Tag Archives: good

ఈ సౌందర్య ఉత్పత్తులలో కూడా ఆల్కహాల్ ఉంటుందని తెలుసా!

ఆల్కహాల్ గురించి వినని వారు ఎవరూ ఉండరు. కొన్ని దశాబ్దాలుగా ఆల్కహాల్ ను బీర్, వైన్, వంటి మద్యాన్ని తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారనే విషయం మనకు తెలిసిందే.అయితే ప్రస్తుతం ఈ ఆల్కహాల్ ను శానిటైజర్ లలో కూడా ఉపయోగిస్తున్నారని మనకు తెలుసు. కేవలం ఈ విధమైనటువంటి ఉత్పత్తులలో మాత్రమే కాకుండా, ప్రతిరోజు మనం ముఖానికి రాసుకునే వివిధ రకాల కాస్మటిక్ ఉత్పత్తులలోనూ ఆల్కహాల్ ఉపయోగిస్తారు.

ఆల్కహాల్ లో హైడ్రాక్సిల్ అణువులు ఎక్కువగా ఉంటాయి. మనం తరచూ ఉపయోగించే లోషన్స్, క్రీమ్స్, మాయిశ్చరైజర్ వంటి వివిధ రకాల సౌందర్య ఉత్పత్తుల లో ఈ ఆల్కహాల్ ను ఉపయోగిస్తారు. ఈ విధంగా బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఉపయోగించే ఆల్కహాల్ ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. ఆల్కహాల్ ను వివిధ రకాల పండ్లు కూరగాయలను ఉపయోగించి ఫెర్మంటేషన్  పద్ధతి ద్వారా తయారు చేస్తారు.

నిపుణుల ప్రకారం ఫ్యాటీ ఆల్కహాల్ ఉపయోగించి తయారుచేసే బ్యూటీ ప్రొడక్ట్స్ మంచివని వీటివల్ల మన శరీరానికి ఎటువంటి సమస్యలు ఎదురవని భావిస్తున్నారు. ఈ ఉత్పత్తులను ఉపయోగించటం వల్ల కాలుష్యం నుంచి మన చర్మం దెబ్బతినకుండా, పైన ఒక లేయర్ మాదిరి ఏర్పడి చర్మాన్ని రక్షిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.

సింపుల్ ఆల్కహాల్ ఎక్కువగా ఇథనాల్, బెన్జైల్, ఇసోప్రొపైల్, మిథైల్ వంటి ఆల్కహాల్ బేస్డ్ స్కిన్ ప్రొడక్ట్స్ వల్ల చర్మం దెబ్బ తినే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ముఖం పై మొటిమలు మచ్చలు ఏర్పడి చర్మం ముడతలు పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.దీర్ఘకాలం పాటు ఇటువంటి ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల చర్మం పొడిబారే అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు.

గుడిలో శఠగోపం పెట్టడం వెనుక గల కారణం ఇదే..!

సాధారణంగా మనం దేవాలయాలను దర్శించినప్పుడు ముందుగా దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అనంతరం ఆలయం లోపలికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటారు. దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత తలపై శఠగోపం పెట్టడం మనం చూస్తుంటాం. అసలు ఈ శఠగోపం అంటే ఏమిటి? గుడిలో మనకు తల పై శఠగోపం ఎందుకు పెడతారు? దీని ప్రాముఖ్యత ఏమిటి? అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.

శఠగోపం అంటే అత్యంత గోప్యమైనది అని అర్థం. శఠగోపం ఆలయంలో ఉన్న దేవతలకు ప్రతీకగా భావిస్తారు.గుడికి వెళ్ళిన ప్రతి భక్తునికి గర్భగుడిలో ఉన్న దేవుడిని తాకే అవకాశం ఉండదు కాబట్టి ఈ ఆలయంలో ఉన్న పూజారి ఈ శఠగోపం స్వామివారి పాదాల వద్ద ఉంచి దానిని తెచ్చి మన తలపై పెడతాడు. అంతేకాకుండా శఠగోపం పై స్వామి వారి పాదాలు ఉంటాయి.దీనిని తలపై పెట్టుకోవడం వల్ల సాక్షాత్తు ఆ దేవుని పాదాల దగ్గర వెళ్ళి నమస్కరించినట్లు భావిస్తారు.

ఆలయంలో ఉన్న పూజారి ఈ శఠగోపం మన తలపై పెట్టినప్పుడు మన మనసులో ఉన్న కోరికను కోరుకోవడం వల్ల సాక్షాత్తు ఆ దేవుని పాదాల చెంతకు వెళ్లి చెప్పినట్లు.శఠత్వం అంటే మూర్ఖత్వం అని, గోపం అంటే దాచిపెట్టడం అని కూడా అర్ధం. భగవంతుడు మనిషిలో గోప్యంగా ఉన్న మూర్ఖత్వాన్ని, అహంకారాన్ని తొలగించి జ్ఞానిగా చేస్తాడని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఈ శఠగోపం రాగి, వెండి, కంచు వంటి పదార్థాలతో వలయాకారంలో తయారుచేస్తారు.శఠగోపం వల్ల ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా, ఆరోగ్య పరంగా కూడా ఎంతో ప్రయోజనకరం. లోహంతో తయారు చేసిన ఈ శఠగోపం తలపై ఉంచినప్పుడు మనలో విద్యుదావేశం జరిగి అధిక మొత్తంలో విద్యుత్ బయటకు వెళ్ళటం వల్ల మన మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.

కరోనా రోగులు వాసన కోల్పోతే మంచిదేనా..?

గత కొన్ని నెలల నుంచి కరోనా మహమ్మారి వల్ల భారత్ లోని, తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. దేశంలో రోజురోజుకు కరోనా రోగుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు కరోనా మహమ్మారి గురించి ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కరోనా వైరస్ సోకిన వాళ్లు వాసన కోల్పోతే ప్రమాదమని గతంలో కొందరు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

అయితే ఇరాన్‌లోని టెహ్రాన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజా ఆధ్యయనాలు కరోనా రోగులు వాసన కోల్పోవడం మంచిదేనని చెబుతున్నాయి. ఎవరైతే కరోనా బారిన పడి వాసన కోల్పోతున్నారో వాళ్లు త్వరగా కోలుకుంటున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇజ్రాయెల్ కు చెందిన పరిశోధనల్లో సైతం ఇదే విషయం వెల్లడైంది.

కరోనా సోకిన 207 మందిపై టెహ్రాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. కరోనా రోగులు ఎవరైతే వాసన కోల్పోతారో వారిలో ముక్కుదిబ్బడ, తలనొప్పి, ప్లేట్ లెట్లు తగ్గడం లాంటి సమస్యలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కరోనా రోగుల్లో వాసన కోల్పోవడం హఠాత్తుగా జరుగుతుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. 1,60,000 కంటే తక్కువ సంఖ్యలో ప్లేట్ లెట్లు ఉన్నవాళ్లు వాసన కోల్పోతే త్వరగా కోలుకుంటారని వెల్లడిస్తున్నారు.

శరీరంలో వాసనకు సంబంధించిన ఏస్‌ 2 రిసెప్టార్స్‌ పై కరోనా వైరస్ దాడి చేస్తోందని ఫలితంగా కరోనా రోగులు వాసన కోల్పోతున్నారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వాసన కోల్పోయిన కరోనా రోగులు సైతం ఇదే విషయాన్ని ధృవీకరించారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇమ్యూనిటీ తక్కువగా ఉండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వాళ్లకు మాత్రం ఆరోగ్య పరిస్థితి విషమించే అవకాశం ఉందని సమాచారం.