Rajamouli: రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా అందుకుంది. ఇలా ఈ సినిమాలోని నాటునాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు రావడంతో ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో సీక్వెల్ సినిమాల ట్రెండు నడుస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఒక సినిమా హిట్ అయింది అంటే తప్పనిసరిగా ఆ సినిమాకు సీక్వెల్ చిత్రం చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమా సీక్వెల్ గురించి గతంలో రాజమౌళి స్పందించారు. అయితే తాజాగా ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఈయన మరోసారి సీక్వెల్ సినిమా గురించి మాట్లాడుతూ కీలక అప్డేట్ ఇచ్చారు.
తాజాగా ఒక మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో తనకు మరింత ఉత్సాహంగా పనిచేయడానికి ఎంతో ప్రోత్సాహకరంగా మారిందని తెలియజేశారు.ఇక ఈ సినిమా సీక్వెల్ గురించి మాట్లాడుతూ ఈ సినిమా విడుదలై మంచి ఆదరణ సంపాదించుకున్నప్పుడు సీక్వెల్ గురించి ఆలోచించాము. అప్పుడు మాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి కానీ స్పష్టంగా లేవు.
ఇక ఈ సినిమా విదేశాలలో కూడా మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ విషయం గురించి కీరవాణి నాన్నతో కలిసి మాట్లాడే సమయంలో ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన నాన్నగారికి చెప్పి వెంటనే స్క్రిప్ట్ పూర్తి చేయమని చెప్పాము అయితే స్క్రిప్ట్ పూర్తి అయ్యేవరకు సినిమాని ముందుకు తీసుకెళ్లలేమని రాజమౌళి తెలిపారు. వీలైనంత త్వరగా స్క్రిప్ట్ పూర్తి అయితే సీక్వెల్ కూడా ప్రారంభిస్తామని ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి రాజమౌళి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…