పౌరాణిక చిత్రాల్లో అతడిని మించిన నటుడు లేరు.. ఏ పాత్రలోనైనా జీవించి నటిస్తారు.. అతడే కైకాల సత్యనారాయణ. ఇటీవల అతడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్లు వైద్యులు బులిటెన్ ద్వారా తెలియజేశాడు. అయితే మొన్న చిరంజీవి కైకాల సత్యనారాయణ తనతో మాట్లాడారని.. అతడు కోలుకుంటున్నట్లు కూడా చెప్పాడు.
ఆ సమాచారాన్ని చిరంజీవే తెలిపారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అపోలో ఆసుపత్రి వైద్యులూ ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ ను విడుదల చేస్తున్నారు. తాజాగా ఆయన కూతురు రమాదేవి కూడా ఆయన ఆరోగ్యంపై స్పందించారు.
ఆడియో వాయిస్ ద్వారా ఆమె సందేశాన్నిచ్చారు. కైకాల సత్యనారాయణ ఆరోగ్యం ప్రస్తుతం మెరుగవుతోందని.. ప్రతీ ఒక్కరితో మాట్లాడుతున్నారని.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది సోషల్ మీడియాలో ఆయన పరిస్థితి విషమించిందనే వార్తలు వచ్చాయి… అలాంటి వార్తలు నమ్మోద్దని చెప్పారు.
ఇలాంటి అనవసర వార్తలతో జనాలను ఆందోళనకు గురి చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. మొదట అతడు ఆసుపత్రిలో వైద్యానికి ఆయన స్పందించడంలేదని ప్రకటించడంతో ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. తర్వాత అతడు స్పదిస్తున్నారని వైద్యులే చెప్పారు. మూడు రోజులుగా అతడు అపోలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. అతడు త్వరగా కోలుకోవాలని సగటు తెలుగు అభిమానులు ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…