Manchu Vishnu: టాలీవుడ్ సమస్యలు ఒక్కక్కటిగా కొలిక్కి వస్తున్నాయి. ఇటీవల చిరంజీవితో సహా మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, నారాయణ మూర్తి, కొరటాల శివ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో టికెట్ రేట్లకు తెర పడినట్లుగా అందరు ప్రకటించారు.
గత రెండు నెలలుగా సాగుతున్న ప్రతిష్టంభన తీరిందని వెల్లడించారు. ఏపీలో టాలీవుడ్ పరిశ్రమని డెవలప్ చేయాలని సీఎం జగన్ అన్నారని వెల్లడించారు. అయితే ఈ సమావేశానికి సీనియర్ నటుడు మోహన్ బాబుని పిలిచారా..? అసలు ఆయనే కావాలని వెళ్లలేదా ..? అనే డౌట్లు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే నిన్న మంత్రి పేర్ని నాని మోహన్ బాబుతో భేటీ అయ్యారు. అంతా కూడా మొన్న సినీ ప్రముఖులతో జరిగిన సమావేశం గురించి చర్చించినట్లు.. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారని అనుకున్నారు.
దీనికి సంబంధించి మంచు విష్ణు కూడా ఓ ట్విట్ వదిలాడు. మా ఇంటికి మంత్రి పేర్ని నాని రావడం ఆనందంగా ఉందని.. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ మెంట్ ప్లాన్స్ వివరించారని.. అందుకు థాంక్స్ అంటూ ట్విట్ చేశాడు. అయితే ఈ ట్విట్ పై మంచు విష్ణు అడ్డంగా బుక్కయ్యాడు. మంచు విష్ణు ట్విట్ తన ద్రుష్టికి వచ్చిందని.. కాగా తాను మర్యాదపూర్వకంగా మోహన్ బాబును కలిసేందుకే వెళ్లానని.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని వ్యక్తిగతంగా ఏ ఒక్కరికి సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ట్విట్ గురించి మంచు విష్ణుతో మాట్లాడా.. అని పేర్ని నాని అన్నారు. ఆయన దాన్ని డిలీట్ చేశారని చెప్పారని మంత్రి పేర్ని నాని అన్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…