ప్రతీ రోజు ఏదో ఒక ప్రదేశంలో హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాల వార్తలు వింటూనే ఉన్నాం. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా వాళ్లు మాత్రం మారడం లేదు. అదే కోవలో వెళ్తూనే ఉన్నారు. తాజాగా జరిగిన ఓ ఘటనలో.. మైనర్ బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇది రాజస్థాన్ లో జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
రాజస్థాన్ రాష్ట్రం నాగపూర్ జిల్లాకు చెందిన 16ఏళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇది గమనించిన పక్కింటి వ్యక్తి హరిప్రసాద్ ఏదో పని ఉందని.. ఇంటికి పిలిచాడు. తెలిసిన వాడే కదా అని ఆమె వాళ్ల ఇంటికి వెళ్లింది. అక్కడకు వెళ్లిన ఆ బాలికకు అతడితో పాటు .. మరో నలుగురు వ్యక్తులు కూడా కనిపించారు. ఆమె ఇంట్లోకి రాగానే తలుపు వేశాడు హరిప్రసాద్.
ఆమె కేకలు వేయడంతో నోరు మూశారు. తర్వాత ఐదుగురు యువకులు ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించారు.. తర్వాత ఆ బాలికను ఇంటికి పంపించారు. ఆమె ప్రవర్తనలో ఆ రోజు నుంచి మార్పు వచ్చింది. ఇది గమనించిన తల్లిదండ్రులు ఆ బాలికపై అనుమానం వచ్చింది.
ఆ బాలికను తల్లిదండ్రులు గట్టిగా నిలదీయగా.. జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆ ఐదుగురిలో ఒకరు మైనర్ కూడా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…