Tag Archives: instagram post

ఇల్లును అమ్మేయాలనుకుంటున్న జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్.. రీజన్ తెలిస్తే కన్నీరు పెట్టుకోవాల్సిందే?

comedian Shanthi Swaroop : ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా లేడీ గెటప్ తో అందరి దృష్టిలో పడ్డాడు శాంతి స్వరూప్. తన కామెడీ టైమింగ్ తో బుల్లితెర ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్నాడు. ఎక్కువగా లేడీ గెటప్స్ తోనే ఆయన బాగా క్లిక్ అవుతూ ఉంటాడు. అయితే చూడటానికి అందరినీ నవ్విస్తూ ఉండే ఈయన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురుకున్నాడని చెప్పాలి. కొన్ని సందర్భాలలో ఆయన పడిన కష్టాలు గురించి తనకోసం తన తల్లి పడిన కష్టాల గురించి కూడా చెప్పుకొచ్చాడు.

గతంలో తన తల్లి తమ కోసం చాలా ఇళ్లల్లో పని చేసింది అని.. తన తల్లికి గొంతు సరిగ్గా లేకపోవడంతో స్పష్టంగా మాట్లాడలేదని తెలిపాడు. నిజానికి శాంతి స్వరూప్ తన తల్లి పట్ల బాగా ప్రేమ చూపిస్తూ ఉంటాడు. తన తల్లి ఆరోగ్యం బాగు చేయటం కోసం ఆమెను హాస్పిటల్ లో కూడా బాగా చూపించాడు అని గతంలో తెలిసింది. కానీ ఇప్పటికి తన తల్లికి ఆరోగ్యం కుదుట పడలేదని తెలుస్తుంది.

అయితే తాజాగా తను ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియో పంచుకున్నాడు. అదేంటంటే తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారని.. ఆమెకు ఇప్పుడు శస్త్ర చికిత్స అవసరమని.. అందుకు సర్జరీ కోసం డబ్బులు లేకపోవడంతో తన ఇల్లును అమ్మేస్తున్నట్లు తెలిపాడు. అయితే శాంతి స్వరూప్ ఆ మధ్యనే ఇష్టంగా ఇల్లు కొనుక్కున్న సంగతి తెలిసిందే. కానీ తన తల్లి ఆపరేషన్ కోసం తను ఇష్టంగా తీసుకున్న ఇల్లును అమ్మడానికి నిర్ణయించుకున్నాడని తెలిసింది.

comedian Shanthi Swaroop :

అయితే మరో విషయం ఏంటంటే ఈ ఇల్లు అమ్ముతున్న విషయం తన తల్లికి తెలియదు అని.. ఆమె కంటే తనకు ఏది ముఖ్యం కాదు అని.. తను ఈ ఇల్లు అమ్మేస్తున్న విషయం తన తల్లికి తెలిస్తే అస్సలు ఒప్పుకోదని చెబుతూ కంటనీరు పెట్టుకున్నాడు శాంతి స్వరూప్. ఇక ఆ వీడియో చూసిన వాళ్లంతా శాంతి స్వరూప్ చేస్తున్న పనికి ఫిదా అయ్యారు. తల్లి ప్రేమ కోసం ఇష్టమైన ఇల్లును కూడా అమ్ముకుంటున్నావంటే నీది గొప్ప మనసు అంటూ పొగుడుతున్నారు. ఎలాగైనా మీ అమ్మగారు కోలుకుంటారు అంటూ ధైర్యం ఇస్తున్నారు.

Pawan Kalyan: మన బంధం ఇలాగే కొనసాగాలి అంటూ ఫస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ షేర్ చేసిన పవన్!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలో పరంగాను రాజకీయాల పరంగాను ఎంతో బిజీ అయ్యారు. ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తున్న మరోవైపు రాజకీయాలలో కొనసాగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు కేవలం ట్విట్టర్ వేదికగా మాత్రమే తన రాజకీయాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకునేవారు.

పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్ లోకి కూడా అడుగు పెట్టిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టినటువంటి పవన్ కళ్యాణ్ అతి తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో ఫాలోవర్స్ సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి పోస్ట్ పెట్టలేదు కానీ పవన్ కళ్యాణ్ మొదటి పోస్ట్ ఎలాంటిది పెడతారా అని అభిమానులు అందరూ ఎదురు చూశారు.

పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్ లో ఫస్ట్ పోస్ట్ షేర్ చేశారు ఇందులో భాగంగా ఈయన టాలీవుడ్ సెలబ్రిటీలు అందరితో కలిసి దిగినటువంటి ఫోటోలను ఒక వీడియో రూపంలో చేశారు. అంతేకాకుండా ఈ వీడియోతో ఒక బ్యూటిఫుల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేశారు. ఇక ఈ ఫోటోకి పవన్ కళ్యాణ్ క్యాప్షన్ జోడిస్తూ.. మన బంధం ఇలాగే కొనసాగాలని మరెన్నో జ్ఞాపకాలు పంచుకోవాలని ఆశిస్తూ అంటూ క్యాప్షన్ జోడించారు.


Pawan Kalyan: రాజకీయాలకు తావివ్వని పవన్..

ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఈ పోస్ట్ చేసినటువంటి గంట వ్యవధిలోనే ఏకంగా ఐదు లక్షల లైక్స్ సంపాదించుకుంది. ఇక ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ఈ పోస్ట్ కు స్పందిస్తున్నారు.అయితే పవన్ కళ్యాణ్ తన ఫస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ పట్ల ఏ విధమైనటువంటి రాజకీయాలకు తావు లేకుండా చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Actress Mahalakshmi: నటి మహాలక్ష్మి దంపతులు విడాకులకు సిద్ధమయ్యారా… అలా క్లారిటీ ఇచ్చిన నటి!

Actress Mahalakshmi: తమిళ బుల్లితెర నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మహాలక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఇదివరకే వివాహం చేసుకొని ఓ అబ్బాయికి జన్మనిచ్చారు. అయితే తన భర్తతో గొడవల కారణంగా తనకు విడాకులు ఇచ్చి ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ ను రెండవ వివాహం చేసుకున్నారు.
వీరి వివాహం తర్వాత పెద్ద ఎత్తున ఈ జంట గురించి ట్రోల్స్ వచ్చాయి.

మహాలక్ష్మి కేవలం డబ్బు కోసమే ఈయనని పెళ్లి చేసుకున్నారంటూ పెద్ద ఎత్తున ఈ జంట పై విమర్శలు వచ్చాయి. అయితే తమ మధ్య ఉన్నటువంటి ప్రేమను చాటి చెబుతూ ఎప్పటికప్పుడు వీరిద్దరూ చాలా రొమాంటిక్గా ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అయితే గత కొద్ది రోజులుగా వీరిద్దరూ విడిపోతున్నారు అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరికొన్ని తమిళ న్యూస్ చానల్స్ అయితే ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయారంటూ కథనాలు అల్లుతున్నారు.

ఇలా వీరిద్దరు విడాకులు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నటి మహాలక్ష్మి విడాకులు వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.ఈ క్రమంలోనే మహాలక్ష్మి తన భర్తతో కలిసి దిగిన ఒక రొమాంటిక్ ఫోటోని ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ… నువ్వు నా భుజంపై చేయి వేసినప్పుడు ప్రపంచంలో నేను దేనినైనా సాధించగలను అన్న నమ్మకం ధైర్యం వస్తుంది నా మనసునిండా నువ్వే అమ్ము ఐ లవ్ యు అంటూ క్యాప్షన్ జోడించారు.

Actress Mahalakshmi: దేనినైనా సాధించగలను…


ఈ విధంగా మహాలక్ష్మి చేస్తున్న ఈ పోస్టుకు రవీందర్ చంద్రశేఖర్ అని కూడా స్పందిస్తూలవ్ యు అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోతున్నారు అంటూ వచ్చే వార్తలలో ఏ మాత్రం నిజం లేదని, అవన్నీ కేవలం అవాస్తవాలేనని తేలిపోయింది.ప్రస్తుతం మహాలక్ష్మి చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Niharika Konidela: ఈ ప్రపంచం అంతం కాలేదు… ఎన్నో పాఠాలు నేర్చుకున్నా: నిహారిక కొణిదెల

Niharika Konidela: నిహారిక కొణిదెల గత కొన్ని నెలల నుంచి ఈ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. యాంకర్ గా తన ప్రస్థానం మొదలుపెట్టిన ఈమె ఒక మనసు చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యారు. హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోవడంతో నిర్మాతగా వెబ్ సిరీస్ నిర్మిస్తూ నిర్మాతగా గుర్తింపు పొందారు.

Niharika Konidela: ఈ ప్రపంచం అంతం కాలేదు… ఎన్నో పాఠాలు నేర్చుకున్నా: నిహారిక కొణిదెల

ఇలా ఒక వైపు నిర్మాతగా వ్యవహరిస్తున్న సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిహారిక సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు అవ్వడమే కాకుండా దారుణంగా నెటిజన్ల ట్రోలింగ్ కి గురయ్యేది. ఈ క్రమంలోనే తన ఇంస్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేశారు.ఈ విధంగా ఇంస్టాగ్రామ్ ఖాతా డిలీట్ చేయడంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఈమె గురించి ఎన్నో వార్తలు పుట్టుకొచ్చాయి.

Niharika Konidela: ఈ ప్రపంచం అంతం కాలేదు… ఎన్నో పాఠాలు నేర్చుకున్నా: నిహారిక కొణిదెల

ఇక ఇంస్టాగ్రామ్ డిలీట్ చేసిన కొద్ది రోజులకే నిహారిక పబ్ లో పోలీసులకు దొరకడంతో ఈమె గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. ఈ విధంగా పబ్ వ్యవహారం తర్వాత పూర్తిగా సోషల్ మీడియాకు దూరమైన నిహారిక ఒక్కసారిగా ఇంస్టాగ్రామ్ ద్వారా తిరిగి సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు.

వెల్ కమ్ బ్యాక్ నిహారిక…

ఈ సందర్భంగా ఇంస్టాగ్రామ్ ద్వారా నిహారిక చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ప్రపంచం ఇంకా అంతం కాలేదు, ఇతరులు ఏం చేస్తున్నారనే విషయం గురించి నేను పట్టించుకోను,ప్రస్తుతం తాను ఎంతో రీఫ్రెష్ అయ్యానని సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేయడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాను అంటూ నిహారిక ఇంస్టాగ్రామ్ ద్వారా చేసిన పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారింది.ఇలా నిహారిక తిరిగి ఇంస్టాగ్రామ్ లోకి అడుగు పెట్టడంతో ఎంతోమంది అభిమానులు ఆమెకు తిరిగి ఇంస్టాగ్రామ్ కు స్వాగతం పలికారు.

పెళ్లిరోజు సమంత ఇంస్టాగ్రామ్ పోస్ట్… పాత ప్రేమ అంటూ ఎమోషనల్ అయిన సమంత..!

గత కొద్ది రోజుల నుంచి సమంత నాగ చైతన్య విడాకుల విషయం గురించి సోషల్ మీడియాలో పెద్దఎత్తున కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సమంత నాగచైతన్య దంపతులు అక్టోబర్ 2వ తేదీ అధికారికంగా వారి విడాకుల విషయాన్ని ప్రకటించారు. ఇదిలా ఉండగా సమంత అక్టోబర్ 2వ తేదీ నుంచి ఏ విధంగాను సోషల్ మీడియా వేదికగా స్పందించలేదు. ఈ క్రమంలోనే నేడు సమంత మొట్టమొదటిసారిగా తన ఇంస్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ భావోద్వేగమైన పోస్ట్ చేశారు.

నిజానికి సమంత అక్టోబర్ 8వ తేదీ జరగబోయే లాక్ మీ ఫ్యాషన్ షోలో భాగంగా ఒక ఫోటోను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఇందులో సమంత వైట్ కలర్ డ్రెస్ లో ఎంతో అందంగా ఉంటూ వైట్, పింక్ కలర్ గులాబీ పువ్వులు పెట్టుకుని కిందకు చూస్తూ ఉన్నారు. ఈ ఫోటోను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ ఫోటో కింద ఇలా రాసుకొచ్చింది.

పాత ప్రేమ పాటలు… పర్వతాలు, శిఖరం పై వీచే శీతాకాలపు గాలిలుల ధ్వని.. పోగొట్టుకున్న పాత చిత్రాల ప్రేమ పాటలు దొరికినప్పుడు లోపలి బాధను ప్రతిధ్వనించే ప్రేమ పాటలు.. పాత బంగళాలు.. సంధులలో గాలి శబ్దం అంటూ సమంత ఎమోషనల్ అయ్యారు. అయితే ఈ పోస్ట్ సమంత ఫ్యాషన్ షో కి సంబంధించినది అయినప్పటికీ ఇందులో ఏదో తెలియని బాధ ఉన్నట్టు తెలుస్తోంది.

ఇకపోతే సమంత నాగచైతన్య 2017 అక్టోబర్ 7వ తేదీ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే అన్ని సక్రమంగా జరిగి ఉంటే ఈ దంపతులు ఇద్దరూ వీరి నాలుగవ పెళ్లి రోజున నేడు ఎంతో ఘనంగా జరుపుకునే వారు.నేడు తన పెళ్లి రోజు కావడంతో సమంత తన ప్రేమను గుర్తుచేసుకుని ఎమోషనల్ అయిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.