7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..! డీఏ పెంపు..!
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత డియర్ నెస్ అలవెన్స్(DA) 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడున్న ఉద్యోగులు, పెన్షనర్లకు 34 శాతం డీఏ పొందుతారు. జనవరి 2022 నుంచి మొత్తం డియర్నెస్ అలవెన్స్ 34 శాతం సెట్ చేశారు.
7వ వేతన సంఘం సిఫార్సులు ప్రకారం బేసిక్ జీతంపూ మాత్రమే డియర్ నెస్ అలవెన్స్ చెల్లిస్తారు. దీన్ని మార్చిలో ప్రకటించ వచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల కారణంగా ప్రభుత్వం వీటిని ప్రకటించలేదు. ప్రభుత్వ నిర్ణయంతో 50 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతోంది. తదుపరి డియర్నెస్ అలవెన్స్ జూలై 2022లో లెక్కిస్తారు. డిసెంబర్ 2021కి సంబంధించిన AICPI-IW డేటా విడుదల చేశారు.
ప్రస్తుతం ఈ గణాంకాల ప్రకారం డిసెంబర్ లో ఈ సంఖ్య 0.3 పాయింట్లు తగ్గి 125.4 పాయింట్లకు చేరకుంది. నవంబర్లో 125.7 పాయింట్లు ఉంది. డిసెంబర్ లో 0.24 తగ్గింది. కానీ ఇది డియర్ నెస్ అలెవెన్స్ పై ప్రభావం చూపించలేదు.
కార్మిక మంత్రిత్వ శాఖ కు చెందిన ఏఐసీపీఐ ఐడబ్ల్యూ గణాంకాల తర్కవాత ఈ సారి డీఏ అలెవెన్స్ 3 శాతం పెంచాలని నిర్ణయించారు. 34 శాతం డీఏపై లెక్కింపు డియర్ నెస్ అలెవెన్స్ 3 శాతం పెంచిన తర్వాత మొత్తం డీఏ 34 శాతం అవుతుంది. ఇప్పుడు రూ. 18,000 బేసిక్ జీతంపూ వార్షిక పెరుగుదల రూ. 6480 అవుతుంది. పెరుగనున్న జీతం ప్రకారం 1. ఉద్యో గి ప్రాథమిక వేతనం రూ. 18,000, 2. కొత్త డియర్నెస్ అలవెన్స్ (34%) రూ. 6120/నెలకు, 3. డియర్నెస్ అలవెన్స్ ఇప్పటివరకు (31%) రూ. 5580/నెల, 4. ఎంత డియర్నెస్ అలవెన్స్ పెరిగింది 6120- 5580 = రూ. 540/నెలకు, 5. వార్షికర్షి జీతంలో పెరుగుదల 540X12 = రూ. 6,4 గా ఉండనుంది
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…