Tag Archives: ganesh

Manchu Manoj: దేవుడికి వినాయకుడు దొరికినట్లు నాకు బాబు దొరికాడు … మంచు మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..?

Manchu Manoj: గత కొంతకాలంగా మంచు కుటుంబం తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఇటీవల మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. మా ఇండస్ట్రీకి చెందిన మంచూ మనోజ్ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చిన భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకోవడంతో వీరి పెళ్లి వార్తా వైరల్ గా మారింది . గత కొంతకాలంగా ప్రేమించుకున్న వీరిద్దరూ ఇటీవల పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అయితే వీరిద్దరికి ఇది రెండవ వివాహం.

ఇద్దరూ కూడా తమ మొదటి వివాహాన్ని రద్దు చేసుకొని తాజాగా ఇద్దరు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
వివాహం తర్వాత మొదటిసారిగా మనోజ్ మౌనిక ఇద్దరూ కలిసి వెన్నెల కిషోర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అలా మొదలైంది షోకి హాజరయ్యారు. ఈ షోలో మనోజ్ మౌనిక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరికి ఇష్టం ఉందనే విషయం మొదట ఎవరికి అనిపించింది?ఎవరు చెప్పారు? అని వెన్నెల కిషోర్ ప్రశ్నించగా.. మనోజ్ స్పందిస్తూ తానే మొదట ప్రపోజ్ చేశానని తెలిపాడు.

మౌనిక పడిన కష్టాలు చూసిన తర్వాత నా బాధలు చాలా చిన్నవి అనిపించాయి. అప్పుడు నువ్వేంటే ఇష్టం, నువ్వు ఒప్పుకొంటే నిన్ను, బాబుని నా జీవితంలోకి ఆహ్వానిస్తా అని చెప్పాను అంటూ మంచు మనోజ్ తెలిపాడు. అప్పుడు మౌనిక సరిగానే ఆలోచించి చెప్పావా? ఈ సొసైటీ గురించి, ఇంట్లో వల్ల గురించి ఆలోచించావా? అని ప్రశ్నించింది . అవన్నీ నేను పట్టించుకోను… ఇంట్లో వాళ్ళని ఒప్పించటం అది నా సమస్య..అవన్నీ నేను చూసుకుంటాను అని చెబితే మౌనిక ఒప్పుకుంది అంటూ మనోజ్ తెలిపాడు.

Manchu Manoj: వనవాసం చేసాము…


మౌనిక నా ప్రపోజల్ కి ఒప్పుకోవడంతో శివుడికి వినాయకుడు దొరికినట్లు నాకు బాబు దొరికాడు. ఆ తర్వాతే మా వనవాసం మొదలైంది అంటూ మనోజ్ తెలిపాడు . ఆ తర్వాత ఇక్కడే ఉంటే మాకు ప్రమాదమని తెలిసి దేశాలు తిరుగు వనవాసం చేసాము అంటూ తమ ప్రేమ, పెళ్ళి గురించి మనోజ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

Savitri: ఆరోజు సావిత్రి బాగా తాగొచ్చు బోరున ఏడ్చింది… ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జమున!

Savitri: సీనియర్ నటిమని సావిత్రి గురించి పరిచయం అవసరం లేదు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన సావిత్రి చివరి రోజులలో చాలా దుర్భరనీయమైన పరిస్థితులను ఎదుర్కొని మరణించారు.చిత్ర పరిశ్రమలో తన సహజ నటనతో ఎంతోమందిని మెప్పించిన ఈమెకు వరుస అవకాశాలు వచ్చాయి. అయితే ఒకానొక సమయంలో స్టార్ హీరోలు కూడా ఈమె డేట్ ల కోసం ఎదురుచూసే స్థాయికి సావిత్రి ఎదిగింది.

ఇలా చిత్ర పరిశ్రమలో సహజ నటిగా మహానటి అనే బిరుదు సంపాదించుకున్న సావిత్రి వ్యక్తిగత జీవితంలో కూడా అంతే ఉదార స్వభావం కలిగి ఉండేవారు. తన వద్దకు ఎవరైనా ఏదైనా కష్టం వచ్చిందని వస్తే చాలు వెనక ముందు ఆలోచించకుండా వారికి సహాయం చేసేవారు.అయితే ఈమె ఎప్పుడైతే నటుడు జెమినీ గణేషన్ను పెళ్లి చేసుకుందో ఒక్కసారిగా ఆమె జీవితం తలకిందులుగా మారిపోయింది.

ఈమె పై ప్రేమతో కాకుండా ఈమె సంపాదించిన ఆస్తి కోసమే జెమినీ గణేషన్ తనని పెళ్లి చేసుకొని తనని చాలా ఇబ్బందులకు గురి చేశారని అందరికీ తెలిసిన సత్యం.ఇక ఇండస్ట్రీలో సావిత్రి జమున ఇద్దరూ అక్క చెల్లెలుగా ఉండేవారు. వీరిద్దరూ కలిసి పలు సినిమాలలో నటించారు. అయితే తాజాగా జమున ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సావిత్రి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

Savitri: జెమినీ గణేషన్ పెళ్లితో తలకిందులైన సావిత్రి జీవితం….

ఈ సందర్భంగా జమున మాట్లాడుతూ నేను సావిత్రి ఇద్దరు అక్కచెల్లెళ్లుగా ఉండే వాళ్ళం అయితే నా కుమారుడు బారసాల ఫంక్షన్ కోసం సావిత్రిని ఆహ్వానించాను. ఆరోజు ఆమె ఫుల్లుగా తాగి బారసాల కార్యక్రమానికి వచ్చిందని తెలిపారు. ఇలా తాగి నా కుమారుడిని ఎత్తుకొని ముద్దులు పెట్టిందని అనంతరం తనని ఒక గదిలోకి తీసుకెళ్లి తనని హత్తుకొని బోరున ఏడ్చిందని జమున తెలిపారు.నువ్వు చాలా అదృష్టవంతురాలివే చెల్లి మంచి భర్త కుమారుడు నిండు సంసారం కానీ నాకు ఆ అదృష్టం లేదు అంటూ సావిత్రి ఏడ్చిందని జమున అప్పటి విషయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

తల్లికాబోతున్న కాజల్.. విశ్రాంతి అందుకేనా?

తెలుగు, తమిళంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఆమె 2007లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కల్యాణం సినిమాలో కథానాయికగా తెలుగు తెరకు పరిచమయింది. ఈమె 2009లో హీరో చిరంజీవి తనయుడైన రామ్ చరణ్ తేజ తో రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంతో నటించింది.

ఈమెకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ నిచ్చిన సినిమా ఇదే. మళ్ళీ అదే సంవత్సరం హీరో రామ్ పోతినేని తో కలిసి గణేష్, అల్లు అర్జున్ తో ఆర్య 2 లో నటించింది. ఇలా తెలుగులో పలు సినిమాల్లో నటించింది కాజల్. అయితే గత ఏడాది ఆమె గౌత‌మ్ కిచ్లుని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా సినిమాలను చేస్తోంది.మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం మెగస్టార్ సరసన ఆచార్యలో కూడా నటిస్తోంది. అంతేకాకుండా ఆమె మరో సినిమాలో ఉగ్రవాదుల సీక్రెట్స్ తెలుసుకోవడానికి ఓ వేశ్య పాత్రలో కనిపించబోతోందట. దానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తుండగా.. నాగ్ హీరోగా ఉన్నారు. వేశ్య పాత్ర అని తెలుసుకున్న అభిమానులు షాక్ అయ్యారు. అలాంటి పాత్రను ఎందుకు ఎంచుకున్నారంటూ.. సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

ఇదంతా ఇలా ఉండగా.. ఆమె గర్భం దాల్చింది అనే వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు జోరుగా చర్చించుకుంటున్నారు. తమ వద్ద ఉన్న సినిమాల్లో షూటింగ్ ను దాదాపు పూర్తి చేశారు. తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి కూడా తీసుకోనున్నారంటూ ప్రచారం జరుగుతోంది.