Manchu Vishnu: మా సభ్యులందరికీ ఉచితంగా చెకప్ ..ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చిన మా అధ్యక్షుడు!
Manchu Vishnu:మంచు విష్ణు మా అధ్యక్షుడిగా గెలుపొందిన తర్వాత మా సభ్యుల ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈయన మా సభ్యుల ఆరోగ్యం కోసం ఉచితంగా హైదరాబాద్ లోని ప్రముఖ ఏఐజీ హాస్పిటల్లో ఉచితంగా చెకప్ నిర్వహించారు.దీని ద్వారా మా సభ్యులు డాక్టర్ కన్సల్టేషన్ తో పాటు ఏడు రకాల ఉచిత వైద్య పరీక్షలను చేయించుకోవచ్చని వెల్లడించారు.
ఈ క్రమంలోనే ఈ మెగా క్యాంపులో భాగంగా 300 మంది సభ్యులు ఉచిత వైద్య సేవలను తీసుకున్నట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ లోనే ప్రముఖ హాస్పిటల్ గా పేరు పొందిన ఏ ఐ జి హాస్పిటల్ లో మా సభ్యులకు ఉచితంగా చెకప్స్ చేశారు.గతంలో నాకు యాక్సిడెంట్ అయినప్పుడు మలేషియాకు వెళితే అక్కడ డాక్టర్లు హైదరాబాద్ లో ఏఐజి హాస్పిటల్ పెట్టుకొని ఇంతదూరం ఎందుకు వచ్చారు అంటూ తనని ప్రశ్నించినట్లు ఈ సందర్భంగా విష్ణు వెల్లడించారు.
ఈ విధంగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు అద్భుతమైన డాక్టర్లు ఉన్న ఈ హాస్పిటల్లో ఇకపై మా సభ్యులు ఉచిత చెకప్ చేయించుకోవడం చాలా సంతోషంగా ఉంది అంటూ ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా నటుడు నరేష్ మాట్లాడుతూ మంచు విష్ణు అధ్యక్షుడు అయిన తర్వాత మా సభ్యుల ఆరోగ్య విషయానికి పెద్దపీట వేశారని తెలియజేశారు.ఈ విధంగా మా సభ్యులకు ఉచిత హెల్త్ చెకప్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది అంటూ నరేష్ తెలియజేశారు.
ఈ క్రమంలోనే ఏఐజీ హాస్పిటల్ డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ…కరోనా వంటి విపత్కర సమయంలో ఎంతో మంది ఆర్టిస్టులు వ్యాక్సిన్ వేయించుకున్న తయారు షూటింగ్ చేయవచ్చా అంటూ ఎన్నో రకాల సందేహాలను వ్యక్తపరిచారనీ,సినిమా కోసం ఆర్టిస్టులు ఎంతో కష్టపడుతున్నారు అంటూ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఆర్టిస్టులలో లైఫ్స్టైల్ జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. లంగ్స్ వ్యాధి, గుండె వ్యాధులతో ఎక్కువగా బాధపడుతున్నారని ఆయన తెలియజేశారు.
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…
సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…
హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…