Tag Archives: gang rape

యువతిపై నలుగురు యువకుల సామూహిక అత్యాచారం.. ఆసుపత్రి గదిలోనే దారుణంగా..

నిజామాబాద్‌లో దారుణ ఘటన జరిగింది. యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి చేత బలవంతంగా మద్యం తాగించి.. ఆమె స్పృహ కోల్పోయాక బస్టాండ్ సమీపంలోని ఓ ఆస్పత్రి గదిలోకి తీసుకువెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. దీనిపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి.. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు ఇలా తెలిపారు.

దేశంలో హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కఠిన చట్టాలు ఉన్నా.. ఉరి శిక్షలు పడుతున్నా.. కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఒకానొక సందర్భాల్లో ఎన్ కౌంటర్ చేస్తున్నా చలనం లేకుండా ప్రవర్తిస్తున్నారు. వాయివరుసుల మరిచి మరీ తల్లి, సోదరి అన్న తేడా లేకుండా వ్యవహరిస్తున్నారు. సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారిపై హత్యాచార ఘటన మరవక ముందే నిజామాబాద్ లో ఈ ఘటన చోటుచేసుకుది.

పట్టణంలో ఓ ప్రవేట్ ఆసుపత్రిలో ఓ యువతి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ ఆమెపై నలుగురు కామాంధులు కన్నేశారు. ఆ ఆసుపత్రిలోనే ఆమెను బలవంతంగా ఓ రూంకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ఆ యువతి అరుపులు, కేకలు విన్న సెక్యూరిటీ సిబ్బంది గదిలోకి వెళ్లి చూశారు. ఆమెపై అత్యాచారం జరిగిందని గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. ఆమెకు బలవంతంగా మద్యం తాపించి.. సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఎనిమిది నెలలుగా ఓ మైనర్ బాలికపై ఐదుగురు అత్యాచారం.. చివరకు ఆమె గర్భం దాల్చడంతో..

ఎనిమిది నెలలుగా ఓ మైనర్ బాలికపై కామాంధులు అత్యాచారం చేశారు. వారి కారణంగా బాలిక ఇటీవల గర్భం దాల్చి.. బిడ్డకు జన్మనిచ్చింది. ఆ అత్యాచారంలో తన బంధువుతో పాటు మరో నలుగురు ఉన్నారు. దీంతో ఆమె ఆ బిడ్డను బావిలో ఆ బాలిక బంధువు పడేశాడు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..కామాంధులు రెచ్చిపోతున్నారు.

వాయి వరసులు మరిచి అయిన వాళ్లపై కూడా ఏ మాత్రం కనికరంలేకుండా అత్యాచారాలకు పాల్పడతున్నారు. మధ్యప్రదేశ్ లోని గ్రామానికి చెందిన ఓ బాలిక(14) తల్లి మూడేళ్ల క్రితమే మరణించింది. ఉపాధి కోసం ఆ బాలిక తండ్రి ఇతర ప్రాంతాలకు వెళ్తుంటాడు. ఇంట్లో ఒంటరిగా ఆమె ఉంటున్న విషయాన్ని ఆమె సమీప బంధువు(21) గమనించాడు.

ఇది గమనించి ఆమెపై 8 నెలల క్రితం అత్యాచారం చేశాడు. అతడికి సంబంధించి మరో నలుగురు స్నేహితులు కూడా.. ఈ విషయాన్ని తాము మీ నాన్నకు చెబుతాం అంటూ బెదిరించి .. అత్యాచారం చేశారు. అప్పటి నుంచి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశారు. ఇటీవల ఆమె గర్భం దాల్చిన విషయం వాళ్లకు తెలవడంతో టాబ్ లెట్స్ ఇచ్చి ఆ గర్భాన్ని పోగొట్టాలని చూశారు. తీవ్ర నొప్పితో ఆమె రక్తస్రావం అయి.. బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాలికను తమ సమీప బంధువు బావిలో పడేశాడు.

బావిలో శిశువు మృతదేహంపై పోలీసులకు సమాచారం అందడంతో మొదట బాలికను అదుపులోకి తీసుకొని విచారంచగా.. ఆమె జరిగినది అంతా చెప్పింది. ఆమెను అత్యాచారం చేసిన వారిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. ప్రధాన నిందితుడిని..అతడి స్నేహితుపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను, అందులో ఉన్న ఇద్దరు మైనర్లను జువైనల్ హోమ్ కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

మహిళపై సామూహిక అత్యాచారం.. వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా దారుణం..

గుంటూరు జిల్లాలో మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. సత్తెనపల్లి మండలానికి చెందిన దంపతులు గుంటూరులో ఓ వివాహానికి హాజరై బైక్‌పై తిరిగి ఇంటికి వెళుతుండగా మేడికొండూరు అడ్డురోడ్డు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దంపతులను అడ్డగించిన కొందరు దుండగులు భర్తపై దాడిచేసి ఆ తర్వాత కత్తులతో బెదిరించి మహిళను పొలాల్లోకి తీసుకుని వెళ్లి అక్కడ సామూహిక అత్యాచారం చేశారు.

ఈ సంఘటనపై బాధిత మహిళ అర్ధరాత్రి సత్తెనపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. అస్సలు ఈ విషయం గురించే పట్టించుకోలేదు. ఎందుకు ఫిర్యాదు తీసుకోరని సదరు మహిళ ప్రశ్నించగా.. ఘటన జరిగిన ప్రదేశం గుంటూరు అర్బన్‌ ఎస్పీ పరిధిలోకి వస్తుందని తమ పోలీస్‌స్టేషన్‌ గుంటూరు రూరల్‌ పరిధిలో ఉంటుందన్నారు. ఈ మాట విన్న సదరు మహిళకు ఎం చేయాలో అర్థం కాలేదు. ఈ విషయం తెలిసిన వారు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఘటన ఎక్కడ జరిగినా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. కేసును సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేస్తారు. ఇటువంటివి సినిమాల్లో.. నిజ జీవితంతో కూడా ఎన్నో ఘటనలు జరిగాయి. వార్తాలు కూడా వచ్చాయి. కానీ ఆ పోలీసులకు ఇలాంటి చిన్న విషయం కూడా తెలియకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో పోలీసులకు సెక్షన్లపై అవగాహన లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతన్నాయి. కష్టకాలంలో ఉన్న మహిళ వచ్చి ఫిర్యాదు చేస్తే.. తమ పరిధిలో కాదంటూ చెప్పడం కరెక్ట్ కాదని.. సాటి మనిషిగా కూడా ఆ సమయంలో సహాయం చేయాలనే ఆలోచన రావాలి.

అలాంటప్పుడే మనవత్వానికి విలువ ఉంటుంది. అలా కాకుండా.. ఫిర్యాదు తీసుకోకుండా.. ఆమె చెప్పే విషయాలను పట్టించుకోకుండా ఉండటంతో ఆ పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న అవగాహన కూడా లేకుండా ఎలా విధులు నిర్వర్తసున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

16 ఏళ్ల మైనర్ బాలికపై.. ఐదుగురు యువకుల అత్యాచారం.. చివరకు ఆ బాలిక..!

ప్రతీ రోజు ఏదో ఒక ప్రదేశంలో హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాల వార్తలు వింటూనే ఉన్నాం. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా వాళ్లు మాత్రం మారడం లేదు. అదే కోవలో వెళ్తూనే ఉన్నారు. తాజాగా జరిగిన ఓ ఘటనలో.. మైనర్ బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇది రాజస్థాన్ లో జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

రాజస్థాన్ రాష్ట్రం నాగపూర్ జిల్లాకు చెందిన 16ఏళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇది గమనించిన పక్కింటి వ్యక్తి హరిప్రసాద్ ఏదో పని ఉందని.. ఇంటికి పిలిచాడు. తెలిసిన వాడే కదా అని ఆమె వాళ్ల ఇంటికి వెళ్లింది. అక్కడకు వెళ్లిన ఆ బాలికకు అతడితో పాటు .. మరో నలుగురు వ్యక్తులు కూడా కనిపించారు. ఆమె ఇంట్లోకి రాగానే తలుపు వేశాడు హరిప్రసాద్.

ఆమె కేకలు వేయడంతో నోరు మూశారు. తర్వాత ఐదుగురు యువకులు ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించారు.. తర్వాత ఆ బాలికను ఇంటికి పంపించారు. ఆమె ప్రవర్తనలో ఆ రోజు నుంచి మార్పు వచ్చింది. ఇది గమనించిన తల్లిదండ్రులు ఆ బాలికపై అనుమానం వచ్చింది.

ఆ బాలికను తల్లిదండ్రులు గట్టిగా నిలదీయగా.. జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆ ఐదుగురిలో ఒకరు మైనర్ కూడా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.