Tag Archives: maa president

Manchu Vishnu: మా సభ్యులందరికీ ఉచితంగా చెకప్ ..ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చిన మా అధ్యక్షుడు!

Manchu Vishnu:మంచు విష్ణు మా అధ్యక్షుడిగా గెలుపొందిన తర్వాత మా సభ్యుల ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈయన మా సభ్యుల ఆరోగ్యం కోసం ఉచితంగా హైదరాబాద్ లోని ప్రముఖ ఏఐజీ హాస్పిటల్లో ఉచితంగా చెకప్ నిర్వహించారు.దీని ద్వారా మా సభ్యులు డాక్టర్ కన్సల్టేషన్ తో పాటు ఏడు రకాల ఉచిత వైద్య పరీక్షలను చేయించుకోవచ్చని వెల్లడించారు.

Manchu Vishnu: మా సభ్యులందరికీ ఉచితంగా చెకప్ ..ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చిన మా అధ్యక్షుడు!

ఈ క్రమంలోనే ఈ మెగా క్యాంపులో భాగంగా 300 మంది సభ్యులు ఉచిత వైద్య సేవలను తీసుకున్నట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ లోనే ప్రముఖ హాస్పిటల్ గా పేరు పొందిన ఏ ఐ జి హాస్పిటల్ లో మా సభ్యులకు ఉచితంగా చెకప్స్ చేశారు.గతంలో నాకు యాక్సిడెంట్ అయినప్పుడు మలేషియాకు వెళితే అక్కడ డాక్టర్లు హైదరాబాద్ లో ఏఐజి హాస్పిటల్ పెట్టుకొని ఇంతదూరం ఎందుకు వచ్చారు అంటూ తనని ప్రశ్నించినట్లు ఈ సందర్భంగా విష్ణు వెల్లడించారు.

Manchu Vishnu: మా సభ్యులందరికీ ఉచితంగా చెకప్ ..ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చిన మా అధ్యక్షుడు!

ఈ విధంగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు అద్భుతమైన డాక్టర్లు ఉన్న ఈ హాస్పిటల్లో ఇకపై మా సభ్యులు ఉచిత చెకప్ చేయించుకోవడం చాలా సంతోషంగా ఉంది అంటూ ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా నటుడు నరేష్ మాట్లాడుతూ మంచు విష్ణు అధ్యక్షుడు అయిన తర్వాత మా సభ్యుల ఆరోగ్య విషయానికి పెద్దపీట వేశారని తెలియజేశారు.ఈ విధంగా మా సభ్యులకు ఉచిత హెల్త్ చెకప్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది అంటూ నరేష్ తెలియజేశారు.

లైఫ్‌స్టైల్‌ జబ్బులు ఎక్కువ…

ఈ క్రమంలోనే ఏఐజీ హాస్పిటల్ డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ…కరోనా వంటి విపత్కర సమయంలో ఎంతో మంది ఆర్టిస్టులు వ్యాక్సిన్ వేయించుకున్న తయారు షూటింగ్ చేయవచ్చా అంటూ ఎన్నో రకాల సందేహాలను వ్యక్తపరిచారనీ,సినిమా కోసం ఆర్టిస్టులు ఎంతో కష్టపడుతున్నారు అంటూ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఆర్టిస్టులలో లైఫ్‌స్టైల్‌ జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. లంగ్స్‌ వ్యాధి, గుండె వ్యాధులతో ఎక్కువగా బాధపడుతున్నారని ఆయన తెలియజేశారు.

Murali Mohan: ‘మా’ బిల్డింగ్ కట్టాలనుకున్నాం కానీ కుదరలేదు.. సొంత డబ్బులతో విష్ణు కడతా అన్నాడుగా కడతాడో లేదో చూద్దాం : మురళి మోహన్

Murali Mohan: మురళీమోహన్ నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా, వ్యాపారవేత్తగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఆయన హీరోగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు.ఇలా ఒకప్పుడు ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగిన మురళీమోహన్ ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో నటిస్తూ ఉన్నారు.

Murali Mohan: మా ప్రెసిడెంట్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన మురళీమోహన్.. మా బిల్డింగ్ కొడతాడో లేదో చూద్దాం!

ఈ క్రమంలోనే మురళీమోహన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరియర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంది అవార్డుల గురించి ప్రస్తావించారు. నంది అవార్డుల విషయంలోఇప్పటికీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమేయంలేదని ఇది పూర్తిగా కమిటీ మెంబర్స్ సూచించిన విధంగా అవార్డులను ప్రకటిస్తారని మురళీమోహన్ వెల్లడించారు.

Murali Mohan: మా ప్రెసిడెంట్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన మురళీమోహన్.. మా బిల్డింగ్ కొడతాడో లేదో చూద్దాం!

అదేవిధంగా మురళీమోహన్ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తాను అయ్యప్ప మాల దీక్ష తీసుకోవడం గురించి వెల్లడించారు.ఇప్పటివరకు తాను ముప్పై మూడు సార్లు అయ్యప్ప మాల దీక్ష తీసుకున్నానని ఇంకా మూడుసార్లు తీసుకోవాల్సి ఉందని ఆయన వెల్లడించారు. తనకు చిన్నప్పటి నుంచిఎక్కువ భక్తి ఉండటం వల్ల ప్రతి రోజు ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే తప్పనిసరిగా పూజ చేసుకునే వెళ్తానని ఈ సందర్భంగా మురళీ మోహన్ తెలిపారు.

మా అసోసియేషన్ అప్పుడు జీరో…

ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన మా బిల్డింగ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను తెలియ చేశారు. మేము మా అసోసియేషన్ స్థాపించినప్పుడు జీరో. “మా” నుంచి మేము వైదొలగినప్పటికి మూడు కోట్ల రూపాయల మూలధనం సేకరించి పెట్టామని, మా తర్వాత వచ్చిన వారు కూడా కొంత డబ్బు సమకూర్చారని ఈ సందర్భంగా మురళీమోహన్ తెలియజేశారు. ఇక ప్రస్తుతం ఉన్న మా ప్రెసిడెంట్ మంచు విష్ణు గురించి కూడా మురళీమోహన్ మాట్లాడారు. మేము మా ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో మా బిల్డింగ్ కట్టాలని చాలా ప్రయత్నాలు చేశాము. కానీ కుదరలేదు అయితే ప్రస్తుతం ఉన్న మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ఎన్నికల సమయంలోనే మా బిల్డింగ్ కట్టిస్తానని మాట ఇచ్చారు. అది కూడా తన సొంత డబ్బులతో కడతాం అని మాట ఇచ్చారు. చాలా సంతోషం అంటూ మురళీమోహన్ మా ప్రెసిడెంట్, మా బిల్డింగ్ గురించి ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ప్రస్తావించారు.

Manchu Vishnu: అడ్డంగా బుక్కైన మా అధ్యక్షుడు మంచు విష్ణు..!

Manchu Vishnu: టాలీవుడ్ సమస్యలు ఒక్కక్కటిగా కొలిక్కి వస్తున్నాయి. ఇటీవల చిరంజీవితో సహా మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, నారాయణ మూర్తి, కొరటాల శివ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో టికెట్ రేట్లకు తెర పడినట్లుగా అందరు ప్రకటించారు.

Manchu Vishnu: అడ్డంగా బుక్కైన మా అధ్యక్షుడు మంచు విష్ణు.. ఏం జరిగిందంటే?

గత రెండు నెలలుగా సాగుతున్న ప్రతిష్టంభన తీరిందని వెల్లడించారు. ఏపీలో టాలీవుడ్ పరిశ్రమని డెవలప్ చేయాలని సీఎం జగన్ అన్నారని వెల్లడించారు. అయితే ఈ సమావేశానికి సీనియర్ నటుడు మోహన్ బాబుని పిలిచారా..? అసలు ఆయనే కావాలని వెళ్లలేదా ..? అనే డౌట్లు వస్తున్నాయి.

Manchu Vishnu: అడ్డంగా బుక్కైన మా అధ్యక్షుడు మంచు విష్ణు.. ఏం జరిగిందంటే?

ఇదిలా ఉంటే నిన్న మంత్రి పేర్ని నాని మోహన్ బాబుతో భేటీ అయ్యారు. అంతా కూడా మొన్న సినీ ప్రముఖులతో జరిగిన సమావేశం గురించి చర్చించినట్లు.. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారని అనుకున్నారు. 

మర్యాదపూర్వకంగా మోహన్ బాబును కలిసేందుకే.

దీనికి సంబంధించి మంచు విష్ణు కూడా ఓ ట్విట్ వదిలాడు. మా ఇంటికి మంత్రి పేర్ని నాని రావడం ఆనందంగా ఉందని.. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ మెంట్ ప్లాన్స్ వివరించారని.. అందుకు థాంక్స్ అంటూ ట్విట్ చేశాడు. అయితే ఈ ట్విట్ పై మంచు విష్ణు అడ్డంగా బుక్కయ్యాడు. మంచు విష్ణు ట్విట్ తన ద్రుష్టికి వచ్చిందని.. కాగా తాను మర్యాదపూర్వకంగా మోహన్ బాబును కలిసేందుకే వెళ్లానని.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని వ్యక్తిగతంగా ఏ ఒక్కరికి సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ట్విట్ గురించి మంచు విష్ణుతో మాట్లాడా.. అని పేర్ని నాని అన్నారు. ఆయన దాన్ని డిలీట్ చేశారని చెప్పారని మంత్రి పేర్ని నాని అన్నారు.