Tag Archives: honeymoon

Naresh Pavitra Lokesh: నరేష్ పవిత్ర అప్పుడే హనీమూన్ వెళ్లిపోయారా… వైరల్ అవుతున్న ఫోటోలు!

Naresh Pavitra Lokesh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నరేష్ తన వ్యక్తిగత కారణాల వల్ల ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తలో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఈయన నటి పవిత్ర లోకేష్ తో పెట్టుకున్నటువంటి రిలేషన్ వల్ల పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నటువంటి నరేష్ తిరిగి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉన్నారు.

ఈమెను పెళ్లి చేసుకోబోతున్నానని ప్రకటించడంతో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి నరేష్ గురించి పెద్ద ఎత్తున వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వీరి వ్యవహారం కాస్త మీడియా వార్తల్లో నిలిచింది.ఇలా ఎన్నో గొడవలు జరిగినప్పటికీ నరేష్ పవిత్ర మాత్రం తమ బంధం గొప్పది అంటూ ఎప్పటికప్పుడు తమ బంధం గురించి తెలియజేస్తూ వచ్చారు..

2022 డిసెంబర్ 31వ తేదీన వీరిద్దరూ కేక్ కట్ చేస్తే లిప్ లాక్ పెట్టుకున్నటువంటి వీడియోని విడుదల చేస్తూ అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు.అయితే తాజాగా నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇది నిజమైన పెళ్లి కాదని ఒక సినిమాలో భాగంగా ఇలా నటించారని తెలుస్తోంది.

ఇలా పెళ్లి చేసుకున్నట్లు నరేష్ సోషల్ మీడియా వేదికగా తెలియజేయడమే కాకుండా తాజాగా తమ హనీమూన్ కి సంబంధించిన ఫోటోలను కూడా ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఈ జంట తమ హనీమూన్ కోసం ఇతర దేశాలకు వెళ్ళినట్టు తెలుస్తుంది.అయితే ప్రస్తుతం వీరిద్దరూ హైదరాబాదులో ఉన్నప్పటికీ ఈ ఫోటోలు ఎలా సాధ్యమయ్యాయి అనే విషయానికి వస్తే…

Naresh Pavitra Lokesh: హనీమూన్ వెకేషన్ లో పవిత్ర నరేష్…

వీరిద్దరూ ఇదివరకే కలిసే ట్రిప్ కి వెళ్లారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రతి ఒక్కరు వీరిద్దరు హనీమూన్ వెళ్లారని భావిస్తున్నారు. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. ఈ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు పాతవి కావడంతో ప్రతి ఒక్కరు ఈ జంట పెళ్లి తర్వాత హనీమూన్ వెళ్లారని భావిస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలంటే ఈ విషయంపై నరేష్ స్పందించాల్సి ఉంది.

Nayanathara -Vignesh Shivan: నయనతార దంపతులు హనీమూన్ కోసం ఎక్కడికి వెళ్లారో తెలుసా? హనీమూన్ కోసం కోట్లలో ఖర్చు?

Nayanathara -Vignesh Shivan: నయనతార విగ్నేష్ గత కొన్ని రోజుల నుంచి ఈ పేరు సోషల్ మీడియాలో పెద్దఎత్తున మార్మోగిపోతోంది.ఇండస్ట్రీలో ఒకరు డైరెక్టర్ గా ఒకరు లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకుని సెలబ్రిటీలుగా ఉన్నటువంటి ఈ జంట కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉండి జూన్ 9వ తేదీ మహాబలిపురంలో ఎంతో అంగరంగ వైభవంగా వీరి వివాహాన్ని జరుపుకున్నారు.

Jabardasth: జబర్దస్త్ బూతుల షో.. రామోజీరావు వద్దని చెప్పారు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్?

ఇలా ప్రేమ పక్షులుగా ఉన్నటువంటి ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి కాగానే ప్రముఖ ఆలయాలను సందర్శించి దైవ దర్శనం చేసుకున్న నయనతార దంపతులు ప్రస్తుతం హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ జంట హనీమూన్ కోసం థాయిలాండ్ లో ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది.

Nayanathara -Vignesh Shivan: నయనతార దంపతులు హనీమూన్ కోసం ఎక్కడికి వెళ్లారో తెలుసా? హనీమూన్ కోసం కోట్లలో ఖర్చు?

పెళ్లికి ముందు వివిధ దేశాలలో హాలిడే వెకేషన్ ఎంజాయ్ చేసిన వీరిద్దరు పెళ్లి తర్వాత దంపతులుగా మొదటి ట్రిప్ కావడంతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే థాయిలాండ్ లో లగ్జరీ హోటల్ లో దిగిన ఈ జంట అక్కడ అందమైన లొకేషన్లలో దిగిన ఫోటోలను విగ్నేష్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ఈ క్రమంలోనే ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

హనీమూన్ కోసం కోట్లలో ఖర్చు చేస్తున్న నయన్ దంపతులు…

ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఎంజాయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక థాయిలాండ్ కోసం ఈ జంట వెళ్తున్న సమయంలో విమానంలో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. మొత్తానికి పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జంట పెళ్లి తర్వాత వారి జీవితాన్ని ఎంతో అందంగా ఆనందంగా గడపడం కోసం ప్లాన్ చేశారు.ఇకపోతే వీరి హనీమూన్ ట్రిప్ కోసం ఏకంగా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం వీరి హనీమూన్ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

హనీమూన్ కు వెళ్లిన జంట.. తీరా అక్కడికి వెళ్లి చూస్తే?

సాధారణంగా ఎంతోమంది ప్రేమించుకొని వివాహాలు చేసుకోవడం సర్వసాధారణమే. ఈ విధంగానే ఓ జంట ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకొని హనీమూన్ కోసం వెళ్లిన ఈ జంట అక్కడ భర్త తన భార్యకు ఒక షాకింగ్ విషయాన్ని తెలిపాడు. తను అసలు మగాడు కాదని.. తన మనసుకు ఆడమనిషినని తను లింగమార్పిడి చేసుకోవాలనుకుంటున్నాననే విషయాన్ని భార్యకు తెలియజేశాడు.

ఈ విధంగా ఆ భర్త తనలో ఉన్న కోరికను తన భార్య ముందు చెప్పడంతో ఆ మాటలు విన్న భార్య ఏ మాత్రం అతనిపై కోపడకుండా తన భర్తకు మద్ధతుగా నిలబడింది. బ్రిటిష్ గ్రాఫిక్ డిజైనర్ జాక్, అమెరికా యువతి  హెర్బీలు.. 2006లో సోషల్ మీడియా ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. 2010లో వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడటంతో 2016వ సంవత్సరంలో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ విధంగా వివాహం చేసుకున్న ఈ జంట హనీమూన్ కి వెళ్ళగానే తన భర్త మనసులోని మాటను బయటపెట్టాడు.

తన భర్త కోరికను విన్న హెర్బీ తన కోరికలను తీర్చడం కోసం ఏకంగా 45వేల పౌండ్లను ఖర్చుచేసి జాక్ కి లింగ మార్పిడి చేయించింది. ఈ విధంగా లింగ మార్పిడి జరిగిన తర్వాత జాక్, హెర్బీ మరోసారి వివాహం చేసుకున్నారు. ఈ విధంగా ఒక కొత్త పద్ధతులు వీరి వివాహం చేసుకోవడంతో వీరు సోషల్ మీడియాలో ఎంతో ప్రాచుర్యం పొందారు. ఈ క్రమంలోనే వీరికి అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. వీరిరువురికీ సంబంధించిన ఈ విషయాన్ని Mirror.ukలో ప్రచురించబడింది.