Manchu Vishnu: టాలీవుడ్ సమస్యలు ఒక్కక్కటిగా కొలిక్కి వస్తున్నాయి. ఇటీవల చిరంజీవితో సహా మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, నారాయణ మూర్తి, కొరటాల శివ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో టికెట్ రేట్లకు తెర పడినట్లుగా అందరు ప్రకటించారు.
గత రెండు నెలలుగా సాగుతున్న ప్రతిష్టంభన తీరిందని వెల్లడించారు. ఏపీలో టాలీవుడ్ పరిశ్రమని డెవలప్ చేయాలని సీఎం జగన్ అన్నారని వెల్లడించారు. అయితే ఈ సమావేశానికి సీనియర్ నటుడు మోహన్ బాబుని పిలిచారా..? అసలు ఆయనే కావాలని వెళ్లలేదా ..? అనే డౌట్లు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే నిన్న మంత్రి పేర్ని నాని మోహన్ బాబుతో భేటీ అయ్యారు. అంతా కూడా మొన్న సినీ ప్రముఖులతో జరిగిన సమావేశం గురించి చర్చించినట్లు.. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారని అనుకున్నారు.
దీనికి సంబంధించి మంచు విష్ణు కూడా ఓ ట్విట్ వదిలాడు. మా ఇంటికి మంత్రి పేర్ని నాని రావడం ఆనందంగా ఉందని.. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ మెంట్ ప్లాన్స్ వివరించారని.. అందుకు థాంక్స్ అంటూ ట్విట్ చేశాడు. అయితే ఈ ట్విట్ పై మంచు విష్ణు అడ్డంగా బుక్కయ్యాడు. మంచు విష్ణు ట్విట్ తన ద్రుష్టికి వచ్చిందని.. కాగా తాను మర్యాదపూర్వకంగా మోహన్ బాబును కలిసేందుకే వెళ్లానని.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని వ్యక్తిగతంగా ఏ ఒక్కరికి సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ట్విట్ గురించి మంచు విష్ణుతో మాట్లాడా.. అని పేర్ని నాని అన్నారు. ఆయన దాన్ని డిలీట్ చేశారని చెప్పారని మంత్రి పేర్ని నాని అన్నారు.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…