారంలో కొన్ని విభేదాలు రావడంతో తన భర్తతో విడాకులు తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది.ఆమె వెళ్ళిపోయిన కొన్ని రోజులకు తన తండ్రి కూడా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తన తండ్రి ఆచూకీ కోసం ఫిర్యాదు చేసిన కొడుకు దిమ్మతిరిగే నిజం బయటపడింది.తనతో విడాకులు తీసుకున్న భార్య తన తండ్రిని పెళ్లి చేసుకుని భార్య స్థానం నుంచి సవతి తల్లి గా మారిన ఘటన ఉత్తర్ప్రదేశ్ బదాయూ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
2016వ సంవత్సరంలో ఓ వ్యక్తి ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆరునెలల పాటు ఎంతో సుఖంగా సాగిన వారి సంసారంలో అభిప్రాయభేదాలు వచ్చాయి. తరచు వారిరువురు ఏదో ఒక కారణం చేత గొడవ పడేవారు.ఈ క్రమంలోనే తన భర్త తాగుడును భరించలేకపోతున్నానని సదరు యువతి విడాకులను తీసుకుంది.విడాకులు ఇచ్చినప్పటికీ తిరిగి తన భర్త భార్యతో కలిసి జీవించాలని ప్రయత్నించాలని చూసిన ఆమె నిరాకరించింది.
ఈ విధంగా తన భార్య విడాకులు తీసుకున్న కొంతకాలానికి తన తండ్రి కూడా ఇంటి నుంచి మాయమయ్యాడు. ఈ క్రమంలోనే తన తండ్రి ఆచూకీ కోసం ఆ కొడుకు జిల్లా పంచాయతీ అధికారులను ఆశ్రయించాడు. తన తండ్రి వివరాలు సేకరించాలని ఆర్టీఐ దాఖలు చేశాడు. ఇక్కడే అసలు ఈ విషయం బయటపడింది. తన తండ్రి తాను విడాకులు ఇచ్చిన భార్యను పెళ్లి చేసుకుని సంభాల్ ప్రాంతంలో కలిసి జీవిస్తున్నారని తెలియడంతో ఆ కొడుకు దిమ్మతిరిగిపోయింది.
తనకు భార్యగా ఉండాల్సిన ఆమె తన తండ్రిని పెళ్లిచేసుకుని సవతి తల్లిగా మారింది అన్న విషయం తెలియగానే అతని నోట మాట రాలేదు. క్రమంలోనే పోలీసులు వీరిని పిలిచి పంచాయతీ పెట్టగా సదరు యువతి తన మొదటి భర్త కన్నా తన రెండవ భర్తతో తనకు సుఖంగా ఉందని మొదటి భర్త దగ్గరకు వెళ్లే ప్రసక్తే లేదని ఆ మహిళ తేల్చి చెప్పడం గమనార్హం.
వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీరసం తగ్గించుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరంగా మారింది. ఈ…
మన జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద మార్పులకు దారి తీస్తాయి. అలాంటి వాటిలో ఉదయం వేళ లేవడం ఒక…
ముఖం ఎప్పుడూ ఫ్రెష్గా, కాంతివంతంగా కనిపించడం ప్రతి ఒక్కరికీ ఇష్టం. అయితే కొన్నిసార్లు కారణం తెలియకుండానే ముఖం ఉబ్బినట్లు, ఎర్రబడినట్లు…
భారతీయ వంటింట్లో చింతపండు లేకుండా చాలా వంటలు పూర్తవవు. పులుపు రుచిని ఇచ్చే ఈ సహజ పదార్థం కేవలం రుచికే…
భారతీయ కరెన్సీ నోట్లపై కనిపించే చిత్రాలు కేవలం అలంకరణ కోసం మాత్రమే కాకుండా, దేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా…
హైదరాబాద్లో చోటుచేసుకున్న ఒక అరుదైన వైద్య ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేవలం కొన్ని రసగుల్లాలు తిన్న తర్వాత 35…