Manchu Vishnu: మా సభ్యులందరికీ ఉచితంగా చెకప్ ..ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చిన మా అధ్యక్షుడు!
Manchu Vishnu:మంచు విష్ణు మా అధ్యక్షుడిగా గెలుపొందిన తర్వాత మా సభ్యుల ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈయన మా సభ్యుల ఆరోగ్యం కోసం ఉచితంగా హైదరాబాద్ లోని ప్రముఖ ఏఐజీ హాస్పిటల్లో ఉచితంగా చెకప్ నిర్వహించారు.దీని ద్వారా మా సభ్యులు డాక్టర్ కన్సల్టేషన్ తో పాటు ఏడు రకాల ఉచిత వైద్య పరీక్షలను చేయించుకోవచ్చని వెల్లడించారు.
ఈ క్రమంలోనే ఈ మెగా క్యాంపులో భాగంగా 300 మంది సభ్యులు ఉచిత వైద్య సేవలను తీసుకున్నట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ లోనే ప్రముఖ హాస్పిటల్ గా పేరు పొందిన ఏ ఐ జి హాస్పిటల్ లో మా సభ్యులకు ఉచితంగా చెకప్స్ చేశారు.గతంలో నాకు యాక్సిడెంట్ అయినప్పుడు మలేషియాకు వెళితే అక్కడ డాక్టర్లు హైదరాబాద్ లో ఏఐజి హాస్పిటల్ పెట్టుకొని ఇంతదూరం ఎందుకు వచ్చారు అంటూ తనని ప్రశ్నించినట్లు ఈ సందర్భంగా విష్ణు వెల్లడించారు.
ఈ విధంగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు అద్భుతమైన డాక్టర్లు ఉన్న ఈ హాస్పిటల్లో ఇకపై మా సభ్యులు ఉచిత చెకప్ చేయించుకోవడం చాలా సంతోషంగా ఉంది అంటూ ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా నటుడు నరేష్ మాట్లాడుతూ మంచు విష్ణు అధ్యక్షుడు అయిన తర్వాత మా సభ్యుల ఆరోగ్య విషయానికి పెద్దపీట వేశారని తెలియజేశారు.ఈ విధంగా మా సభ్యులకు ఉచిత హెల్త్ చెకప్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది అంటూ నరేష్ తెలియజేశారు.
ఈ క్రమంలోనే ఏఐజీ హాస్పిటల్ డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ…కరోనా వంటి విపత్కర సమయంలో ఎంతో మంది ఆర్టిస్టులు వ్యాక్సిన్ వేయించుకున్న తయారు షూటింగ్ చేయవచ్చా అంటూ ఎన్నో రకాల సందేహాలను వ్యక్తపరిచారనీ,సినిమా కోసం ఆర్టిస్టులు ఎంతో కష్టపడుతున్నారు అంటూ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఆర్టిస్టులలో లైఫ్స్టైల్ జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. లంగ్స్ వ్యాధి, గుండె వ్యాధులతో ఎక్కువగా బాధపడుతున్నారని ఆయన తెలియజేశారు.
తమిళనాడు రాజకీయాలు మరోసారి తీవ్ర వేడిని సంతరించుకున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు రోజురోజుకూ ముదురుతున్న…
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, వాటి పరస్పర దృష్టులు మనిషి జీవితంపై ప్రభావం చూపుతాయని విశ్వసిస్తారు. గ్రహాల ప్రత్యేక కలయికల…
బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ ఊరట లభించింది. గత కొన్ని వారాలుగా క్రమంగా తగ్గుతూ వస్తున్న పసిడి…
భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…
ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…
దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…