Manchu Manoj: గత కొంతకాలంగా మంచు కుటుంబం తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఇటీవల మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. మా ఇండస్ట్రీకి చెందిన మంచూ మనోజ్ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చిన భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకోవడంతో వీరి పెళ్లి వార్తా వైరల్ గా మారింది . గత కొంతకాలంగా ప్రేమించుకున్న వీరిద్దరూ ఇటీవల పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అయితే వీరిద్దరికి ఇది రెండవ వివాహం.
ఇద్దరూ కూడా తమ మొదటి వివాహాన్ని రద్దు చేసుకొని తాజాగా ఇద్దరు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
వివాహం తర్వాత మొదటిసారిగా మనోజ్ మౌనిక ఇద్దరూ కలిసి వెన్నెల కిషోర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అలా మొదలైంది షోకి హాజరయ్యారు. ఈ షోలో మనోజ్ మౌనిక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరికి ఇష్టం ఉందనే విషయం మొదట ఎవరికి అనిపించింది?ఎవరు చెప్పారు? అని వెన్నెల కిషోర్ ప్రశ్నించగా.. మనోజ్ స్పందిస్తూ తానే మొదట ప్రపోజ్ చేశానని తెలిపాడు.
మౌనిక పడిన కష్టాలు చూసిన తర్వాత నా బాధలు చాలా చిన్నవి అనిపించాయి. అప్పుడు నువ్వేంటే ఇష్టం, నువ్వు ఒప్పుకొంటే నిన్ను, బాబుని నా జీవితంలోకి ఆహ్వానిస్తా అని చెప్పాను అంటూ మంచు మనోజ్ తెలిపాడు. అప్పుడు మౌనిక సరిగానే ఆలోచించి చెప్పావా? ఈ సొసైటీ గురించి, ఇంట్లో వల్ల గురించి ఆలోచించావా? అని ప్రశ్నించింది . అవన్నీ నేను పట్టించుకోను… ఇంట్లో వాళ్ళని ఒప్పించటం అది నా సమస్య..అవన్నీ నేను చూసుకుంటాను అని చెబితే మౌనిక ఒప్పుకుంది అంటూ మనోజ్ తెలిపాడు.
మౌనిక నా ప్రపోజల్ కి ఒప్పుకోవడంతో శివుడికి వినాయకుడు దొరికినట్లు నాకు బాబు దొరికాడు. ఆ తర్వాతే మా వనవాసం మొదలైంది అంటూ మనోజ్ తెలిపాడు . ఆ తర్వాత ఇక్కడే ఉంటే మాకు ప్రమాదమని తెలిసి దేశాలు తిరుగు వనవాసం చేసాము అంటూ తమ ప్రేమ, పెళ్ళి గురించి మనోజ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…