డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలను రవాణా చేస్తూ పట్టుబడకుండా ఉండటం కోసం దుండగులు సరికొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఇదివరకు ఈ విధంగా మాదకద్రవ్యాలను ఎన్నో రకాలుగా రవాణా చేస్తూ అధికారులకు పట్టుబడిన దుండగులు తాజాగా మరోసారి హెరాయిన్ ను గాజులలో రవాణా చేస్తున్నట్లు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ హెరాయిన్ విలువ సుమారు 7.5 కోట్లు ఉంటుందని అధికారులు తెలియజేశారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ హెరాయిన్ ను సన్నని పైపులలోకి పెట్టి వాటిని గాజులు లాగా చుట్టి రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ హెరాయిన్ ను దక్షిణాఫ్రికా నుంచి డిల్లీలోని ఓ చిరునామాకు దిగుమతి చేసినట్లు అధికారులు తెలియజేశారు. ఈ క్రమంలోనే వీటికి సంబంధించిన ఫోటోలను కస్టమ్స్ అధికారులు ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.
ఈ క్రమంలోనే అధికారులు మాట్లాడుతూ గత వారంలో దక్షిణాఫ్రికా దేశస్తులు ఏకంగా 126 కిలోల హెరాయిన్ను స్మగ్లింగ్ చేస్తూ దిల్లీ కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ విధంగా హెరాయిన్ను గాజులలో పెట్టె స్మగ్లింగ్ చేస్తున్న పార్సిల్ ను అధికారులు గుర్తించి అసలు విషయాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ కావడంతో ఫోటోలు చూసిన నెటిజన్లు వీళ్ళ తెలివి మామూలుగా లేదంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…