Tag Archives: netizens fire

Shot Body Spray: పచ్చి బూతులతో డబుల్ మీనింగ్ డైలాగులతో షాట్ యాడ్… ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్!

Shot Body Spray: ప్రస్తుతం కాలంలో ప్రతి ఒక్క కంపెనీ తమ ఉత్పత్తులను ప్రచారం చేయడం కోసం వివిధ రకాల యాడ్స్ షూట్ చేసి తమ ప్రొడక్ట్స్ అందరినీ ఆకట్టుకునేలా రూపొందిస్తారు. అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి యాడ్ షూట్స్ పలు వివాదాలకు కారణమవుతున్నాయి. ఇప్పటికే ఇలాంటి యాడ్స్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయింది.

ఇకపోతే తాజాగా మరొక యాడ్ కూడా ఇలాంటి వివాదానికి దారి తీసింది. ప్రముఖ బాడీ స్ప్రే షాట్ అనే కొత్త పర్ఫ్యూమ్ ను మార్కెట్ లోకి తెచ్చింది. దీనికోసం ప్రముఖ కంపెనీ రెండు యాడ్స్ ను రూపొందించారు. అయితే ఈ రెండు కూడా డబుల్ మీనింగ్ డైలాగులతో ఉండడం వల్ల పెద్ద ఎత్తున ఈ యాడ్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు యాడ్ డబుల్ మీనింగ్ డైలాగులతో ఉండటం వల్ల యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ పలువురు వీటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

షాపింగ్ మాల్ లో నలుగురు కుర్రాళ్లు నిలబడి మేము నలుగురం కానీ అక్కడ ఒకటే ఉంది అంటూ షాట్ పర్ ఫ్యూమ్ బాటిల్ ని ఉద్దేశిస్తూ మాట్లాడుతారు.అయితే అక్కడ ఒక అమ్మాయి ఉండడంతో తన గురించి మాట్లాడుతున్నారని కోపం వ్యక్తం చేస్తుంది. అయితే ఆ నలుగురు మాట్లాడేది షాట్ పర్ఫ్యూమ్ కోసం అని తెలియడంతో ఆ అమ్మాయి ఊపిరిపీల్చుకుంది. అదేవిధంగా ఒక గదిలో ఒక జంట ఉండగా నలుగురు అబ్బాయిలు వెళ్లి వారు మాట్లాడిన మాటలతో ఒక్కసారిగా అమ్మాయినీ భయాందోళనకు గురి చేశాయి. అయితే వారు మాట్లాడింది షాట్ స్ప్రే గురించి అని తెలియడంతో ఊపిరి పీల్చుకుంది.

యాడ్ పై దర్యాప్తు చేయాలి…


ఈ విధంగా ప్రస్తుత కాలంలో ప్రతి రోజు ఎంతో మంది యువతులు అత్యాచార సంఘటనలను తలుచుకొని భయపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే షాట్ యాడ్ వీడియోలు కూడా అదే స్థాయిలో ఉండటంతో ఎంతోమంది ఈ యాడ్ వీడియో పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌ న్యూజిలాండ్‌ టెస్ట్‌ మ్యాచ్‌ సందర్భంగా ఈ యాడ్స్‌ను ప్రసారం చేసింది. అడ్వర్‌టైజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ASCI).. సోషల్‌ మీడియాలో ఈ వీడియోలో పై తీవ్ర దుమారం చెలరేగడమే కాకుండా ఈ యాడ్ తొలగించి వెంటనే దర్యాప్తు చేయాలని ఆదేశించారు.

Actor Naresh: అవి తిరుపతిలో దొరకలేదంటూ నరేష్ ట్వీట్…వారితో చేరి నువ్వు అలాగే తయారయ్యావ్… నెటిజెన్స్ ఫైర్!

Actor Naresh: సీనియర్ నటుడు నరేష్ గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. మా ఎన్నికల సమయంలో ఈయన చేసిన హంగామా అందరికీ గుర్తుంది. విష్ణు గెలుపుకు తానే సూత్రధారి అంటూ వ్యవహరించారు. మా ఎన్నికల సమయంలో రచ్చ చేస్తూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. అలాగే తన మూడవ భార్య తన పేరు చెప్పుకొని పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడిన విషయం గురించి కూడా నరేష్ వార్తల్లో నిలిచారు.

Actor Naresh: అవి తిరుపతిలో దొరకలేదంటూ నరేష్ ట్వీట్…వారితో చేరి నువ్వు అలాగే తయారయ్యావ్… నెటిజెన్స్ ఫైర్!

ఇక తన భార్యకు తనకు ఏమాత్రం సంబంధం లేదని నరేష్ తేల్చిచెప్పారు.కావాలంటే ఈ కేసు విషయంలో తన సపోర్ట్ పూర్తిగా పోలీసులకు ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇలా ఏదో ఒక వార్త ద్వారా సోషల్ మీడియాలో ఉండే నరేష్ ఈ మధ్య నెటిజన్ల ట్రోలింగ్ గురవుతున్నారు. తాజాగా నరేష్ మరోసారి ట్వీట్ చేయడంతో నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు.

Actor Naresh: అవి తిరుపతిలో దొరకలేదంటూ నరేష్ ట్వీట్…వారితో చేరి నువ్వు అలాగే తయారయ్యావ్… నెటిజెన్స్ ఫైర్!

ఈ క్రమంలోనే తాజాగా ఏదో పని నిమిత్తం నరేష్ తిరుపతి వెళ్లినట్టు ఉన్నారు.అయితే తిరుపతి వెళ్లిన సందర్భంగా నరేష్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ తిరుపతిలో ఒక గంట నుంచి నాకెంతో ఇష్టమైన నైక్ ఏయిర్ షూస్ మాత్రం దొరకలేదు. వాటి కోసం హైదరాబాద్ వెళ్లాల్సిందే అంటూ ట్వీట్ చేశాడు. దీంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో ఈయన పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంచు ఫ్యామిలీతో కలిసి నువ్వు అలాగే తయారయ్యావు..


ఈ ట్వీట్ పై స్పందించిన నెటిజన్లు గంటలో ఏం తిరిగావ్..అంటూ ట్వీట్ చేయగా మరికొందరు తిరుపతి వెళ్లిన నీకు మీ బ్రాండెడ్ షూస్ పని ఏంటి అని ప్రశ్నించారు. మరికొందరైతే దారుణంగా ఆ డబ్బా బ్యాచ్ మంచు ఫ్యామిలీతో కలిసి నువ్వు కూడా అలాగే తయారవుతున్నావ్ అంటూ తీవ్రస్థాయిలో నరేష్ పై ఫైర్ అవుతున్నారు.

డబ్బు కోసం ఇలాంటి పనులు ఏంటి రెజీనా..?

సినీ ఇండస్ట్రీలో పలువురు హీరోలు,హీరోయిన్స్ ఒకవైపు సినిమాల్లో నటిస్తూ, మరొకవైపు కొన్ని యాడ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే పలువురు సెలబ్రిటీలు నెటిజన్ల ఆగ్రహానికి గురవుతూ ఉంటారు. అలాంటి వారిలో హీరోయిన్ రెజీనా కూడా ఒకరు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రెజీనా ఒక బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తోంది.

ఇక ఇదే విషయాన్ని ఆమె తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది. ఇక ఈ విషయం పై నెటిజన్లు ఆమెపై పెద్దఎత్తున ఫైర్ అవుతున్నారు. తనకు తొమ్మిదేళ్ళ వయసు ఉన్నప్పుడు యాంకరింగ్ ప్రారంభించాలని, అయితే ప్రస్తుతం కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే కొన్ని బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తారని ఈ సంతోషాన్ని సిగ్నేచర్ తో సెలబ్రేట్ చేసుకుంటున్నాను అంటూ ఆమె తెలిపింది.

అలా ఈమె సిగ్నేచర్ బ్రాండ్ ఆల్కహాల్ కు అంబాసిడర్ గా వ్యవహరించడం జరిగింది. దీంతో ఈమె పై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కేవలం డబ్బు కోసమే ఇలాంటి హానికరమైన బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే తన పద్ధతి బాగాలేదని డబ్బు కోసం ఇలాంటి పనులు చేస్తారా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇండస్ట్రీలో పలువురి హీరోహీరోయిన్లు ఒక వెలుగు వెలిగి ఆ తరువాత నిదానంగా కనుమరుగై పోయిన వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటివారిలో హీరోయిన్ రెజీనా కూడా ఒకరు. మొదట రొటీన్ లవ్ స్టోరీ సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయిన ఈ బ్యూటీ ఆ తరువాత సినిమాలో నటించి సినీ ఇండస్ట్రీకి దూరం అయింది. ప్రస్తుతం ఈమె తెలుగు తమిళ హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అలాగే త్వరలో ఈ బ్యూటీ నేనేనా అనే హారర్ సినిమాలో నటిస్తోంది.

ఛీఛీ.. ఇదేం పబ్లిసిటీ.. యాంకర్ వర్షపై నెటిజెన్స్ ఫైర్!

రెండు రోజుల క్రితం యాంకర్ వర్ష చేతి వేలికి ఉంగరం, చేతిలో తాళిబొట్టు పట్టుకొని జూలై నాలుగవ తేదీన ఓ విషయం చెప్పబోతున్నాను అంటూ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అందరూ వర్షని త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోందా అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. అయితే తాజాగా వర్ష చేసిన ఆ పోస్ట్ పై నెటిజన్లు పెద్ద ఎత్తున తిట్లదండకం మొదలుపెట్టారు. నెటిజన్లు అంత ఎత్తున కో పడడానికి కూడా కారణం ఉంది.

సాధారణంగా పెళ్లి అనేది ఎంతో సాంప్రదాయబద్దంగా జరిగే వేడుక. కానీ ఈ డ్రామా ఆర్టిస్టులు అందరూ కలిసి పెళ్లిని ఎంతో హేళన చేసి చూపించడంతో నెటిజన్లు వీరిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ద్వారా జబర్దస్త్ కామెడీ అమలు చేసే స్కిట్ లు తీవ్ర వివాదాలకు తెర లేపడం సర్వసాధారణమైంది. తాజాగా వర్షా కూడా తాళిబొట్టుని చూపిస్తూ చేసిన పోస్ట్ ఈ కార్యక్రమంలో స్కిట్ లో భాగమే అని తెలియడంతో, వీరి పిచ్చి పీక్ కు చేరింది అంటూ పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వచ్చేవారం ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రోమోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో ఇది చూసిన నెటిజన్లు ఛీఛీ.. ఇదేం పబ్లిసిటీ అంటూ వర్ష పై తీవ్రస్థాయిలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలో యాంకర్ వర్ష ఇమ్మానుయేల్‌ని పెళ్లాడుతూ కనిపించింది. చూడ్డానికి పరమచెత్తగా బోరింగ్‌గా ఉన్న ఈ ప్రోమోలో వర్ష-ఇమ్మానుయేల్‌ పెళ్లి జరగడమే కాకుండా ఈ పెళ్లికి వర్ష వెడ్స్ ఇమ్మానియేల్ అని పెళ్లి పత్రిక ఉండటం ఎంతో విడ్డూరం.

ఈ విధంగా కమెడియన్ లకు మల్లెమాల సమస్థ పెళ్లి చేయడం కొత్త ఏమి కాదు. గతంలో రష్మి, సుదీర్ జంటకు పెళ్లి చేసి అధిక రేటింగ్ సంపాదించిన ఈ సమస్థ ఆ తరువాత ఎంతో మంది కమెడియన్లకు పెళ్లిళ్లు చేస్తూ వచ్చారు. తాజాగా వర్షా -ఇమ్మానియేల్ జంటకు పెళ్లి చేస్తూ మల్లెమాల పెళ్లిళ్ల కళ్యాణ మండపంలా మారిపోయింది. ఈ క్రమంలోనే నెటిజన్లు మల్లెమాల పై తిట్ల దండకం మొదలుపెట్టారు. పబ్లిసిటీ కోసం మరీ ఇంత దారుణంగా ప్రవర్తించడం సరికాదంటూ నెటిజన్లు పెద్దఎత్తున ఫైర్ అవుతున్నారు.