Kadambari Kiran : సినిమా ఇండస్ట్రీ ఎంతోమంది నటీనటులు వస్తుంటారు వెళుతుంటారు. కానీ కొందరి గురించి మాత్రం కొన్ని తరాల వరకు చెప్పుకుంటూ ఉంటారు. అలా చెప్పుకొనే సెలబ్రిటీలలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఒకరు.అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. ఇప్పటికే అక్కినేని సినిమాలు టీవీలో ప్రసారం అయితే కన్ను తిప్పకుండా చూసే ప్రేక్షకాభిమానులు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
తెలుగు సినిమా పైఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాగేశ్వరరావు ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించడమే కాకుండా తన కొడుకుతో కూడా కలిసి తెరపై సందడి చేశారు. నాగేశ్వరరావు తన కొడుకు నాగార్జున తో కలిసి ఎన్నో మల్టీ స్టారర్ చిత్రాలలో నటించారు. అదేవిధంగా కుటుంబం అంతా కలిసి చివరిగా మనం అనే సినిమాలో నటించారు. నాగేశ్వరరావు చివరిగా మనం సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఎన్నో విభిన్నమైన కథలలో నటించిన నాగేశ్వరరావు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా అందుకున్నారు. ఈ విధంగా చివరివరకు సినిమాలలో నటిస్తూ చివరి రోజుల్లో క్యాన్సర్ బారినపడి చికిత్స తీసుకుంటూ నాగేశ్వరరావు మృతి చెందారు. సినిమా ఇండస్ట్రీలో నాగేశ్వరరావుకు ఎంతో అమితమైన వ్యక్తిగా నటుడు, కమెడియన్ కాదంబరి కిరణ్ అన్ని వేళల అక్కినేని గారిని అంటిపెట్టుకుని ఉండే వారు. ఈ క్రమంలోనే కిరణ్ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ తన గురించి తెలియజేశారు.
కిరణ్ ఎన్నో సినిమాలలో నటుడిగా సహాయనటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా మనం సైతం అనే సేవా సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా పలు సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. అలాగే మా అసోసియేషన్ సభ్యుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరణ్ ఏఎన్నార్ తో ఉన్న అనుబంధాన్ని వివరించారు. ఏఎన్నార్ గారు చివరి రోజుల్లో అతని పక్కనే ఉన్నానని అతనిని చూడటానికి ఎవరిని కూడా లోపలికి పంపించేవారు కాదు అని ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.
ఏఎన్ఆర్ అనారోగ్యం కారణంగా అతని కాళ్లు పట్టుకుంటే చర్మం ఊడొచ్చేది. అంత దారుణమైన పరిస్థితుల్లో ఏఎన్నార్ గారి ఆరోగ్యం ఉండేదని, అతని చివరి రోజుల్లో తన పక్కన నేనున్నానని ఈ సందర్భంగా కిరణ్ ఏఎన్నార్ తో ఉన్న అనుబంధం గురించి తెలియజేశారు.
ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…