ప్రతీ రోజు ఏదో ఒక ప్రదేశంలో హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాల వార్తలు వింటూనే ఉన్నాం. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా వాళ్లు మాత్రం మారడం లేదు. అదే కోవలో వెళ్తూనే ఉన్నారు. తాజాగా జరిగిన ఓ ఘటనలో.. మైనర్ బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇది రాజస్థాన్ లో జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
రాజస్థాన్ రాష్ట్రం నాగపూర్ జిల్లాకు చెందిన 16ఏళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇది గమనించిన పక్కింటి వ్యక్తి హరిప్రసాద్ ఏదో పని ఉందని.. ఇంటికి పిలిచాడు. తెలిసిన వాడే కదా అని ఆమె వాళ్ల ఇంటికి వెళ్లింది. అక్కడకు వెళ్లిన ఆ బాలికకు అతడితో పాటు .. మరో నలుగురు వ్యక్తులు కూడా కనిపించారు. ఆమె ఇంట్లోకి రాగానే తలుపు వేశాడు హరిప్రసాద్.
ఆమె కేకలు వేయడంతో నోరు మూశారు. తర్వాత ఐదుగురు యువకులు ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించారు.. తర్వాత ఆ బాలికను ఇంటికి పంపించారు. ఆమె ప్రవర్తనలో ఆ రోజు నుంచి మార్పు వచ్చింది. ఇది గమనించిన తల్లిదండ్రులు ఆ బాలికపై అనుమానం వచ్చింది.
ఆ బాలికను తల్లిదండ్రులు గట్టిగా నిలదీయగా.. జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆ ఐదుగురిలో ఒకరు మైనర్ కూడా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…