POLITICAL NEWS: యోగీకి ఓటేయకుంటే… యూపీ నుంచి పారిపోండి: రాజా సింగ్ వార్నింగ్
POLITICAL NEWS: ఎప్పుడూ వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా మరోసారి సంచలన వ్యాక్యలు చేశారు ఈసారి యూపీ ఎన్నికలు, యోగీ ఆదిత్య నాథ్ పై వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం ఏడుదశల్లో యూపీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే రెండు దశల ఎన్నికలు జరిగాయి. యూపీలో బీజేపీ, ఎస్పీ ల మధ్య తీవ్ర పోటీ ఉంది. రెండు పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఇరు పార్టీ రాజకీయ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ఇప్పటికే పలు ఒపీనియన్ పోల్స్ ప్రకారం సీట్లు తగ్గినా బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ.. జోస్యం చెబుతున్నాయి. అయితే ఎన్డీయేతర విపక్షాల మాత్రం ఎస్పీ అధికారంలోకి వస్తుందని, అఖిలేష్ సీఎం అవుతాడంటూ.. ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే రాజా సింగ్ యూపీ ఓటర్లకు వార్నింగ్ ఇచ్చాడు. యూపీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకుంటే… యూపీ వదిలి వెళ్లాలని వార్నింగ్ ఇచ్చారు. యోగికి ఓటు వేయకుంటే.. జేసీబీలు, బుల్డోజర్లు పంపిస్తాం అంటూ హెచ్చరించారు. యోగికి ఓటు వేయని ఏరియాలను గుర్తిస్తున్నామంటూ వ్యాఖ్యానించారు. యూపీలో ఉండాలంటే యోగీ అనాల్సిందే అంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లో యోగీ బాబా ప్రభుత్వం వస్తుందని రాజా సింగ్ అన్నారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…