Rajamouli: రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా అందుకుంది. ఇలా ఈ సినిమాలోని నాటునాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు రావడంతో ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో సీక్వెల్ సినిమాల ట్రెండు నడుస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఒక సినిమా హిట్ అయింది అంటే తప్పనిసరిగా ఆ సినిమాకు సీక్వెల్ చిత్రం చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమా సీక్వెల్ గురించి గతంలో రాజమౌళి స్పందించారు. అయితే తాజాగా ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఈయన మరోసారి సీక్వెల్ సినిమా గురించి మాట్లాడుతూ కీలక అప్డేట్ ఇచ్చారు.
తాజాగా ఒక మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో తనకు మరింత ఉత్సాహంగా పనిచేయడానికి ఎంతో ప్రోత్సాహకరంగా మారిందని తెలియజేశారు.ఇక ఈ సినిమా సీక్వెల్ గురించి మాట్లాడుతూ ఈ సినిమా విడుదలై మంచి ఆదరణ సంపాదించుకున్నప్పుడు సీక్వెల్ గురించి ఆలోచించాము. అప్పుడు మాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి కానీ స్పష్టంగా లేవు.
ఇక ఈ సినిమా విదేశాలలో కూడా మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ విషయం గురించి కీరవాణి నాన్నతో కలిసి మాట్లాడే సమయంలో ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన నాన్నగారికి చెప్పి వెంటనే స్క్రిప్ట్ పూర్తి చేయమని చెప్పాము అయితే స్క్రిప్ట్ పూర్తి అయ్యేవరకు సినిమాని ముందుకు తీసుకెళ్లలేమని రాజమౌళి తెలిపారు. వీలైనంత త్వరగా స్క్రిప్ట్ పూర్తి అయితే సీక్వెల్ కూడా ప్రారంభిస్తామని ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి రాజమౌళి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…