ఇటీవల మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి.. చికిత్స అనంతరం అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన విషయం తెలిసిందే. దాదాపు 20 రోజుల వరకు చికిత్స పొందిన ధరమ్ తేజ్ కోలుకొని.. తన పుట్టిన రోజునే ఇంటికి వెళ్లారు. ఆ రోజు నుంచి కూడా అతడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు.
తన ఆరోగ్యం గురించి తన ట్విట్టర్ ఖాతాలో అప్ డేట్ ఇచ్చేవాడు. ఇలా తన అభిమానులతో ట్విట్టర్ ద్వారా ముచ్చటించేవారు. అయితే తాజాగా అతడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడనున్నారు. తేజ్ కి సంబంధించిన ఒకటి రెండు ఫొటోలో బయటకు వచ్చాయి. ఆ ఫొటోలను తన కుటుంబసభ్యులే విడుదల చేశారు.
అతడు హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమాకు సంబంధించి శాటిలైట్, ఓటీటీ హక్కుల్ని జీ5 సొంతం చేసుకుంది. దీనిలో భాగంగానే జీ5 టీమ్ రిపబ్లిక్ ప్రీమియర్స్కి సంబంధించిన ఓ ప్రెస్మీట్ ను నిర్వహించనుంది. ఈ మీట్ లో చిత్రబృందం పాల్గొనబోతోంది. ఆ మీట్ లోనే తేజ్ పాల్గొననున్నారు.
ప్రమాదం తర్వాత రిపబ్లిక్ సినిమాకు సంబంధించి ఎలాంటి ఈవెంట్లకు హాజరు కాలేదు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా అతడు పాల్గొనలేదు.
మొదటి సారి మీడియా ముందుకు వస్తుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రమాదం గురించి మీడియాలో వివిధ రకాల కథానాలు వచ్చినప్పటికీ దేనికి వాస్తవ రూపం లేదు. ప్రమాదానికి గురైన తేజ్ చెబితేనే అది ఎలా జరిగిందో తెలియనుంది. అతడి నోటి వెంట.. ప్రమాదం ఎలా జరిగిందనే విషయాలను చెబుతారో లేదో చూడాలి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…