Tag Archives: good news

GOOGLE PAY: గూగుల్ పే యూజర్లకు శుభవార్త… లక్ష రూపాయల వరకు పర్సనల్ లోన్

GOOGLE PAY: ప్రస్తుతం లావాదేవీలన్నీ ఆన్ లైన్ అవతున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా డిజిటల్ లావాదేవీలు చేసే దేశాాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉంది. అతి తక్కువ కాలంంలోనే ఇండియాలోని ప్రజలు డిజిటల్ లావాదేవీలకు అలవాటుపడ్డారు. 

GOOGLE PAY: గూగుల్ పే యూజర్లకు శుభవార్త… లక్ష రూపాయల వరకు పర్సనల్ లోన్

కేంద్ర ప్రభుత్వం యూపీఐ తీసుకువచ్చిన తర్వాత.. భీమ్, ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ఇలాంటి యాప్స్ నేరుగా క్యాష్ లెస్ లావాదేవీలకు ఊతమిచ్చాయి. ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్ ఉందంటే.. వాటిలో ఈ యాప్స్ ఖచ్చితంగా ఉంటున్నాయి. షాపుల్లో, రెస్టారెంట్లలో, హోటళ్లలో,  మార్కెట్లలో, చివరకు చిన్న స్థాయి వర్తకులు కూడా డిజిటల్ లావాదేవీలకు అలవాటు పడ్డారు. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ కరెన్సీని కూడా ఇండియాలో ప్రవేశపెడుతామని… బడ్జెట్ లో వెల్లడించిన సంగతి తెలిసిందే.

GOOGLE PAY: గూగుల్ పే యూజర్లకు శుభవార్త… లక్ష రూపాయల వరకు పర్సనల్ లోన్

ముఖ్యంగా కరోనా తరువాత ఇండియాలోె డిజిటల్ లావాదేవీల విలువ పెరిగింది. గతంతో పోలిస్తే ఆన్ లైన్ పేమెంట్లు ఉపయోగించే వారి సంఖ్య పెరిగింది.

గుగూల్ పే ద్వారా రూ. లక్ష పర్సనల్ లోన్:

ఇదిలా ఉంటే.. గూగుల్ పే పే వాడుతున్నవారికి ఆన్ లైన్ పేమెంట్ యాప్ శుభవార్త చెప్పింది. గుగుల్ పే యాప్ ఉపయోగించే వినియోగదారులకు రూ. లక్ష వరకు రుణం పొందేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవారు మాత్రమే అర్హులని తెలిపింది. గూగుల్ పే పే ప్రిక్వాలిఫైయర్ యూజర్లకు డీఎంఐ ఫినాన్స్ కంపెనీ.. పర్సనల్ లోన్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అర్హత కలిగిన వారికి మాత్రమే ఈ రుణాలు ఇవ్వనుంది. కేవలం నిమిషాల వ్యవధిలోనే వ్యక్తి గత రుణాలు ఇవ్వనుంది. తీసుకున్న రుణాన్ని 36 నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది. అయితే రానున్న రోజుల్లో ఈ సదుపాయాన్ని మరింత మందికి  అందుబాటులోకి తేనుంది.

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..! డీఏ పెంపు..!

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత డియర్ నెస్ అలవెన్స్(DA) 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడున్న ఉద్యోగులు, పెన్షనర్లకు 34 శాతం డీఏ పొందుతారు. జనవరి 2022 నుంచి మొత్తం డియర్నెస్ అలవెన్స్ 34 శాతం సెట్ చేశారు. 

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..! డీఏ పెంపు..!

7వ వేతన సంఘం సిఫార్సులు ప్రకారం బేసిక్ జీతంపూ మాత్రమే డియర్ నెస్ అలవెన్స్ చెల్లిస్తారు. దీన్ని మార్చిలో ప్రకటించ వచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల కారణంగా ప్రభుత్వం వీటిని ప్రకటించలేదు. ప్రభుత్వ నిర్ణయంతో 50 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతోంది. తదుపరి డియర్నెస్ అలవెన్స్ జూలై 2022లో లెక్కిస్తారు. డిసెంబర్ 2021కి సంబంధించిన AICPI-IW డేటా విడుదల చేశారు. 

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..! డీఏ పెంపు..!

ప్రస్తుతం ఈ గణాంకాల ప్రకారం డిసెంబర్ లో ఈ సంఖ్య 0.3 పాయింట్లు తగ్గి 125.4 పాయింట్లకు చేరకుంది. నవంబర్లో 125.7 పాయింట్లు ఉంది. డిసెంబర్ లో 0.24 తగ్గింది. కానీ ఇది డియర్ నెస్ అలెవెన్స్ పై ప్రభావం చూపించలేదు. 

కార్మిక శాఖ లెక్కల ప్రకారం.. ఇలా

కార్మిక మంత్రిత్వ శాఖ కు చెందిన ఏఐసీపీఐ ఐడబ్ల్యూ గణాంకాల తర్కవాత ఈ సారి డీఏ అలెవెన్స్ 3 శాతం పెంచాలని నిర్ణయించారు. 34 శాతం డీఏపై లెక్కింపు డియర్ నెస్ అలెవెన్స్ 3 శాతం పెంచిన తర్వాత మొత్తం డీఏ 34 శాతం అవుతుంది. ఇప్పుడు రూ. 18,000 బేసిక్ జీతంపూ వార్షిక పెరుగుదల రూ. 6480 అవుతుంది. పెరుగనున్న జీతం ప్రకారం 1. ఉద్యో గి ప్రాథమిక వేతనం రూ. 18,000, 2. కొత్త డియర్నెస్ అలవెన్స్ (34%) రూ. 6120/నెలకు, 3. డియర్నెస్ అలవెన్స్ ఇప్పటివరకు (31%) రూ. 5580/నెల, 4. ఎంత డియర్నెస్ అలవెన్స్ పెరిగింది 6120- 5580 = రూ. 540/నెలకు, 5. వార్షికర్షి జీతంలో పెరుగుదల 540X12 = రూ. 6,4 గా ఉండనుంది

Quarantine: విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు శుభవార్త..! ఇక ఆ నిబంధనలేనట్లే..?

Quarantine: విదేశాల నుంచి ఇండియాకు వచ్చే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. కరోనా ఆంక్షలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా రిస్క్ ఉన్న దేశాలు తప్పితే ఇతర దేశాల నుంచి వచ్చేవారికి కరోనా ఆంక్షలు, క్వారంటైన్ రూల్స్ ని సడలించింది.

Quarantine: విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు శుభవార్త..! ఇక ఆ నిబంధనలేనట్లే..?

ఈ మేరకు కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇక నుంచి విదేశాల నుంచి రాకపోకలు కొనసాగించే వారు క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కేవలం 14 స్వీయ పర్యవేక్షణలో ఉంటే సరిపోతుందని తెలిపింది.

Quarantine: విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు శుభవార్త..! ఇక ఆ నిబంధనలేనట్లే..?

ఈ మార్గదర్శకాలు ఫిబ్రవరి 14 నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించింది. నిరంతరం మార్పు చెందుతున్న కోవిడ్ వైరస్ ని పర్యవేక్షించాలనే అవసరం ఉందని తెలిపింది. ఆర్థిక కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది. 

ప్రయాణ తేదీ నుంచి 72 గంటల్లోపు..

ఓమిక్రాన్ మొదలైనప్పటి నుంచి కొన్ని యూరోపియన్, ఆఫ్రికా దేశాలను హైరిస్క్ దేశాలుగా ప్రకటించింది. అక్కడి నుంచి వచ్చేవారిని నిశితంగా గమనించింది. ఇవే కాకుండా ఇంటర్నేషనల్ ప్రయాణికులపై క్వారంటైన్ రూల్స్ విధించింది. తాజాగా కేంద్రం నిర్ణయంతో విదేశీ ప్రయాణికులకు ఊరట లభించింది.  కొత్తగా విధించిన మార్గదర్శకాల్లో విదేశీయులంతా తప్పనిసరిగా… 14 రోజుల ట్రావెల్ హిస్టరీని స్వీయ డిక్లరేషన్ ఫామ్ లో సమర్పించాలి. ప్రయాణ తేదీ నుంచి 72 గంటల్లోపు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ నెగిటివ్ పరీక్ష ఫలితాలను అప్ లోడ్ చేయాలి. రెండు డోసుల వ్యాక్సిన్‌లు వేయించుకున్నట్లు ధృవీకరించే ధృవీకరణ పత్రాన్ని కూడా అప్‌లోడ్ చేయాలి. వ్యాక్సిన్‌ ప్రోగ్రాంలో భాగంగా భారత్‌ నిర్దేశించిన 72 దేశాల వారికి మందికి మాత్రమే ఈ మార్గనిర్దేశకాలు అందుబాటులోకి ఉంటాయి. సెల్ఫ్ డిక్లరేషణ్ ఫామ్ , నెగిటివ్ ఆర్టీపీసీఆర్ పరీక్ష ఫలితాలు, కోవిడ్ -19 వ్యాక్సినేషన్ ఉన్న ప్రయాణికులను మాత్రమే ఎయిర్ లైన్స్ బోర్డింగ్ కు అనుమతించనున్నారు.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త..! ఆ కోరిక కూడా తీరినట్లే..!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త రానే వచ్చింది. వైజాగ్ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయంపై రాజ్యసభ సభ్యులు, ఏపీ బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ఇవాళ మీడియాతో మాట్లాడారు.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త..! ఆ కోరిక కూడా తీరినట్లే..!

ప్రస్తుతం రైల్వే జోన్ తీసుకురావాలనే ప్రతి పాదన ఎప్పటి నుంచో ఉంది. కానీ.. అధికారిక ప్రకటన మాత్రం ఇంతవరకు రాలేదు. కానీ ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన ఈ జోనల్ తో ఆ కోరిక తీరనుంది. పూర్తి స్థాయిలో విశాఖ పట్నం ప్రత్యేక జోన్ ను ఏర్పాటు చేసేందుకు సంబంధించిన అన్ని పనులను త్వరలో ప్రారంభం కానున్నానయని కూడా ప్రకటన చేశారు.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త..! ఆ కోరిక కూడా తీరినట్లే..!

ఈ సందర్భంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ జోన్ కు సంబంధించి పూర్తి స్థాయి ప్రాజెక్ట్ రిపోర్టు సిద్ధమైందని చెప్పినట్లు జి.వి.ఎల్ నరసింహారావు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇదొక శుభవార్త అని తెలిపారు.

గడిచిన మూడు సంవత్సరాలను నుంచి..

ఈ విశాఖ రైల్వే జోన్ భవన నిర్మాణ కార్యాలయం కూడా అతి త్వరలోనే ప్రారంభం కానుందని.. పూర్తి స్థాయిలో రైల్వే జోన్ కార్యకలాపాలను అతి త్వరలోనే జరగనున్నట్లు పేర్కొన్నారు. ఇక రైల్వే బోర్టు అనేది వాస్తవానికి జోన్లు తగ్గించాలనే ఆలోచనలో ఉందని.. విశాఖ రైల్వే జోన్ రైల్వే‌స్‌కు నష్టం కలిగించే ప్రతిపాదన అయినప్పటికీ.. మోదీకి ఏపీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేయాలనే ఈ మంచి నిర్ణయం తీసుకున్నారననారు. డీపీఆర్ త్వరలోనే ఆమోదింపబడి పనులు ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి చెప్పారన్నారు. కేంద్ర ప్రభుత్వం గడిచిన మూడు సంవత్సరాలను నుంచి పన్నులు రూపంలో ఏపీ నుంచి కలెక్ట్ చేసిన మొత్తం కంటే.. ఎక్కువ మొత్తాన్ని రాష్ట్రానికి ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు.

Indian Digital Currency: భార‌తీయుల‌కు శుభ‌వార్త‌..! ఆ రోజే డిజిటల్ కరెన్సీ ఆవిష్కరణ..

Indian Digital Currency: త్వరలోనే దేశంలో డిజిటల్ కరెన్సీ రాబోతోంది. ఇప్పటికే బడ్జెట్ లో ఈవిషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే  డిజిటల్ కరెన్సీ వచ్చ ఏడాది తొలినాళ్లలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రభత్వ వర్గాలు అంటున్నాయి.

Indian Digital Currency: భార‌తీయుల‌కు శుభ‌వార్త‌..! ఆ రోజే డిజిటల్ కరెన్సీ ఆవిష్కరణ..

ఇది ప్రైవేటు కంపెనీలు నిర్వహించే ఎలక్ట్రానిక్ వాలెట్ల రూపంలోనే ఉంటుందని.. కాకపోతే ప్రభుత్వ హామీ ఉండటం దీని ప్రత్యేకత.  రిజర్వ్ బ్యాంకు జారీచేసే ఈ కరెన్సీ యూనిట్లు.. ప్రస్తుతం చెలామనీ అవుతున్న పరిమిత స్ఘాయిలోని భౌతిక కరెన్సీ లాగే ఉంటుందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.

Indian Digital Currency: భార‌తీయుల‌కు శుభ‌వార్త‌..! ఆ రోజే డిజిటల్ కరెన్సీ ఆవిష్కరణ..

డిజిలట్ రూపంలో జారీ చేసే కరెన్సీ.. చెలామనీలో ఉన్న కరెన్సీలాగే ఉపయోగించవచ్చు. అయితే ఇది ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అంటే… వచ్చే ఏడాది తొలి నెలల్లో డిజిటల్ కరెన్సీ సిద్ధం అవుతుందని ఆర్బీఐ అధికారులు తెలిపారు. 


లావాదేవీలన్నీంటిని రిజర్వ్ బ్యాంక్ మానిటరింగ్..

ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మొబైల్ వాలెట్ల లావాదేవీలను పరిశీలిస్తే.. యూజర్లు ముందుగా ఓ ప్రైవేట్ కంపెనీకి తమ డబ్బును ట్రాన్ఫర్ చేస్తే.. ఆ తరువాత సదరు సంస్థ ఆ డబ్బును అవతలి పక్షానికి బదలాయిస్తోంది. ఇందుకు ఛార్జీలను కూడా వసూలు చేస్తోంది. అయితే ఇందులో రిస్క్ ఎక్కువగా ఉంటోంది. అదే డిజిటల్ రూపీని విషయానికి వస్తే.. మన డబ్బు రిజర్వ్ బ్యాంకు దగ్గర డిజిటల్ కరెన్సీ రూపంలో ఉంటుంది. మనం చేసే లావాదేవీలన్నీంటిని రిజర్వ్ బ్యాంక్ మానిటరింగ్ చేస్తుంది. దీంతో పాటు ప్రభుత్వ హామీ ఉంటుంది. వివాదాస్పద క్రిప్టో కరెన్సీలకు ప్రత్యామ్నాయంగా బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ ఆధారిత అధికారిక డిజిటల్‌ రూపీని ప్రవేశపెట్టనున్నట్లు బడ్జెట్‌ సందర్భంగా కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Bank Accounts: బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..! వాటిపై పెరిగిన వడ్డీ రేట్లు..!

Bank Accounts: ఇటీవల ఇండియాలో బ్యాంకింగ్ సేవలు బాగా విస్తరించాయి. సులభతరంగా లోన్లు కూడా ఇస్తున్నారు. దీంతో పాటు ఇన్స్ స్టంట్ లోన్లను అందిస్తున్నారు. ఉద్యోగులు సొంతిళ్లు, కారు, బైక్ ఇంకేదైనా.. కొనుక్కొవాలంటే వెంటనే లోన్లను ప్రొవైడ్ చేస్తున్నారు.

Bank Accounts: బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..! వాటిపై పెరిగిన వడ్డీ రేట్లు..!

ముఖ్యంగా ప్రైవేటు బ్యాంకులు తన ఖాతాదారులకు అనేెక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇటు బిజినెస్ చేయడానికి కూడా బ్యాంకులు అండగా నిలుస్తున్నాయి.  భారతదేశంలో టాప్ ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటి హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు. 

Bank Accounts: బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..! వాటిపై పెరిగిన వడ్డీ రేట్లు..!

తాజాగా ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు హెడ్ డీ ఎఫ్ సీ కూడా తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. సేవింగ్ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ రేటును సవరించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 2, 2022 నుంచి అమలులోకి వస్తాయని బ్యాంకు తన వైబ్ సైట్ లో పేర్కొంది. 

ఈ సేవింగ్స్ ఖాతాలకు వర్తిస్తాయని..

నోటిఫికేషన్ ప్రకారం బ్యాంకులో డిపాజిట్ మొత్తాల ఆధారంగా వడ్డీ రేట్లను ప్రకటించింది. రూ. 50 లక్షల కన్నా తక్కువ ఉన్న నిల్వ ఉన్న సేవింగ్స్ ఖాతాలపై సంవత్సరానికి 3 శాతం వడ్డీ రేట్లను ఇస్తోంది. రూ. 50 లక్షలకు పైగా రూ. 1000 కోట్ల కన్నాా తక్కువగా ఉన్న నగదు డిపాజిట్లపై 3.50 శాతం వడ్డీని ఏడాదికి ఇవ్వనుంది. దీంతో పాటు రూ. 1000 కోట్ల కన్నా ఎక్కువ పొదుపు నిల్వలపై ఏడాదికి 4.50 శాతం వడ్డీరేటును అందిస్తోంది. ప్రస్తుతం సవరించిన రేట్లు దేశీయ, ఎన్ ఆర్ ఓ, ఎన్ ఆర్ ఈ సేవింగ్స్ ఖాతాలకు వర్తిస్తాయని బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది.

Trains: హైదరాబాద్ నగర వాసులకు గుడ్ న్యూస్..! వందే భారత్ రైళ్లు నగరానికి కూడా..!

Trains: దేశంలోనే హైదరాబాద్ శరవేగంగా ఎదుగుతోంది. ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకుంటోంది. దీనికోసం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే నగరంలోని ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు ఎక్కడిక్కడ ఫ్లై ఓవర్లను నిర్మిస్తోంది.

Trains: హైదరాబాద్ నగర వాసులకు గుడ్ న్యూస్..! వందే భారత్ రైళ్లు నగరానికి కూడా..!

ఇదిలా ఉంటే స్థిరమైన ప్రభుత్వంతో పాటు, హైదరాబాద్ కు ఉన్న భౌగోళిక అనుకూలతలు పెట్టుబడును విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. సౌత్ ఇండియాలోనే కమర్షియల్ హబ్ గా హైదరాబాద్ మారుతోంది. ప్రభుత్వం తీసుకున్న సులభతర అనుమతులు కూడా పలు ప్రతిష్టాత్మక కంపెనీలు రావడాని దోహదపడుతున్నాయి. 

Trains: హైదరాబాద్ నగర వాసులకు గుడ్ న్యూస్..! వందే భారత్ రైళ్లు నగరానికి కూడా..!

ఇంతలా డెవలప్ అవుతున్న హైదరాబాద్ మరిన్ని సౌకర్యాలు రాబోతున్నాయి. ఇటీవల కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్ లో హైదరాబాద్ నగరానికి వందేభారత్ ట్రైన్లను కేటాయించారు. త్వరలోనే ఇవి అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 400 వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తామని కేంద్రం బడ్జెట్ లో తెలిపింది.

భారత్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం..

ఈ నేపథ్యంలో గతంలో ప్రతిపాదించినట్లు హైదరాబాద్- న్యూ ఢిల్లీ, కాచిగూడ- బెంగళూర్, సికింద్రాబాద్- ముంబైల మధ్య వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే గతంలో ప్రతిపాదించిన 100 రైళ్లు కాకుండా… ఈ బడ్జెట్ లో 400 రైళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు హైదరాబాద్- ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన కూడా ఉంది. ఇప్పటికే అహ్మదాబాద్- ముంబై మధ్య జపాన్ సహకారంతో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ప్రారంభం అయింది. రానున్న రోజుల్లో హైదరాబాద్- ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది అందుబాటులోకి వస్తే గంటల వ్యవధిలోనే ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం వీలవుతుంది.

Jobs In AP: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! తిరుపతి ఐఐటీలో ఖాళీలు..!

Jobs In AP: ఐఐటీలో చదవాలనేది ప్రతి విద్యార్థి కోరికగా ఉంటుంది. అంతటి ప్రతిష్టాత్మక యూనివర్సీటీలో ఉద్యోగాలు చేయాలనే కోరిక కూడా చాలా మందిలో ఉంటుంది. అటువంటి వారికి ఓ సదవకాశం. ఏపీలోని తిరుపతి ఇండియన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఔట్ సోర్సింగ్  ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. 

Jobs In AP: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! తిరుపతి ఐఐటీలో ఖాళీలు..!

ఈ ఉద్యోగాలకు అర్హులైన వారి నుంచి దరకాస్తులు కోరతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6 ఖాళీలనను భర్తీ చేయనున్నారు.   భర్తీ చేయనున్న పోస్టుల వివరాల్లోకి వెళ్తే.. ప్రాజెక్ట్ ఆఫీసర్లు 3, ప్రాజెక్ట్ అసిస్టెంట్లు 3 ఖాళీలు ఉన్నాయి. వెబ్ డెవలప్మెంట్, నెట్వర్క్ విభాగాల్లో ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. 

Jobs In AP: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! తిరుపతి ఐఐటీలో ఖాళీలు..!

ఈ పోస్టులకు సంబంధించి విద్యార్హతలను కూడా నోటిఫికేషన్ లో పొందుపరిచారు. సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు పోస్టులకు అర్హులు. దీంతో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి. 

నెలకు రూ. 20,000 నుంచి రూ. 30,000 వరకు ..

సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో ప్రాజెకట్ అసిస్టెంట్ ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు డిగ్రీ, బీఎస్సీ సీఎస్, బీసీఏ డిగ్రీలు కలిగిన వారు అర్హులు. అయితే కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంట్లో కూడా అనుభవం, టెక్నికల్ నైపుణ్యత కలిగి ఉండాలి. నెలకు రూ. 20,000 నుంచి రూ. 30000 వరకు జీతం చెల్లిస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 27 ఏళ్లకు మించరాదు. ఎంపిక విధానానికి వస్తే రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. రాత పరీక్షప్రిలిమ్స్, మెయిన్స్ అనే రెండు స్టేజిల్లో జరుగుతుంది. దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 11,2022 గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు  https://www.iittp.ac.in/ వెబ్ సైట్ లో చూడాలి.

Good News: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్..!

Good News: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. త్వరలోనే ప్రభుత్వం ఉద్యోగాల భర్త చేపడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఖాళీల వివరాలను అధికారులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బడ్జెట్ పై కేసీఆర్ మాట్లాడుతున్న సమయంలో కూడా త్వరలోనే ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాబోతున్నాయనే హింట్ ఇచ్చారు.

Good News: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్..!

దీంతో ఎన్నాళ్ల నుంచో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మంచి అవకాశం రానుంది.  కొత్త జోనల్ విధానంలో ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. దీనికి అనుగుణంగానే డిసెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 2018 రాష్ట్రపతి ఉత్తర్వలుకు లోబడి… కొత్తజోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన ప్రక్రియ చేపట్టారు.

Good News: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్..!

దీంతో ఉద్యోగులు తమ స్థానికత మేరకు ఆయా జిల్లాలకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం పరస్పర అంగీకారంతో ఉద్యోగులు బదిలీ అయ్యేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ ప్రక్రియ కూడా త్వరలోనే ముగిసే అవకాశం ఉంది.


ఉద్యోగ భర్తీకి కసరత్తు ..

ఉద్యోగులు పూర్తి స్థాయి విభజన, బదిలీల తరువాత ఏయే డిపార్ట్మెంట్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే దానిపై ప్రభుత్వానికి క్లారిటీ రానుంది. ఖాళీలకు అనుగుణంగా ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉంది. ఈనెలలోనే కొన్ని నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. సీఎం ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు కూడా ఉద్యోగ భర్తీకి కసరత్తు మొదలుపెట్టారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే… నిరుద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఏళ్ల తరబడి వేచి చూస్తున్నవారి కల తీరనుంది.

Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త..! వాటిపై రాయితీ ప్రకటన..!

Tirumala: దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో తిరుమల – తిరుపతి ఒకటి. దేశంలోని నలుమూలల నుంచి రోజూ వేల మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటు ఉంటారు. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా తిరుపతి విరజిల్లుతోంది. ఇటీవల కాలంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరుగతోంది.

Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త..! వాటిపై రాయితీ ప్రకటన..!

కరోనా కారణంగా గత రెండేళ్ల నుంచి తిరుపతి వెంకన్న దర్శనానికి అనేక అవరోధాలు ఏర్పడ్డాయి. తాజాగా ఓమిక్రాన్, కరోనా భయాల వల్ల కూడా శ్రీవారి దర్శనాలకు బ్రేక్ పడింది. దీనికి తోడు గతేడాది చివరలో కురిసిన వర్షాలతో కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. 

Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త..! వాటిపై రాయితీ ప్రకటన..!

ఇదిలా ఉంటే ప్రస్తుతం తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల దర్శనం టికెట్లను కూడా టీటీడీ ప్రారంభించింది. దీంతో తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. కరోనా పరిస్థితులు ప్రస్తుతం చక్కబడటంతో రానున్న కాలంలో మరింత మంది ప్రజలు శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే అవకాశం ఉంది. 

72 గంటల పాటు ఈ టికెట్ చెల్లుబాటు అవుతుందని..

అయితే ఈ నేపథ్యంలో భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది ఏపీఎస్ ఆర్టీసీ. దూరప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చే వారి సౌకర్యార్థం ఆర్టీసీ చర్యలు తీసుకుంటుంది. తిరుమల- తిరుపతి మధ్య రాకపోకలకు ఒకేసారి టికెట్ తీసుకుంటే… 10 శాతం రాయితీ ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. తిరుమల-తిరుపతికి వచ్చిన తర్వాత 72 గంటల పాటు ఈ టికెట్ చెల్లుబాటు అవుతుందని ఆయన వెల్లడించారు. ఈ విధానం నేటి నుంచి అమలులోకి వస్తున్నట్లు వెల్లడించారు.