Actress Maheswari: సినిమా ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్లు వస్తూ ఉంటే పాత హీరోయిన్లు కనుమరుగవుతూ ఉంటారు. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం తిరిగి తమ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి అభిమానులను ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటారు. ఇలా ఇప్పటికే ఎంతోమంది సీనియర్ హీరోయిన్స్ తమ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఎంతో బిజీగా ఇండస్ట్రీలో గడుపుతున్నారు.
ఇలా ఒకప్పుడు ఎంతో మంది స్టార్ హీరోలతో తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటించిన మహేశ్వరి గురించి అందరికీ సుపరిచితమే. తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అమ్మాయి కాపురం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె ఈ సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది అనంతరం పెళ్లి సినిమాతో ఎంతో మంచి హిట్ అందుకుంది.
అనంతరం రవితేజతో కలిసి నటించిన నీకోసం అనే సినిమాకు గాను ఈమె నంది అవార్డును కూడా అందుకున్నారు. ఇలా గులాబీ, దెయ్యం, నీకోసం, పెళ్లి, ప్రియురాగాలు, మా అన్నయ్య,తిరుమల తిరుపతి వెంకటేశ వంటి సినిమాలలో నటించి సందడి చేసినటువంటి మహేశ్వరి ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే ఈమె 2008వ సంవత్సరంలో జయకృష్ణ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.
ఇలా వైవాహిక జీవితంలో స్థిరపడినటువంటి ఈమె ఇండస్ట్రీకి దూరమయ్యారు అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికగా తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు ఇక దివంగత నటి శ్రీదేవికి సమీప బంధువు అయినటువంటి మహేశ్వరి ప్రస్తుతం శ్రీదేవి కుమార్తె జాన్వీ కెరియర్ కు చాలా అండగా నిలుస్తున్నారని ఆమె షూటింగ్ లొకేషన్లో తనకు తోడుగా పాల్గొంటూ తన కెరీర్ కు అండగా నిలుస్తున్నారని తెలుస్తుంది. అలాగే మంచి కథ పాత్రలు కనుక దొరికితే మహేశ్వరి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…