గుంటూరు జిల్లాలో మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. సత్తెనపల్లి మండలానికి చెందిన దంపతులు గుంటూరులో ఓ వివాహానికి హాజరై బైక్పై తిరిగి ఇంటికి వెళుతుండగా మేడికొండూరు అడ్డురోడ్డు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దంపతులను అడ్డగించిన కొందరు దుండగులు భర్తపై దాడిచేసి ఆ తర్వాత కత్తులతో బెదిరించి మహిళను పొలాల్లోకి తీసుకుని వెళ్లి అక్కడ సామూహిక అత్యాచారం చేశారు.
ఈ సంఘటనపై బాధిత మహిళ అర్ధరాత్రి సత్తెనపల్లి పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. అస్సలు ఈ విషయం గురించే పట్టించుకోలేదు. ఎందుకు ఫిర్యాదు తీసుకోరని సదరు మహిళ ప్రశ్నించగా.. ఘటన జరిగిన ప్రదేశం గుంటూరు అర్బన్ ఎస్పీ పరిధిలోకి వస్తుందని తమ పోలీస్స్టేషన్ గుంటూరు రూరల్ పరిధిలో ఉంటుందన్నారు. ఈ మాట విన్న సదరు మహిళకు ఎం చేయాలో అర్థం కాలేదు. ఈ విషయం తెలిసిన వారు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఘటన ఎక్కడ జరిగినా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. కేసును సంబంధిత పోలీస్స్టేషన్కు బదిలీ చేస్తారు. ఇటువంటివి సినిమాల్లో.. నిజ జీవితంతో కూడా ఎన్నో ఘటనలు జరిగాయి. వార్తాలు కూడా వచ్చాయి. కానీ ఆ పోలీసులకు ఇలాంటి చిన్న విషయం కూడా తెలియకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో పోలీసులకు సెక్షన్లపై అవగాహన లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతన్నాయి. కష్టకాలంలో ఉన్న మహిళ వచ్చి ఫిర్యాదు చేస్తే.. తమ పరిధిలో కాదంటూ చెప్పడం కరెక్ట్ కాదని.. సాటి మనిషిగా కూడా ఆ సమయంలో సహాయం చేయాలనే ఆలోచన రావాలి.
అలాంటప్పుడే మనవత్వానికి విలువ ఉంటుంది. అలా కాకుండా.. ఫిర్యాదు తీసుకోకుండా.. ఆమె చెప్పే విషయాలను పట్టించుకోకుండా ఉండటంతో ఆ పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న అవగాహన కూడా లేకుండా ఎలా విధులు నిర్వర్తసున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…