Kadambari Kiran : సినిమా ఇండస్ట్రీ ఎంతోమంది నటీనటులు వస్తుంటారు వెళుతుంటారు. కానీ కొందరి గురించి మాత్రం కొన్ని తరాల వరకు చెప్పుకుంటూ ఉంటారు. అలా చెప్పుకొనే సెలబ్రిటీలలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఒకరు.అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. ఇప్పటికే అక్కినేని సినిమాలు టీవీలో ప్రసారం అయితే కన్ను తిప్పకుండా చూసే ప్రేక్షకాభిమానులు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
తెలుగు సినిమా పైఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాగేశ్వరరావు ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించడమే కాకుండా తన కొడుకుతో కూడా కలిసి తెరపై సందడి చేశారు. నాగేశ్వరరావు తన కొడుకు నాగార్జున తో కలిసి ఎన్నో మల్టీ స్టారర్ చిత్రాలలో నటించారు. అదేవిధంగా కుటుంబం అంతా కలిసి చివరిగా మనం అనే సినిమాలో నటించారు. నాగేశ్వరరావు చివరిగా మనం సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఎన్నో విభిన్నమైన కథలలో నటించిన నాగేశ్వరరావు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా అందుకున్నారు. ఈ విధంగా చివరివరకు సినిమాలలో నటిస్తూ చివరి రోజుల్లో క్యాన్సర్ బారినపడి చికిత్స తీసుకుంటూ నాగేశ్వరరావు మృతి చెందారు. సినిమా ఇండస్ట్రీలో నాగేశ్వరరావుకు ఎంతో అమితమైన వ్యక్తిగా నటుడు, కమెడియన్ కాదంబరి కిరణ్ అన్ని వేళల అక్కినేని గారిని అంటిపెట్టుకుని ఉండే వారు. ఈ క్రమంలోనే కిరణ్ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ తన గురించి తెలియజేశారు.
కిరణ్ ఎన్నో సినిమాలలో నటుడిగా సహాయనటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా మనం సైతం అనే సేవా సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా పలు సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. అలాగే మా అసోసియేషన్ సభ్యుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరణ్ ఏఎన్నార్ తో ఉన్న అనుబంధాన్ని వివరించారు. ఏఎన్నార్ గారు చివరి రోజుల్లో అతని పక్కనే ఉన్నానని అతనిని చూడటానికి ఎవరిని కూడా లోపలికి పంపించేవారు కాదు అని ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.
ఏఎన్ఆర్ అనారోగ్యం కారణంగా అతని కాళ్లు పట్టుకుంటే చర్మం ఊడొచ్చేది. అంత దారుణమైన పరిస్థితుల్లో ఏఎన్నార్ గారి ఆరోగ్యం ఉండేదని, అతని చివరి రోజుల్లో తన పక్కన నేనున్నానని ఈ సందర్భంగా కిరణ్ ఏఎన్నార్ తో ఉన్న అనుబంధం గురించి తెలియజేశారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…