Tag Archives: health condition

శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమం… దాతల కోసం ఎదురు చూపులు..!

కరోనా మహమ్మారి రెండో వేవ్ తర్వాత దాని వ్యాప్తి తగ్గింది అనుకున్నారు. కానీ అది ఇంకా చాపకింద నీరులా పాకుతూనే ఉంది. ప్రస్తుతం సెలబ్రిటీలను, రాజకీయ నాయకులను కరోనా వదిలి పెట్టడం లేదు. మొన్న ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, విశ్వ నటుడు కమల్ హాసన్‌కి, ఇవాళ ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

అంతే కాకుండా.. తెలంగాణ స్పీకర్ పోచారంకు కూడా కరోనా మహమ్మారి సోకింది. అయితే జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్ మాస్టర్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. హైదరాబాద్‌లోని ఏఐజీ దవాఖాణలో నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్నారు.

75 శాతం ఊపిరితిత్తులకు ఇన్‌ఫెన్షన్‌ సోకినట్టు వైద్యులు తెలిపారు. శివశంకర్‌ మాస్టర్‌ పెద్దకుమారుడు కూడా కరోనా మహమ్మారి బారిన పడి అపస్మారకస్థితికి చేరారు. శివశంకర్‌ భార్యకు కూడా కరోనా సోకడంతో హోంక్వారెంటైన్‌లో ఉన్నారు. మరోవైపు ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

శివశంకర్ మాస్టర్, ఆయన కుమారుడి చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుండటంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది ఆ కుటుంబం. ఇక అతడికి 800కు పైగా చిత్రాలకు డ్యాన్స్ మాస్టర్‌గా పని చేసిన అనుభవముంది. రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా వచ్చిన మగధీర సినిమాలో ధీర ధీర సాంగ్‌కు ఆయనకు జాతీయ అవార్డ్ వరించింది.

సహజనటి జయసుధ ఎలా మారిపోయారో తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సహజనటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని ఎన్నో అద్భుతమైన పాత్రలో అద్భుతమైన సినిమాలలో స్టార్ హీరోలందరి సరసన నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె వివిధ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి విశేష ఆదరణ దక్కించుకుంది.

ఇదిలా ఉండగా జయసుధ తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఎంతో బిజీగా గడిపారు. ఎన్నో చిత్రాలలో తల్లి పాత్రలో నానమ్మ పాత్రలలో ఒదిగిపోయి నటించారు. ఇలా నాటి తరం నుంచి నేటి వరకు అందరికీ అభిమాన నటిగా మారిపోయిన జయసుధ గత కొంత కాలం నుంచి వెండితెరకు దూరమయ్యారు.

ఈ క్రమంలోనే జయసుధ వెండితెరకు దూరం కావడానికి కారణం ఏమిటి అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేశారు.అయితే ఈమెకు అనారోగ్యం కారణంగా విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకుంటుందనే వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే జయసుధ వెండితెరకు దూరం అయినట్లు తెలుస్తోంది.

తాజాగా జయసుధ సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని షేర్ చేశారు ఈ ఫోటో చూస్తుంటే నిజంగా జయసుధ ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసిపోతుంది. ఈ ఫోటోలో జయసుధ పూర్తిగా తన అందాన్ని కోల్పోయి ఎంతో సన్నగా అయ్యారు. దీన్ని బట్టి చూస్తుంటే ఆమెకు నిజంగానే అనారోగ్యం చేయటంవల్ల ఇండస్ట్రీకి దూరమయ్యారని చెప్పవచ్చు.

కైకాల సత్యనారాయణ ఆరోగ్యం గురించి స్పందించిన కూతురు రమాదేవి..!

పౌరాణిక చిత్రాల్లో అతడిని మించిన నటుడు లేరు.. ఏ పాత్రలోనైనా జీవించి నటిస్తారు.. అతడే కైకాల సత్యనారాయణ. ఇటీవల అతడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్లు వైద్యులు బులిటెన్ ద్వారా తెలియజేశాడు. అయితే మొన్న చిరంజీవి కైకాల సత్యనారాయణ తనతో మాట్లాడారని.. అతడు కోలుకుంటున్నట్లు కూడా చెప్పాడు.

ఆ సమాచారాన్ని చిరంజీవే తెలిపారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అపోలో ఆసుపత్రి వైద్యులూ ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ ను విడుదల చేస్తున్నారు. తాజాగా ఆయన కూతురు రమాదేవి కూడా ఆయన ఆరోగ్యంపై స్పందించారు.

ఆడియో వాయిస్ ద్వారా ఆమె సందేశాన్నిచ్చారు. కైకాల సత్యనారాయణ ఆరోగ్యం ప్రస్తుతం మెరుగవుతోందని.. ప్రతీ ఒక్కరితో మాట్లాడుతున్నారని.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది సోషల్ మీడియాలో ఆయన పరిస్థితి విషమించిందనే వార్తలు వచ్చాయి… అలాంటి వార్తలు నమ్మోద్దని చెప్పారు.

ఇలాంటి అనవసర వార్తలతో జనాలను ఆందోళనకు గురి చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. మొదట అతడు ఆసుపత్రిలో వైద్యానికి ఆయన స్పందించడంలేదని ప్రకటించడంతో ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. తర్వాత అతడు స్పదిస్తున్నారని వైద్యులే చెప్పారు. మూడు రోజులుగా అతడు అపోలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. అతడు త్వరగా కోలుకోవాలని సగటు తెలుగు అభిమానులు ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు.

స్పృహలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్.. ఒకే ఒక్క మాట మాట్లాడిన సాయి తేజ్..!

శుక్రవారం రాత్రి 8 గంటల 30 నిమిషాల సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైన సాయిధరమ్ తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదం తర్వాత ఆయనను మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించారు. శనివారం ఉదయం నుంచి వైద్యులు సాయిధరమ్ తేజ్ కి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సాయి ధరంతేజ్ వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నారు.

శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదానికి అపస్మారక స్థితిలోకి వెళ్లిన సాయి ధరమ్ తేజ్ మొట్టమొదటిసారిగా స్పృహలోకి వచ్చినట్టు తెలుస్తోంది. స్పృహలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్ తమ కుటుంబ సభ్యులతో కేవలం వీడియో కాల్ లో చాలా నొప్పిగా ఉందంటూ ఒకే ఒక మాట మాట్లాడి ఫోన్ కట్ చేసినట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి చికిత్స అందిస్తున్న అపోలో ఆసుపత్రి సిబ్బంది స్కానింగ్ నిర్వహించి ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు.

అయితే ఆదివారం సాయి ధరంతేజ్ కి కాలర్ బోన్ సర్జరీ సర్జరీ నిర్వహించనున్నట్టు అపోలో వైద్యులు వెల్లడించారు. రోడ్డు ప్రమాదం అనంతరం సాయిధరమ్ తేజ్ ఎక్కడినుంచి ఎక్కడికి వెళ్తున్నారు అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ తో పాటు నటుడు నరేష్ కుమారుడు నవీన్, మరొక వ్యక్తి ముగ్గురూ కలిసి ఒకచోటకి వెళ్లినట్లు సమాచారం.

బైక్ రైడింగ్ ఆధారంగా పోలీసులు సాయిధరమ్ తేజ్ పై కేసు నమోదు చేశారు. సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితి కుదుటపడిన తర్వాత ప్రమాదం గురించి విచారించనునట్లు డీసీపీ తెలియచేశారు. అవసరమైతే ఈ కేసులో నటుడు నరేష్ ను ఆయన కుమారుడు నవీన్ ను పోలీసులు విచారిస్తామని తెలియజేశారు.