Tag Archives: last days

Kadambari Kiran : ఏఎన్ఆర్ చనిపోయే ముందు అయన కాళ్ళు ముట్టుకుంటే చర్మం ఊడొచ్చేది.. అందుకే ఎవరినీ.. – కాదంబరి కిరణ్

Kadambari Kiran : సినిమా ఇండస్ట్రీ ఎంతోమంది నటీనటులు వస్తుంటారు వెళుతుంటారు. కానీ కొందరి గురించి మాత్రం కొన్ని తరాల వరకు చెప్పుకుంటూ ఉంటారు. అలా చెప్పుకొనే సెలబ్రిటీలలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఒకరు.అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. ఇప్పటికే అక్కినేని సినిమాలు టీవీలో ప్రసారం అయితే కన్ను తిప్పకుండా చూసే ప్రేక్షకాభిమానులు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

తెలుగు సినిమా పైఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాగేశ్వరరావు ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించడమే కాకుండా తన కొడుకుతో కూడా కలిసి తెరపై సందడి చేశారు. నాగేశ్వరరావు తన కొడుకు నాగార్జున తో కలిసి ఎన్నో మల్టీ స్టారర్ చిత్రాలలో నటించారు. అదేవిధంగా కుటుంబం అంతా కలిసి చివరిగా మనం అనే సినిమాలో నటించారు. నాగేశ్వరరావు చివరిగా మనం సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఎన్నో విభిన్నమైన కథలలో నటించిన నాగేశ్వరరావు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా అందుకున్నారు. ఈ విధంగా చివరివరకు సినిమాలలో నటిస్తూ చివరి రోజుల్లో క్యాన్సర్ బారినపడి చికిత్స తీసుకుంటూ నాగేశ్వరరావు మృతి చెందారు. సినిమా ఇండస్ట్రీలో నాగేశ్వరరావుకు ఎంతో అమితమైన వ్యక్తిగా నటుడు, కమెడియన్ కాదంబరి కిరణ్ అన్ని వేళల అక్కినేని గారిని అంటిపెట్టుకుని ఉండే వారు. ఈ క్రమంలోనే కిరణ్ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ తన గురించి తెలియజేశారు.

కిరణ్ ఎన్నో సినిమాలలో నటుడిగా సహాయనటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా మనం సైతం అనే సేవా సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా పలు సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. అలాగే మా అసోసియేషన్ సభ్యుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరణ్ ఏఎన్నార్ తో ఉన్న అనుబంధాన్ని వివరించారు. ఏఎన్నార్ గారు చివరి రోజుల్లో అతని పక్కనే ఉన్నానని అతనిని చూడటానికి ఎవరిని కూడా లోపలికి పంపించేవారు కాదు అని ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.

ఏఎన్ఆర్ అనారోగ్యం కారణంగా అతని కాళ్లు పట్టుకుంటే చర్మం ఊడొచ్చేది. అంత దారుణమైన పరిస్థితుల్లో ఏఎన్నార్ గారి ఆరోగ్యం ఉండేదని, అతని చివరి రోజుల్లో తన పక్కన నేనున్నానని ఈ సందర్భంగా కిరణ్ ఏఎన్నార్ తో ఉన్న అనుబంధం గురించి తెలియజేశారు.

Manjula : చిన్న దెబ్బే అనుకున్నారు.. ఆ అలసత్యవమే నటి మంజుల ప్రాణాలు తీసింది.!

అలనాటి తార మంజుల విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె నటుడు విజయ్ కుమార్ ను పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. వారు వనిత, ప్రీతి, శ్రీదేవి. ఇక మంజుల పెద్ద కుమార్తె వనిత గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక శ్రీదేవి కూడా పలు సినిమాలలో నటించి బాగా గుర్తింపు సంపాదించుకున్నారు.

ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మంజుల చనిపోయేటప్పుడు ఎలాంటి నరకం అనుభవించారో తెలిస్తే కన్నీళ్లు ఆగవు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా నటి మంజుల పెద్ద కుమార్తె వనిత ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. నటి మంజుల ఇంట్లో కిందపడి మృతి చెందిందని ఇంటర్వ్యూ సందర్భంగా వనిత తెలియజేశారు.

2013వ సంవత్సరంలో మంజుల ఇంట్లో కింద పడటంతో తన నుదిటిపై కొద్దిగా వాపు ఏర్పడిందని, అయితే ప్రమాదం ఏమీ జరగలేదు కొద్దిగా పెయిన్ బాంబ్ రాసుకుంటే సరిపోతుందని భావించారు. అయితే అమ్మ కింద పడినప్పుడు కడుపుకి బలంగా దెబ్బ తగలడం వల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యేదని దాని ఫలితంగా రక్తం గడ్డ కట్టి కిడ్నీలపై అధిక ప్రభావం చూపిందని ఆమె తెలిపారు.

అమ్మ కింద పడిన నెలరోజులకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ కి తీసుకు వెళ్తే వైద్య పరీక్షల అనంతరం డాక్టర్లు మరో మూడు రోజులలో అమ్మ చనిపోతుందని షాకింగ్ విషయాన్ని చెప్పారు. డాక్టర్ చెప్పే మాటలు అమ్మవిని నా పరిస్థితి నాకు అర్థం అవుతోందని వనితతో చెప్పారు. ఇక అప్పటి నుంచి అమ్మ పరిస్థితి రోజురోజుకు చాలా క్షీణించిపోయింది.

ఈ విషయం ఇంట్లోవారికి ఎలా చెప్పాలా అని కంగారుపడ్డాను ఇక అమ్మ పరిస్థితి మరింత క్షీణించి పోవడంతో అమ్మని ఐసియుకి షిఫ్ట్ చేశారు. రెండు రోజుల పాటు హాస్పిటల్ లో ఉండటం వల్ల తన తండ్రి వనితను ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమన్నారు.అయితే అమ్మ హాస్పిటల్ లో ఎవరిని చూసినా వనితా అని పిలవడంతో విజయ్ కుమార్ అమ్మ ఏ క్షణాన్నైనా మనల్ని వదిలి వెళ్ళిపోవచ్చు నిన్నే కలవరిస్తుంది ఒకసారి హాస్పిటల్ కి వచ్చేసేయ్ అని చెప్పారు. ఆ విధంగా హాస్పిటల్ కి వెళ్ళగానే అమ్మ తనని చూసి తన చేతిలోనే ప్రాణాలు విడిచిందని తన తల్లి మరణం గురించి తెలియజేశారు.

అవకాశాలు తగ్గడంతో ఆ పాత్రలలో కూడా చేశాడు సుత్తి వేలు!

సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ఎప్పుడూ సంతోషంగా, ధనవంతులు గా ఉంటారు అనుకోవడం పొరపాటేనని చెప్పాలి. ఎందుకంటే వాళ్లు ఎప్పుడు ఒకేలా ఉండరు. పైగా అవకాశాలు లేనప్పుడు మాత్రం వారి పరిస్థితి ఎంతో దారుణంగా ఉంటుంది. ఇలా ఎంతో మంది నటులు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోగా.. ఒకప్పటి తెలుగు సినీ నటుడు సుత్తి వేలు కూడా అవకాశాలు తగ్గడంతో ఆయన పరిస్థితి కూడా మరింత దారుణంగా మారింది.

ఒకప్పటి తెలుగు సినీ హాస్య నటుడు సుత్తివేలు పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఈయన అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని హాస్యనటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా పలు సీరియల్ లో నటించాడు. ఇక ఈయన దాదాపు రెండు వందలకు పైగా సినిమాలలో నటించాడు.

ఇక ఎప్పుడైతే సినీ ఇండస్ట్రీ హైదరాబాద్ లో అడుగుపెట్టిందో అప్పటి నుంచి ఆయన ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఎంత కష్టపడినా ఫలితాన్ని అందుకోలేకపోయాడు. పైగా సినిమాలలో అవకాశాలు కూడా తగ్గిపోవడంతో.. తన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం బుల్లితెర సీరియల్స్ పై ఆధారపడ్డాడు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం నటించిన కామెడీ సీరియల్ ఆనందో బ్రహ్మ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా పలు సీరియల్స్ లో కూడా నటించాడు.

ఇక ఆయన చివరి రోజుల్లో ఆర్థికంగా ఇబ్బంది పడటంతో బుల్లితెరలో అంత ప్రాధాన్యం లేని పాత్రలలో కూడా నటించాడు. ఇక చివరి వరకు ఇండస్ట్రీతోనే తన జీవనాన్ని సాగించాడు. 2012 సెప్టెంబర్ లో ఆరోగ్య సమస్యల వల్ల మరణించాడు. అప్పుడు ఆయన వయసు 66 ఏళ్లు ఉండగా చూడటానికి 70 ఏళ్లకు పైగా ఉన్న వాడిలా మారిపోయాడు. ఇక ఈయన మరణాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ కూడా తట్టుకోలేకపోయింది. ఇక ఇప్పటికీ ఈయన సినిమాలను ఒకప్పటి తెలుగు ప్రేక్షకులే కాకుండా ఈ తరం ప్రేక్షకులు కూడా బాగా ఇష్టపడుతుంటారు.