Samantha: విడాకుల విషయం పై పరోక్షంగా స్పందించిన సమంత….అన్ని శిథిలమైపోయాయంటూ పోస్ట్!
Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ ప్రస్తుతం వరుస అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్న సమంత గతేడాది అక్టోబర్ లో తన భర్త నాగచైతన్య నుంచి విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు.ఇలా విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఆ బాధ నుంచి బయట పడటం కోసం తన మనసులో ఉన్న భావాలను సోషల్ మీడియా వేదికగా పోస్టుల రూపంలో వెల్లడించారు.
విడాకుల విషయం నుంచి బయట పడిన సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు.ఇక తన వ్యక్తిగత విషయాల గురించి సమంత వివిధ రకాల పోస్టుల రూపంలో తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
ఈ క్రమంలోనే సమంత ఇంస్టాగ్రామ్ ద్వారా మరోసారి తన విడాకుల విషయమై పరోక్షంగా స్పందించినట్లు తెలుస్తోంది.ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ మీరు జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కొన్నప్పటికీ అవి మిమ్మల్ని జీవితంలో ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడతాయి. ఇక ఈ ఏడాది తన జీవితానికి సంబంధించి ఎలాంటి హోప్స్ లేవనీ సమంత చెప్పుకొచ్చారు.
గత ఏడాది తన వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనల కారణంగా ఈ ఏడాది తనకు తన జీవితం గురించి ఎలాంటి అంచనాలు లేవని తన జీవితంలో ఏదైతే స్థిరంగా ఉంటుందో దానిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. నేను నా జీవితానికి సంబంధించి ఎన్నో ప్రణాళికలను తయారు చేసుకున్నానని అయితే ఆ ప్రణాళికలన్ని శిథిలమై పోయాయని అందుకే ఈ ఏడాది ఎలాంటి ప్రణాళికలు వేసుకోలేదని తెలియజేశారు. ఇలా సమంత చేసిన ఈ పోస్ట్ విడాకుల గురించి పరోక్షంగా చేసింది అంటూ పలువురు వారి అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…