Actor Naresh: సీనియర్ నటుడు నరేష్ గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. మా ఎన్నికల సమయంలో ఈయన చేసిన హంగామా అందరికీ గుర్తుంది. విష్ణు గెలుపుకు తానే సూత్రధారి అంటూ వ్యవహరించారు. మా ఎన్నికల సమయంలో రచ్చ చేస్తూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. అలాగే తన మూడవ భార్య తన పేరు చెప్పుకొని పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడిన విషయం గురించి కూడా నరేష్ వార్తల్లో నిలిచారు.
ఇక తన భార్యకు తనకు ఏమాత్రం సంబంధం లేదని నరేష్ తేల్చిచెప్పారు.కావాలంటే ఈ కేసు విషయంలో తన సపోర్ట్ పూర్తిగా పోలీసులకు ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇలా ఏదో ఒక వార్త ద్వారా సోషల్ మీడియాలో ఉండే నరేష్ ఈ మధ్య నెటిజన్ల ట్రోలింగ్ గురవుతున్నారు. తాజాగా నరేష్ మరోసారి ట్వీట్ చేయడంతో నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు.
ఈ క్రమంలోనే తాజాగా ఏదో పని నిమిత్తం నరేష్ తిరుపతి వెళ్లినట్టు ఉన్నారు.అయితే తిరుపతి వెళ్లిన సందర్భంగా నరేష్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ తిరుపతిలో ఒక గంట నుంచి నాకెంతో ఇష్టమైన నైక్ ఏయిర్ షూస్ మాత్రం దొరకలేదు. వాటి కోసం హైదరాబాద్ వెళ్లాల్సిందే అంటూ ట్వీట్ చేశాడు. దీంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో ఈయన పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ట్వీట్ పై స్పందించిన నెటిజన్లు గంటలో ఏం తిరిగావ్..అంటూ ట్వీట్ చేయగా మరికొందరు తిరుపతి వెళ్లిన నీకు మీ బ్రాండెడ్ షూస్ పని ఏంటి అని ప్రశ్నించారు. మరికొందరైతే దారుణంగా ఆ డబ్బా బ్యాచ్ మంచు ఫ్యామిలీతో కలిసి నువ్వు కూడా అలాగే తయారవుతున్నావ్ అంటూ తీవ్రస్థాయిలో నరేష్ పై ఫైర్ అవుతున్నారు.