Tag Archives: Karthik Dandu

Karthik Varma Dandu: ప్రేక్షకులను భయపెట్టి ఖరీదైన కారు కొట్టేసిన విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు!

Karthik Varma Dandu: విరూపాక్ష సినిమాతో దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన కార్తీక్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడైన కార్తీక్ దర్శకత్వంలో సాయి ధరంతేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన విరూపాక్ష సినిమా ఇటీవల విడుదలై అందరి అంచనాలు తారుమారు చేస్తూ ఘనవిజయం సాధించింది.

తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.100 కొల్లగొట్టడమే కాకుండా జోరు కొనసాగిస్తోంది. హర్రర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను భయపెట్టడంలో బాగా సక్సెస్ అయ్యి హిట్ అందుకుంది. ఇదిలా ఉండగా కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో నిర్మాతలు ఆయనకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అందించారు.

సాధారణంగా సినిమా హిట్ అయ్యి మంచి వసూళ్లు రాబడితే నిర్మాతలు ఆ సినిమా దర్శకులకు ఏదో ఒక ఖరీదైన బహుమతిని అందజేస్తూ ఉంటారు. విరూపాక్ష సినిమా విషయంలో కూడా అదే జరగడం వల్ల ఆ సినిమా నిర్మాతలు దర్శకుడు కార్తీక్ కి ఒక గిఫ్ట్ అందజేశారు. విరూపాక్ష సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి రూ. 100 కోట్లు వసూళ్లు చేయడంతో దర్శకుడు కార్తీక్ కి నిర్మాతలు ఖరీదైన బెంజ్ కారుని బహుమతిగా అందజేశారు.

Karthik Varma Dandu:70 లక్షల కారును బహుమతిగా అందుకున్న డైరెక్టర్…

ప్రస్తుతం ఆకారుకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను బట్టి చూస్తే నిర్మాతలు బెంజ్ సీ మోడల్ కారుని దర్శకుడికి బహుకరించినట్లు తెలుస్తోంది. దీని విలువ దాదాపు రూ . 60 నుండి రూ. 70 లక్షల వరకు ఉంటుంది. ఏది ఏమైనా ప్రేక్షకులను భయపెట్టడంలో సక్సెస్ అయిన కార్తీక్ కు నిర్మాతలు ఒక ఖరీదైన కారుని బహుమతిగా అందజేశారు.

Samyuktha Menon: విరూపాక్ష దర్శకుడుకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన సంయుక్త మీనన్..?

Samyuktha Menon: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో విరూపాక్ష సినిమా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమాకి కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 21వ తేదీన భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అందరి అంచనాలకు చేరువయ్యింది. ఈ సినిమా విడుదలైన మొదటి షో నుండి హిట్ టాక్ తో దూసుకుపోతూ ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతోంది. దీంతో చిత్ర బృందం ఫుల్ ఖుషీ లో ఉంది.

ఇదిలా ఉండగా విరూపాక్ష బ్యూటీ సంయుక్త మీనన్ తాజాగా దర్శకుడు కార్తీక్ దండుకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విరూపాక్ష సినిమా విడుదలైన తర్వాత సినిమా రెస్పాన్స్ గురించి తెలుసుకోవటానికి సినిమా యూనిట్ తో పాటు దర్శకుడు కార్తీక్ కూడా ప్రేక్షకులతో కలిసి థియేటర్ కి వెళ్ళగా అక్కడ అతని ఫోన్ ఎవరో దొంగలించినట్టు కార్తీక్ ఇటీవల తెలియజేశాడు.

ఇలా దర్శకుడు ఫోన్ పోగొట్టుకుపోవడంతో తనకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచనలో ఉన్నటువంటి సంయుక్త అతనికి ఐఫోన్ ప్రో మోడల్ సెల్ఫోన్ ని గిఫ్ట్ గా ఇచ్చినట్టు స్వయంగా వెల్లడించింది. సినిమా హిట్ అయిన సందర్భంగా దర్శకుడికి ఏదైనా బహుమతి ఇవ్వాలనుకుంటున్న సందర్భంలో కార్తీక్ ఫోన్ దొంగలించబడింది. దీంతో సంయుక్త వెంటనే అతనికి ఐఫోన్ గిఫ్ట్ గా ఇచ్చి సర్ప్రైజ్ చేసినట్లు తెలిపింది.

Samyuktha Menon: సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సాయి ధరమ్ తేజ్…

కార్తీక్ ఫోన్ పోవడంతో సినిమా గురించి సోషల్ మీడియాలో ఎలాంటి రివ్యూస్ వస్తున్నాయో తెలుసుకోవటానికి యూనిట్ లో ఉన్న వారి మొబైల్ లో చూసేవాడని సంయుక్త తెలిపింది. ఇదిలా ఉండగా సాయి ధరమ్ తేజ్ ప్రమాదం నుండి కోలుకున్న తర్వాత నటించిన ఈ సినిమా మంచి హిట్టు అందుకోవడంతో సాయి ధరమ్ తేజ్ ఫుల్ హ్యాపీగా సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.

Virupaksha Movie: విరూపాక్ష సీక్వెల్ గురించి నెటిజన్ ప్రశ్న.. క్లారిటీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్!

Virupaksha Movie: సుప్రీం హీరో సాయిధరమ్ తేజ నటించిన విరూపాక్ష సినిమా ఇటీవల విడుదలై మంచి హిట్ అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. యువ దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని సక్సెస్ ఫుల్ గా ముందుకి దూసుకుపోతోంది. ప్రమాదం తర్వాత సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకొని ఈ సినిమాలో నటించాడు.

అసలు భవిష్యత్తులో సినిమాలలో నటిస్తానా? లేదా? అన్న అనుమానంతో ఉన్న సాయిధరమ్ తేజ్ ఈ సినిమాలో నటించి హిట్ కొట్టాడు. ఈ సినిమా హిట్ అవ్వడంతో సాయిధరమ్ తేజ్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా క్లైమాక్స్ లో సీక్వెల్ గురించి ఒక చిన్న హింట్ ఇచ్చారు. దీంతో విరూపాక్ష సీక్వెల్ గురించి అభిమానులు అడిగిన ప్రశ్నలకు సాయిధరమ్ తేజ్ ఆసక్తికర సమాధానం చెప్పాడు.

ఈ క్రమంలో తాజాగా #AskSDT పేరుతో అభిమానులతో ముచ్చటించిన సాయి ధరమ్ తేజ్ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు.ఈ క్రమంలో ఓ నెటిజన్‌.. ఇంతకు “విరూపాక్ష మూవీ క్లైమాక్స్ లో చిన్న హింట్ ఇచ్చారు కదా.. మరి ఈ సినిమా సీక్వెల్ ఉంటుందా..? ఒకవేళ పార్ట్ 2 ఉంటే మన ఫ్యాన్స్ కి పండుగే” అని ట్వీట్ చేశాడు.
నెటిజన్ అడిగిన ఈ ప్రశ్నకు సాయి ధరమ్‌ తేజ్‌ స్పందిస్తూ.. ‘ సీక్వెల్‌ ఉంటుంది అని క్లైమాక్స్‌లో చిన్న హింట్‌ ఇచ్చాం కదా” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Virupaksha Movie: సీక్వెల్ ఉంటుంది కానీ…

ఇక ‘విరూపాక్ష’ సీక్వెల్‌పై దర్శకుడు కార్తీక్ దండు ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల ఓ చానెల్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తీక్ ని ‘ విరూపాక్ష సీక్వెల్‌ ఉంటుందా అని ప్రశ్నించగా..ఇప్పటి వరకైతే… సీక్వెల్‌ గురించి నేను ఎలాంటి ఆలోచన చేయలేదు. కానీ నేను, సుకుమార్ ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా విరూపాక్ష సీక్వెల్ ఉంటుంది.. కాకపోతే వెంటనే రాకపోవచ్చు’’ అని కార్తిక్ సమధానం చెప్పాడు. మొత్తానికి విరూపాక్ష సీక్వెల్ గురించి క్లారిటీ రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Karthik Dandu: సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ కావడానికి ఆ హీరోయిన్ కారణం: విరూపాక్ష డైరెక్టర్

Karthik Dandu: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సంయుక్త మీనన్ జంటగా విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా సంయుక్త మీనన్ మరొక హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈమె తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి భీమ్లా నాయక్ సినిమా ద్వారా అడుగు పెట్టారు.

ఈ సినిమా సక్సెస్ కావడంతో వెంటనే బింబిసారా, సార్ వంటి సినిమాలలో కూడా నటించే అవకాశాలు అందుకున్నారు. ఈ సినిమాలు కూడా సక్సెస్ కావడంతో ఇండస్ట్రీలో అందరూ కూడా సంయుక్త మీనన్ ను గోల్డెన్ లెగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇకపోతే విరూపాక్ష సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో గోల్డెన్ లెగ్ ఐరన్ లెగ్ అనే విషయాల గురించి చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఒక రిపోర్టర్ ఈ విషయం గురించి డైరెక్టర్ ను ప్రశ్నించారు.

ఈ ప్రశ్నలకు ఆయన ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ… నటి సంయుక్త మీనన్ నటించిన వరుస సినిమాలు సక్సెస్ అయ్యాయి కాబట్టి తనని గోల్డెన్ లెగ్ అని పిలుస్తున్నాము.అయితే సాయి ధరమ్ తేజ్ ప్రమాదం జరగకముందే ఈ సినిమా గురించి చర్చలు అన్ని జరిగాయి. ఇక అప్పుడు ఈ సినిమా కోసం సంయుక్త మీనన్ ను ఎంపిక చేసాము. అయితే ఆమె వచ్చిన తర్వాతే సాయి ధరమ్ తేజ్ కి ప్రమాదం జరిగిందని ఆమెని ఐరన్ లెగ్ అని పిలవలేము కదా అంటూ కామెంట్ చేశారు.

Karthik Dandu: స్క్రిప్ట్ మీదే ఆధారపడి ఉంటుంది…

ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ ఐరన్ లెగ్ అనేది ఏదీ ఉండదని అంతా కూడా స్క్రిప్ట్ మీదే ఆధారపడి ఉంటుందని ఈ సందర్భంగా కార్తీక్ దండు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి. అయితే ఈయన మాట్లాడే సమయంలో తను వచ్చాకే ప్రమాదం జరిగిందని చెప్పడంతో ఒక్కసారిగా సంయుక్త మీనన్ షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ పెట్టారు.ఏది ఏమైనా డైరెక్టర్ కార్తీక్ దండు చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Sukumar: విరూపాక్ష డైరెక్టర్ ఎక్కువ రోజులు బ్రతకడని చెప్పారు… ఎమోషనల్ అయినా సుకుమార్!

Sukumar: విరూపాక్ష సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు డైరెక్టర్ కార్తీక్ దండు. ఈయన కూడా డైరెక్టర్ సుకుమార్ వద్ద శిష్యరికం పొంది దర్శకుడిగా మారారు. ఇలా సుకుమార్ శిష్యుడిగా ఈయన విరూపాక్ష సినిమా ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా ఈనెల 21వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఏలూరులో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సుకుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుకుమార్ డైరెక్టర్ కార్తీక్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్తీక్ నా వద్దకు అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చినప్పుడు అతని జీవితం చాలా చిన్నదని తెలిపారు.ఆయన ఒక భయంకరమైన వ్యాధితో పోరాడుతున్నారు. తన జీవితం మొత్తం స్టెరాయిడ్స్ తీసుకునే బ్రతకాల్సి ఉంది.

ఇక డాక్టర్లు కూడా కార్తీక్ ఐదారు సంవత్సరాలకు మించి బ్రతకరని చెప్పారు.అయితే ఈయన ఆరోగ్య విషయంలో తన తల్లి ఎంతో శ్రద్ధ తీసుకుందని ఆమె దీవెనల వల్లే ఈయన క్రమక్రమంగా వ్యాధి నుంచి బయటపడ్డారని సుకుమార్ తెలిపారు. కార్తీక్ ఇలాంటి వ్యాధితో బాధపడుతున్నప్పటికీ ఆయన తన వ్యాధి గురించి బాధపడకుండా తాను చనిపోయేలోపు ఒక సినిమాకి డైరెక్టర్గా గుర్తింపు పొంది చనిపోవాలని అనేవారు.

Sukumar: చనిపోయేలోపు డైరెక్టర్ అవ్వాలి…

ఆయన అనుకున్న విధంగానే నేడు విరూపాక్ష సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారని సుకుమార్ వెల్లడించారు.అయితే ప్రస్తుతం కార్తీక్ పూర్తిగా తన ఆరోగ్య సమస్య నుంచి కోలుకున్నారని ఇదంతా తన తల్లి వల్లే జరిగింది అంటూ ఈ సందర్భంగా సుకుమార్ తన శిష్యుడు కార్తీక్ అనారోగ్య సమస్యల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.