Tag Archives: kamal hassan

కమల్ హాసన్ నటవిశ్వరూపం చూపించిన సినిమాలు ఇవే!

కమల్‌హాసన్ నటన సినీ పరిశ్రమలో మరెవరు చేయలేరు. అంతటి వైవిద్యమైన, విలక్షణంగా నటిస్తారు. అతడు కొన్ని సినిమాల్లో అయితే విభిన్న పాత్రల్లో నటించి.. వివిధ రకాలుగా హావభావాలను పండిస్తాడు. అంతటి విలక్షణ నటుడు నిజంగా భారతీయ చిత్ర పరిశ్రమలోనేలేరని అనిపిస్తుంటుంది. 1960 లో తమిళ భాషా చిత్రం కలత్తూర్ కన్నమ్మలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన వృత్తిని ప్రారంభించాడు. దీని కోసం అతను రాష్ట్రపతి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు .

ప్రధాన నటుడిగా కె.బాలచందర్ దర్శకత్వం వహించిన 1975 నాటి అపూర్వ రాగంగళ్‌లో వచ్చింది. తర్వాత అతడి కెరీర్ నేటి వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోయింది. అతడు 220 కి పైగా చిత్రాలలో నటించారు. 2019 లో భారతదేశంలో సినిమా రంగంలో 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అతికొద్ది నటులలో ఒకడిగా నిలిచాడు. 21 ఫిబ్రవరి 2018 న తన రాజకీయ పార్టీ మక్కల్ నీది మయంను లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక అతడు నటించిన సినిమాల్లో చూడాల్సిన సినిమాలు ఏంటంటే.. 1996లో విడుదల అయిన భారతీయుడు.

అవినీతి, లంచగొండితనం నేపథ్యంలో శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రలు పోషించారు కమల్. ఈ చిత్రంలో కమల్ నటన అద్వితీయం. అతడి వందో సినిమా అయిన ‘రాజా పార్వై’లో గుడ్డి వాడిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. 1981లో ఇది తెలుగులో అమావాస్య చంద్రుడుగా విడుదల అయింది. 1989లో విడుదలైన విచిత్ర సోదరులు కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.

ఇందులో కమల్ త్రిపాత్రాభినయం చేస్తారు. 1986లో వచ్చిన స్వాతి ముత్యం సినిమా అతడి కెరీర్ లోనే మైలురాయిగా పేర్కొనవచ్చు. మరో చరిత్ర సినిమా కూడా అతడికి మంచి పేరును తీసుకొచ్చింది. ‘ఆకలి రాజ్యం’ (1981) అయితే ఇప్పటికీ చాలామంది చూస్తుంటారు. ఇంకా అతడి సినమాల్లో ఎన్నో చూడదగ్గరవి ఉన్నాయి. అందులో మైఖేల్ మదన కామ రాజన్, హే రామ్‌ వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలు ఉన్నాయి.

ఖుష్‌బూ అప్పటికే పెళ్ళైన హీరోతో ప్రేమలో పడ్డ విషయం తెలుసా.. అసలు ఏం జరిగిందంటే..

ఖుష్‌బూ హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరును తెచ్చుకున్నారు. 1991 సంవత్సరం ఆమె కెరీర్ ను అనూహ్యంగా మలుపుతిప్పిన సంవత్సరంగా పేర్కొనాలి. తమిళంలో ఆమె నటించిన చిత్రం చిన్నతంబి అప్పట్లో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌యింది. ఈ సినిమా తమిళ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. విపరీతమైన అభిమానులను సొంతం చేసుకుంది. ప్రతి జిల్లాలో సినిమా విజయవంతం అయినందుకు వేడుకలు కూడా జరుపుకున్నారు.

అప్పట్లో ఆమెకు దేవాలయాలు కూడా కట్టారు. కొందరు అభిమానులు అయితే ఆమెకు రక్తంతో కూడా ఉత్తరాలు రాశారు. ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్ వంటి స్టార్ హీరోలతో ఆమె నటించే అవకాశాలు దక్కాయి. ఇలా సినిమాలో ఆమె జీవితం ఎంతో విజయవంతగా సాగినా నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. పెళ్లైన ఓ స్టార్ హీరోతో ఆమె ప్రేమలో పడ్డారు. ఆమె ప్రభుతో సంబంధం గురించి అప్పట్లో గుసగుసలు బాగా వినిపించేవి.

ఆమెకు హీరోయిన్ గా మంచి పేరు రాకముందే ఆమె 1989లో ప్రభుతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 1993 సమయంలో ఒక పాపుల‌ర్ త‌మిళ డైలీలో ఈ వార్త‌ను ఫ్రంట్ పేజీలో ప్రచురించడంతో.. ఆమెను ప్రతీ ఒక్కరు తిట్టుకున్నారు. ఒక సంసార జీవితంలో నిప్పులు పోస్తావా అంటూ ప్రతి ఒక్కరూ తిట్టారు. ఆ క్ర‌మంలో ఆమెను ఏకంగా ఐదు సినిమాల నుంచి తొల‌గించారు. ఆ కారణంగానే ప్రభుతో ఆమె అనుబంధాన్ని తెంచేసుకుంది.

ఆ తర్వాత సినిమాలు చేయడం చాలా రోజుల వరకు మానేసింది. డైరెక్ట‌ర్ సి. సుంద‌ర్‌ను 2000 సంవ‌త్స‌రంలో పెళ్లి చేసుకున్నారు ఖుష్‌బూ. తర్వాత ఎలాంటి గొడవలు లేకుండా.. ఎవరి వ్యక్తిగత జీవితంలో వాళ్లు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా గ‌డుపుతున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఖుష్‌బూ భర్త సుందర్ దర్శకత్వంలో ప్రభు ఓ సినిమాలో నటించారు.

అవును.. నా బాడీలో అత్యంత ఖరీదైన పార్ట్ అదే : శృతిహాసన్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్, కమల్ హాసన్ కూతురు శృతిహాసన్. ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది. టాలీవుడ్ లో ముక్కుసూటి అమ్మాయిగా నిలిచింది. ఈ మధ్య వార్తల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. ఇక ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ తో ఉంటూ బాగా ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను అభిమానులకు బాగా షేర్ చేసుకుంటుంది.

ఇక గతంలో తన మాజీ బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ చెప్పగా మంచి ఫేమ్ లో ఉన్న సమయంలోనే కొన్ని రోజుల వరకు సినిమాలకు దూరంగా ఉంది. ఇక మళ్లీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది విడుదలైన రవితేజ నటించిన క్రాక్ సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో ఓ చిన్న పాత్రలో మెప్పించింది. ఇక ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న సలార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ ఉండే శృతి ప్రస్తుతం ఉన్న తన బాయ్ ఫ్రెండ్ తో ఫోటోలు దిగుతూ బాగా షేర్ చేసుకుంటుంది.

ఇక ఈ మధ్య అభిమానులతో కూడా తెగ ముచ్చట్లు పెడుతుంది. ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ద్వారా లైవ్ చాట్ లో అభిమానులతో ముచ్చటించింది. దీంతో అభిమానులు తనను అడగాల్సిన ప్రశ్నలను అడిగి వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నారు. ఇక ఓ అభిమాని శృతిహాసన్ ను.. మీ శరీరంలో మీకు ఏ భాగం అంటే ఇష్టం.. మీ ముక్కు అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా.. అది నిజమేనా అని ప్రశ్నించగా.. దీనికి స్పందించిన శృతిహాసన్.. అవును నాకు నా ముక్కు అంటే ఇష్టమే.. దాని కోసమేగా చాలా డబ్బులు ఖర్చు చేసింది అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో తాను గతంలో తన ముక్కు చేసుకున్న ప్లాస్టిక్ సర్జరీ విషయం గురించి తన నోటి ద్వారానే బయటకు చెప్పుకుంది.

చెల్లెలి దర్శకత్వంలో తప్పకుండా నటిస్తా… శృతిహాసన్ సంచలన వ్యాఖ్యలు!

ప్రముఖ నటుడు,లోక నాయకుడిగా పేరు సంపాదించుకున్న కమల్ హాసన్ ముద్దుల కూతురు శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.సినిమాలలో తన నటన ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈమె కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. తిరిగి సినిమాలలో రీ ఎంట్రీ ద్వారా మంచి విజయాలను అందుకున్న శృతి హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు.

శృతిహాసన్ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండటమే కాకుండా సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్ గా ఉంటారు.నిత్యం తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన శృతి హాసన్ అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు తెలియజేశారు.

శృతి హాసన్ చెల్లెలు అక్షర హాసన్ దర్శక రంగంలో రాణించాలనేదే తన కోరిక అని తెలిపారు. ఈ సందర్భంలోనే తన చెల్లెలు దర్శకత్వం వహిస్తున్నప్పుడు తనకు సరిపడా కథను అందిస్తే తప్పకుండా నటిస్తానని శృతి హాసన్ ఈ సందర్భంగా తెలిపారు.

ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సలార్ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా కరోనా కారణంతో వాయిదా పడింది. ఈ క్రమంలోనే ఇంటికే పరిమితమైన శృతి హాసన్ తాజాగా అభిమానులతో ముచ్చటించి తన చెల్లెల దర్శకత్వంలో నటిస్తాననే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

హమ్మయ్య.. ఎట్టకేలకు కమల్ మొదలెడుతున్నాడు..!!

కోలీవుడ్ ప్రముఖ నటుడు కమల్ హాసన్ కథానాయకుడిగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఇండియన్2’.. ఆ మధ్య ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో.. సెట్లో జరిగిన క్రేన్ ప్రమాదం కారణంగా ఇండియన్-2 సినిమా మధ్యలో ఆగిపోవడం.. ఆ తర్వాత ఎంతకీ అది పున:ప్రారంభం కాకపోవడం.. ఈ విషయమై దర్శకుడు శంకర్, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధినేతల మధ్య తీవ్ర విభేదాలు నెలకొనడం తెలిసిన సంగతే.

త్వరగా ఈ సినిమాను పున:ప్రారంభించే విషయం తేల్చాలని కొన్ని నెలల ముందు నిర్మాతలను నిలదీస్తే వాళ్లు స్పందించలేదు. తర్వాత శంకరేమో రామ్ చరణ్‌తో వేరే సినిమా మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటుంటే నిర్మాతలు అడ్డం పడ్డారు.వీళ్లిలా గొడవ పడుతుంటే హీరో కమల్ హాసన్ మాత్రం చోద్యం చూస్తూ కూర్చున్నాడు. నిజానికి ‘ఇండియన్-2’ పున:ప్రారంభం కాకపోవడానికి అసలు కారణం కమలే అన్నది కోలీవుడ్ వర్గాల మాట.

క్రేన్ ప్రమాదం తర్వాత నిర్మాతలతో ఆయనకు పెద్ద గొడవే జరిగింది. ఆయన పొలిటికల్ కమిట్మెంట్లు కూడా సినిమా మళ్లీ మొదలు కాకపోవడానికి కారణం. ఇండియన్-2 సంగతి తేల్చకుండా ‘బిగ్ బాస్’ షో చేయడం, అలాగే ‘విక్రమ్’ అనే మరో సినిమాను ఆయన మొదలుపెట్టడం తెలిసిందే.ఐతే ఇటీవల వెల్లడైన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కమల్ హాసన్ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు రాలేదు. స్వయంగా కమలే ఓడిపోయాడు.

ఇప్పుడు తన రాజకీయ గమ్యం ఏంటో తెలియని అయోమయంలో ఉన్నారు కమల్. ప్రస్తుతానికి రాజకీయాల్లో ఆయన చేయడానికి ఏమీ లేదు. దీంతో మళ్లీ అభిమానుల కోరిక మేరకు సినిమాల్లో బిజీ అవ్వాలని కమల్ చూస్తున్నట్లు చెబుతున్నారు.ఈ క్రమంలోనే ‘ఇండియన్-2’ వివాదాన్ని పరిష్కరించి ఈ సినిమాను పున:ప్రారంభించడానికి కమలే చొరవ తీసుకోనున్నాడట. ఏకంగా రూ.180 కోట్లు ఖర్చు పెట్టిన సినిమాను ఆపేయడం సరి కాదని భావించి.. లైకా అధినేతలు, శంకర్‌తో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా ‘ఇండియన్-2’ను పున:ప్రారంభించి పూర్తి చేయాలని కమల్ భావిస్తున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి..!!