Tag Archives: Jakkanna

Ramya Krishna: బాహుబలి కోసం జక్కన్నకే అలాంటి కండిషన్స్ పెట్టిన రమ్యకృష్ణ… ఏంటో తెలుసా?

Ramya Krishna: సీనియర్ నటి రమ్యకృష్ణ హీరోయిన్గా ఎన్నో సినిమాలలో నటించి ఒకానొక సమయంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అయితే ప్రస్తుతం ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఇప్పుడు కూడా వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె తాజాగా రజనీకాంత్ సరసన నటించిన జైలర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రమ్యకృష్ణ బాహుబలి సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.తనకు సెకండ్ ఇన్నింగ్స్ లో బాహుబలి సినిమా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చింది అని తెలిపారు.

Ramya Krishna: రాత్రిపూట షూటింగ్ కు రాను..


ఇక ఈ సినిమా అవకాశం తనకు వచ్చినప్పుడు తాను రాజమౌళి గారికి కొన్ని కండిషన్స్ పెట్టానని వాటికి ఒప్పుకుంటేనే ఈ సినిమాలో నటిస్తానని చెప్పినట్లు రమ్యకృష్ణ వెల్లడించారు. రాజమౌళి వంటి అగ్ర దర్శకుడికి ఈమె పెట్టిన కండిషన్స్ ఏంటి అనే విషయానికి వస్తే… ఈ సినిమా కోసం ఎక్కువగా కాల్ షీట్స్ ఇవ్వనని తెలిపారట. అంతేకాకుండా ఈ సినిమా షూటింగ్ కోసం తాను రాత్రిపూట అసలు రానని కేవలం పగలు మాత్రమే షూటింగ్ కి వస్తానంటూ కండిషన్లు పెట్టక రాజమౌళి కూడా ఒప్పుకున్నారని ఈమె తెలిపారు.

Mahesh Babu: వామ్మో మూడు భాగాలుగా SSMB 29… భారీగా ప్లాన్ చేసిన జక్కన్న!

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. గత ఏడాది సర్కారు వారి పాట సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అనంతరం ఈయన రాజమౌళి సినిమాతో బిజీ కానున్నారు.

ఈ క్రమంలోనే మహేష్ బాబు తన 29వ చిత్రాన్ని రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నారు.రాజమౌళి సినిమా అంటే ఏ స్థాయిలో ఉంటుందో మనకు తెలిసిందే ఈయన ఇప్పటివరకు అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. బాహుబలి సినిమాను రెండు పార్టలు చిత్రీకరించి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

అనంతరం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో విపరీతమైన మార్కెట్ ఏర్పరచుకున్నారు. ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం విశేషం. ఇలా ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో రాజమౌళి తదుపరి సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఈ క్రమంలోనే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న సినిమా గురించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Mahesh Babu: పదేళ్లు రాజమౌళికి అంకితం కానున్న మహేష్….


వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఏకంగా ఒకటి కాదు రెండు కాదు మూడు పార్టులుగా రాబోతుందని సమాచారం. . అత్యంత భారీ బడ్జెట్ తో అడ్వెంచర్ మూవీగా చేయాలనే ఆలోచనలు రాజమౌళి ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే కనుక నిజమైతే మహేష్ బాబు ఇతర దర్శకులకు అవకాశం ఇవ్వకుండా 10 సంవత్సరాలు పాటు రాజమౌళికి మాత్రమే అంకితం అవుతారని తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Rajamouli: ఆర్ఆర్ఆర్ సీక్వెల్ పై కీలక అప్డేట్ ఇచ్చిన జక్కన్న… సంతోషంలో అభిమానులు!

Rajamouli: రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా అందుకుంది. ఇలా ఈ సినిమాలోని నాటునాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు రావడంతో ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో సీక్వెల్ సినిమాల ట్రెండు నడుస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఒక సినిమా హిట్ అయింది అంటే తప్పనిసరిగా ఆ సినిమాకు సీక్వెల్ చిత్రం చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమా సీక్వెల్ గురించి గతంలో రాజమౌళి స్పందించారు. అయితే తాజాగా ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఈయన మరోసారి సీక్వెల్ సినిమా గురించి మాట్లాడుతూ కీలక అప్డేట్ ఇచ్చారు.

తాజాగా ఒక మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో తనకు మరింత ఉత్సాహంగా పనిచేయడానికి ఎంతో ప్రోత్సాహకరంగా మారిందని తెలియజేశారు.ఇక ఈ సినిమా సీక్వెల్ గురించి మాట్లాడుతూ ఈ సినిమా విడుదలై మంచి ఆదరణ సంపాదించుకున్నప్పుడు సీక్వెల్ గురించి ఆలోచించాము. అప్పుడు మాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి కానీ స్పష్టంగా లేవు.

Rajamouli: స్క్రిప్ట్ పనులలో బిజీగా ఉన్న విజయేంద్రప్రసాద్…


ఇక ఈ సినిమా విదేశాలలో కూడా మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ విషయం గురించి కీరవాణి నాన్నతో కలిసి మాట్లాడే సమయంలో ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన నాన్నగారికి చెప్పి వెంటనే స్క్రిప్ట్ పూర్తి చేయమని చెప్పాము అయితే స్క్రిప్ట్ పూర్తి అయ్యేవరకు సినిమాని ముందుకు తీసుకెళ్లలేమని రాజమౌళి తెలిపారు. వీలైనంత త్వరగా స్క్రిప్ట్ పూర్తి అయితే సీక్వెల్ కూడా ప్రారంభిస్తామని ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి రాజమౌళి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

MM Srelekha: చెల్లెలిని దూరం పెట్టిన కీరవాణి, జక్కన్న.. ఒక్కఫోటోతో క్లారిటీ ఇచ్చిన ఎం ఎం శ్రీలేఖ!

MM Srelekha: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శక ధీరుడు రాజమౌళి ఆయన సోదరుడు కీరవాణి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. రాజమౌళి దర్శకత్వ ప్రతిభకి కీరవాణి సంగీతం తోడైతే ఆ సినిమా పక్కా హిట్ అవ్వాల్సిందే.తాను దర్శకత్వం వహించిన సినిమాల్లో మేజర్ సక్సెస్ క్రెడిట్ తన అన్నయ్య కీరవాణిదే అని రాజమౌళి చెప్తుంటారు. రాజమౌళి తన దర్శకత్వ ప్రతిభతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తే.. కీరవాణి తన పాటతో ప్రపంచ ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు.

ఇక ఇటీవల ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు పలు ప్రశంసలు, పురస్కారాలతో పాటు ఏకంగా ఆస్కార్ నామినేషన్ సాధించాడు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమాలకు కీరవాణి బాణీలు అందించటమే కాకుండా వారి కుటుంబ సభ్యులందరూ కూడా తమ వంతు పనిచేస్తూ సినిమా సక్సెస్ చేయటానికి కష్టపడుతూ ఉంటారు. రాజమౌళి భార్య రమా, కొడుకు కార్తీకేయ, కీరవాణి, ఆయన భార్య శ్రీవల్లి, కొడుకు భైరవ, తమ్ముడు కళ్యాణి మాలిక్ సినిమాకోసం కష్టపడుతూ ఉంటారు.

ఇలా కుటుంబానికి చెందిన వారందరూ కలిసి సమిష్టి కృషితో సినిమాని సక్సెస్ చేస్తూ ఉంటారు. అయితే రాజమౌళి కీరవాణి చెల్లెలు ఎం ఎం శ్రీలేఖ కూడా మ్యూజిక్ డైరెక్టర్గా మంచి గుర్తింపు పొందింది. అయితే రాజమౌళి దర్శకత్వం వహించే సినిమాలలో శ్రీలేఖకు చోటు ఉండదు. అందువల్ల కీరవాణి, రాజమౌళి ఇద్దరూ తమ సోదరిని దూరం పెట్టారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా వీరు సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలలో కూడా శ్రీలేఖ ఎప్పుడూ కనిపించదు. దీంతో అన్నలిద్దరూ కలిసి చెల్లెల్ని దూరం పెట్టారని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

MM Srelekha: మ్యూజిక్ వరల్డ్ టూర్…

తాజాగా శ్రీలేఖ షేర్ చేసిన ఒక్క ఫోటోతో ఈ వార్తలకు పులిస్టాప్ పడింది. సినిమా రంగంలో ప్లే బ్యాక్ సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా తన 25 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న శ్రీలేఖ ‘మ్యూజిక్ వరల్డ్ టూర్ ‘చేపట్టింది. ఈ వరల్డ్ టూర్ కి సంబంధించిన పోస్టర్ ని రాజమౌళి స్వయంగా రిలీజ్ చేశాడు. దానికి సంబంధించిన ఫోటోలను తాజాగా శ్రీలేఖ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన సోదరుడు రాజమౌళికి కృతజ్ఞతలు తెలియజేసింది. ఇంతకాలం అన్నాచెల్లెళ్ల మధ్య ఎడబాటు ఉందని వస్తున్న వార్తలకు ఈ ఒక్క ఫోటోతో శ్రీలేఖ సరైన సమాధానం చెప్పింది.