Tag Archives: Krishnamraj

Manchu Mohan Babu: నోరారా అరేయ్ అంటూ పిలిచేవారు.. కృష్ణంరాజు సంతాప సభలో మోహన్ బాబు ఎమోషనల్!

Manchu Mohan Babu: టాలీవుడ్ రెబల్ కృష్ణంరాజు మరణించడంతో సినీ ప్రపంచం ఓ గొప్ప నటుడిని కోల్పోయిందని, ఆయన లేని లోటు ఎవరు పోర్చలేరు అంటూ పలువురు సినీ ప్రముఖులు కృష్ణంరాజు సినిమా పరిశ్రమకు చేసిన సేవలను కొనియాడారు.1966లో చిలుక గోరింక సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన తన తుది శ్వాస వదిలే వరకు సినిమాలలో నటిస్తూ చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు అందించారు.

ఇలా చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కృష్ణంరాజు ఆదివారం మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈయన మరణించడంతో మంగళవారం ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు, మంచు విష్ణు, సి కళ్యాణ్, జీవిత, తమ్మారెడ్డి భరద్వాజ్ వంటి తదితరులు పాల్గొన్నారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మంచు మోహన్ బాబు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.తన ఆత్మీయులు ఎంతోమంది అనంత లోకాలకు వెళ్లిన ఎప్పుడు సంతాప సభలో పాల్గొనలేదని మొదటిసారి ఈ సభలో పాల్గొనడం జరిగింది అంటూ ఈయన ఎమోషనల్ అయ్యారు. ఇక కృష్ణంరాజుతో తనకున్న అనుబంధం గురించి మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు.

Manchu Mohan Babu: మొదటిసారి బెంజ్ కారు ఎక్కించింది ఈయనే..

నన్ను ఇండస్ట్రీలో నోరారా అరేయ్ అంటూ పిలిచే ఏకైక వ్యక్తి కృష్ణంరాజు గారు. అలాగే తనని మొట్టమొదటిసారి బెంజ్ కార్ ఎక్కించినది కూడా ఈయనే అంటూ మోహన్ బాబు కృష్ణంరాజు గురించి తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. కృష్ణంరాజు గారు ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని సకల దేవతలను కోరుకుంటున్నా అంటూ ఈ సందర్భంగా మోహన్ బాబు కృష్ణంరాజు సంతాపసభలో ఎమోషనల్ అవుతూ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Ram Gopal Varma: “రేపు ఇలాంటి దుస్థితి మీకు రాక మానదు.. ఇలా చేయడానికి సిగ్గుండాలి” షాకింగ్ కామెంట్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma: టాలీవుడ్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు పోస్ట్ కోవిడ్ సమస్యలతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈయన మరణ వార్త విన్న సినీ ప్రపంచం ఒక్కసారిగా దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున సెలబ్రిటీలు తరలివచ్చి ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఇకపోతే కృష్ణంరాజు ఫామ్ హౌస్ లో ఆయన అంత్యక్రియలు జరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా టాలీవుడ్ సెలబ్రిటీలు కృష్ణంరాజు మరణం తర్వాత ఆయనను సందర్శించి కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువరు కూడా సెలబ్రిటీలపై కామెంట్లు చేస్తూ వివాదానికి తెర లేపారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు సీనియర్ హీరోలు కృష్ణంరాజు మృతి చెందినప్పటికీ ఆయనకు నివాళులు అర్పించి అనంతరం తమ సినిమా షూటింగులతో బిజీ అయ్యారు.

ఈ క్రమంలోనే వర్మ తనదైన శైలిలో ఈ విషయంపై కామెంట్ చేస్తూ.. లెజెండరీ నటుడు కృష్ణంరాజు చనిపోతే ఆయనకు నివాళిగా సినిమా షూటింగ్ లు ఆపకపోవడంపై ఈయన మండిపడ్డారు. ఆ మహానటుడి కోసం ఒక్క రోజు కూడా సినిమా షూటింగులు ఆపలేని స్వార్థపూరిత తెలుగు సినిమా పరిశ్రమకు నా జోహార్లు సిగ్గు సిగ్గు అంటూ ట్వీట్ చేశారు.

Ram Gopal Varma: ఎంతో సిగ్గుచేటు…

రేపు పొద్దున ప్రతి ఒక్కరికి ఇలాంటి దుస్థితి రాకమానదు.ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది అంటూ వర్మ చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. ఇలా వర్మ టాలీవుడ్ సెలబ్రిటీలను ఉద్దేశిస్తూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా మరి కొంతమంది ఇలాంటి సమయంలో ఇలాంటి ట్వీట్ చేస్తూ అందరినీ గెలవడం అవసరమా అంటు కామెంట్లు పెడుతున్నారు.