Tag Archives: Jayakrishna

Actress Jayalalitha: ఆ డైరక్టర్ యాసిడ్ పోసి చంపేస్తానన్నాడు..నటి జయలలిత!

Actress Jayalalitha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు పొందిన సీనియర్ నటి జయలలిత గురించి తెలియనివారంటూ ఉండరు. నెగిటివ్, పాజిటివ్ పాత్రలతో పాటు కామెడీ పాత్రలలో కూడా నటించి తెలుగు, తమిళ్, కన్నడ,మలయాళీ వంటి భాషలలో కొన్ని వందల సినిమాలలో నటించి సినిమా ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు పొందిన జయలలిత వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా కష్టాలు అనుభవించింది.

నమ్మివారే దారుణంగా మోసం చేయటంతో ఆర్థికంగా చాలా నష్టపోయింది. ఇక ప్రస్తుతం బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవి సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉండగా గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జయలలిత తన జీవితంలో జరిగిన చేదు అనుభవాల గురించి వెల్లడించింది. ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకునే భర్త తనని ఎన్ని చిత్ర హింసలకు గురిచేశాడో చెబుతు ఎమోషనల్ అయ్యింది.

ఈ ఇంటర్వ్యూలో జయలలిత మాట్లాడుతూ” వినోద్ అనే ఒక మలయాళ డైరెక్టర్ ను ఏడేళ్ల పాటు ప్రేమించి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా కూడా వారిని పెళ్లి చేసుకున్నాను. అయితే పెళ్ళి జరిగిన వారం రోజులకే నాకు కష్టాలు మొదలయ్యాయి. ఆయన్ని పెళ్లి చేసుకోవద్దని చలపతి రావు, జయకృష్ణ గారు ఎంతో చెప్పి చూశారు. కానీ ప్రేమ గుడ్డిది కదా . అందుకే వారి మాటలు వినిపించుకోలేదు. నేను పెళ్లి చేసుకోకపోతే ఆయన విషం తాగి చనిపోతానని బెదిరించడంతో నిజమైన ప్రేమ అనుకుని నమ్మి పెళ్లి చేసుకున్నా.

Actress Jayalalitha: గదిలో బంధించారు..

అయితే నా కుటుంబసభ్యులకు ఆ పెళ్లి ఇష్టం లేకపోయినా కూడా నాకోసం వచ్చారు. అయితే నాకు పిల్లలు పుట్టిన తర్వాతే నా పేరు మీద ఉన్న ఆస్తి నాకు చెందుతుందని సంతకం చేయించుకున్నారు. మా పెళ్లి జరిగిన వారం రోజులకు ఈ విషయం ఆయనకి తెలియటంతో ఆస్తి తీసుకురమ్మని నన్ను హింసించడం మొదలుపెట్టాడు. అలా నెమ్మదిగా నన్ను హింసిస్తూ ఒక గదిలో బంధించి నా మీద యాసిడ్ పోసి చంపటానికి కూడా ప్రయత్నించాడు. అయితే ఆ సమయంలో చలపతి రావు గారు నన్ను ఆ ఇంటి నుండి బయటకు తెచ్చారు. ఇలా ఏడేళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న కూడా అది మూడు నాలుగు ముచ్చటగానే మిగిలిపోయింది. ఏడాది తిరగకుండానే అతనితో విడాకులు తీసుకొని దూరంగా వచ్చేసాను ” అంటూ జయలలిత చెప్పుకొచ్చింది.

Actress Maheswari: ఒకప్పటి స్టార్ నటి మహేశ్వరి ఇప్పుడు ఎలా ఉంది ఏం చేస్తుందో తెలుసా?

Actress Maheswari: సినిమా ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్లు వస్తూ ఉంటే పాత హీరోయిన్లు కనుమరుగవుతూ ఉంటారు. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం తిరిగి తమ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి అభిమానులను ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటారు. ఇలా ఇప్పటికే ఎంతోమంది సీనియర్ హీరోయిన్స్ తమ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఎంతో బిజీగా ఇండస్ట్రీలో గడుపుతున్నారు.

ఇలా ఒకప్పుడు ఎంతో మంది స్టార్ హీరోలతో తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటించిన మహేశ్వరి గురించి అందరికీ సుపరిచితమే. తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అమ్మాయి కాపురం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె ఈ సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది అనంతరం పెళ్లి సినిమాతో ఎంతో మంచి హిట్ అందుకుంది.

అనంతరం రవితేజతో కలిసి నటించిన నీకోసం అనే సినిమాకు గాను ఈమె నంది అవార్డును కూడా అందుకున్నారు. ఇలా గులాబీ, దెయ్యం, నీకోసం, పెళ్లి, ప్రియురాగాలు, మా అన్నయ్య,తిరుమల తిరుపతి వెంకటేశ వంటి సినిమాలలో నటించి సందడి చేసినటువంటి మహేశ్వరి ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే ఈమె 2008వ సంవత్సరంలో జయకృష్ణ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.

Actress Maheswari: సెకండ్ ఇన్నింగ్స్ కు సిద్ధమైన మహేశ్వరి…


ఇలా వైవాహిక జీవితంలో స్థిరపడినటువంటి ఈమె ఇండస్ట్రీకి దూరమయ్యారు అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికగా తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు ఇక దివంగత నటి శ్రీదేవికి సమీప బంధువు అయినటువంటి మహేశ్వరి ప్రస్తుతం శ్రీదేవి కుమార్తె జాన్వీ కెరియర్ కు చాలా అండగా నిలుస్తున్నారని ఆమె షూటింగ్ లొకేషన్లో తనకు తోడుగా పాల్గొంటూ తన కెరీర్ కు అండగా నిలుస్తున్నారని తెలుస్తుంది. అలాగే మంచి కథ పాత్రలు కనుక దొరికితే మహేశ్వరి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

Namrata: రమేష్ బాబు కుమార్తె గురించి మొదటిసారి అలాంటి పోస్ట్ చేసిన నమ్రత.. పోస్ట్ వైరల్!

Namrata: దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ మరణం ఘట్టమనేని ఫ్యామిలీని ఒక్కసారిగా శోకసంద్రంలోకి ముంచింది.ఒకే ఏడాదిలోనే ఈ ఫ్యామిలీకి సంబంధించిన ముగ్గురు వ్యక్తులు మరణించడంతో వీరి కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. ఇక కృష్ణ గారు మరి నుంచి దాదాపు 15 రోజులు అయినప్పటికీ ఇంకా ఈ కుటుంబ సభ్యులు ఎవరూ కూడా కృష్ణ మరణం నుంచి బయటపడలేకపోతున్నారు.

ఇక మహేష్ బాబు తన దుఃఖానికి దిగు మింగుకొని తన తండ్రికి నిర్వర్తించాల్సిన కార్యక్రమాలన్నింటిని కూడా పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకపోతే మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు ఫ్యామిలీ గురించి చాలామందికి తెలియదు. అయితే కృష్ణ చిన్న కర్మ రోజున మహేష్ బాబుతో కలిసి రమేష్ బాబు భార్య పిల్లలు ఫోటోలు దిగడంతో ఒకసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.

ఇకపోతే రమేష్ బాబు భార్య మృదుల అలాగే కూతురు భారతి కుమారుడు జయకృష్ణ ఫోటోలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇకపోతే తాజాగా మహేష్ బాబు భార్య నమ్రత రమేష్ బాబు కుమార్తె భారతి అలాగే సితారతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ మొదటిసారి భారతి గురించి పోస్ట్ చేశారు.

Namrata: ఇంట్లో నవ్వులు విరిపూసాయి..

చాలా రోజుల తర్వాత ఈ ఇద్దరమ్మాయిల వల్ల ఇంట్లో నవ్వులొచ్చాయి. అంటూ భారతి, సితారతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. మొదటిసారి తన బావ కుమార్తెతో కలిసి దిగిన ఫోటోని నమ్రత షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన మహేష్ అభిమానులు పెద్ద ఎత్తున ఈ ఫోటో పై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.