devotional

గుడిలో శఠగోపం పెట్టడం వెనుక గల కారణం ఇదే..!

సాధారణంగా మనం దేవాలయాలను దర్శించినప్పుడు ముందుగా దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అనంతరం ఆలయం లోపలికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటారు. దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత తలపై శఠగోపం పెట్టడం మనం చూస్తుంటాం. అసలు ఈ శఠగోపం అంటే ఏమిటి? గుడిలో మనకు తల పై శఠగోపం ఎందుకు పెడతారు? దీని ప్రాముఖ్యత ఏమిటి? అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.

శఠగోపం అంటే అత్యంత గోప్యమైనది అని అర్థం. శఠగోపం ఆలయంలో ఉన్న దేవతలకు ప్రతీకగా భావిస్తారు.గుడికి వెళ్ళిన ప్రతి భక్తునికి గర్భగుడిలో ఉన్న దేవుడిని తాకే అవకాశం ఉండదు కాబట్టి ఈ ఆలయంలో ఉన్న పూజారి ఈ శఠగోపం స్వామివారి పాదాల వద్ద ఉంచి దానిని తెచ్చి మన తలపై పెడతాడు. అంతేకాకుండా శఠగోపం పై స్వామి వారి పాదాలు ఉంటాయి.దీనిని తలపై పెట్టుకోవడం వల్ల సాక్షాత్తు ఆ దేవుని పాదాల దగ్గర వెళ్ళి నమస్కరించినట్లు భావిస్తారు.

ఆలయంలో ఉన్న పూజారి ఈ శఠగోపం మన తలపై పెట్టినప్పుడు మన మనసులో ఉన్న కోరికను కోరుకోవడం వల్ల సాక్షాత్తు ఆ దేవుని పాదాల చెంతకు వెళ్లి చెప్పినట్లు.శఠత్వం అంటే మూర్ఖత్వం అని, గోపం అంటే దాచిపెట్టడం అని కూడా అర్ధం. భగవంతుడు మనిషిలో గోప్యంగా ఉన్న మూర్ఖత్వాన్ని, అహంకారాన్ని తొలగించి జ్ఞానిగా చేస్తాడని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఈ శఠగోపం రాగి, వెండి, కంచు వంటి పదార్థాలతో వలయాకారంలో తయారుచేస్తారు.శఠగోపం వల్ల ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా, ఆరోగ్య పరంగా కూడా ఎంతో ప్రయోజనకరం. లోహంతో తయారు చేసిన ఈ శఠగోపం తలపై ఉంచినప్పుడు మనలో విద్యుదావేశం జరిగి అధిక మొత్తంలో విద్యుత్ బయటకు వెళ్ళటం వల్ల మన మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago