సాధారణంగా కొంతమందికి చలికాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల తరచు తుమ్ములు వస్తూ ఉంటాయి. ఈ విధంగా తుమ్ములు రావడం వల్ల ఎంతో చికాకుగా, ఇబ్బందిగా ఉంటుంది. తుమ్ములు తగ్గడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితం ఉండదు. మరికొంతమందికి వాతావరణంతో సంబంధం లేకుండా ఎక్కువగా తుమ్ములు వస్తుంటాయి. ఈ విధంగా అధికంగా తుమ్ముల సమస్యతో బాధపడేవారు తొందరగా తుమ్ములు తగ్గాలంటే ఈ సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా తుమ్ముల నుంచి విముక్తి పొందవచ్చు.
వాతావరణంలో మార్పులు లేదా కాలుష్యం కారణంగా తరచూ తుమ్ములు వచ్చే వారు డాక్టర్ ను సంప్రదించి ఎన్నో మందులు వాడుతున్నప్పటికీ కొందరిలో ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాంటి సమయంలో మన వంటిల్లు నుంచి ఈ సమస్యకు ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు. మన వంటింట్లో దొరికే మసాలా దినుసులు వల్ల తరుచూ వచ్చే తుమ్మల నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చు.
మన ఇంటిలో దొరికే కొద్దిగా మెంతులు, వాము, మిరియాలు వీటన్నింటిని విడివిడిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తరువాత వీటిని బాగా పొడి చేసి విడివిడిగా నిల్వచేసుకోవాలి.పొడిగా చేసుకొని ఉన్న ఈ దినుసులను ఒక్కొక్కటి 25 గ్రాముల చొప్పున కలిపి ఉంచుకోవాలి. ప్రతిరోజు ఉదయం ఒక తమలపాకులో ఒక గ్రాము చూర్ణం, అర టీ స్పూన్ తేనె కలిపి ఆకు మొత్తం చుట్టి, ఆ ఆకును నమిలి మింగాలి. ఈ విధంగా కొద్దిరోజుల పాటు చేయటం వల్ల తరచు తుమ్ములు రావడం తగ్గిపోవడమే కాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. మన శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగుపడటం వల్ల మన శరీరంలో అలర్జీ తత్వం తగ్గి ఈ సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…