Y.S Vivekananda Reddy Murder Case: ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి 2019 లో దారుణంగా హత్యకు గురైన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ హత్య గురించి అప్పటి నుంచి విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ కేసులో రోజుకో కొత్త మలుపు తిరుగుతూ ఎన్నో వార్తలు తెరపైకి వస్తున్నాయి.ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని తనకు మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సహకరిస్తున్నారంటూ వీరి గురించి ఎన్నో వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి తనపై వస్తున్న వార్తల గురించి తాజాగా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది కనుక తాను ఈ విషయాల గురించి మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చారు. అవినాష్ రెడ్డి, సురేంద్రనాధ్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి తనను ఎప్పుడు కలవలేదని మాజీ డీజీపీ సవాంగ్ స్పష్టంచేశారు.
వైయస్ వివేకానంద రెడ్డి,అవినాష్ రెడ్డి కుటుంబాలు వైయస్ జగన్ కు రెండు కళ్ళు లాంటివని ఈ విషయం గురించి జగన్ నాతో ఎప్పుడు చెప్పేవారని గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ఇక వివేకా హత్య కేసు చట్ట ప్రకారమే ముందుకు వెళ్లాలని ఈ కేసు విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరగాలని సీఎం జగన్ తనతో చెప్పినట్లు ఈ సందర్భంగా గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.
కోర్టు ఆదేశాలతో సీబీఐ విచారణకు కావాల్సిన అన్ని వివరాలు ఇవ్వాలని సీఎం జగన్ తనని కోరినట్లు తెలియజేశారు ఈ కేసు విషయంలో దోషులకు తప్పకుండా శిక్ష పడాలని శిక్షపడేలా చూడమని జగన్ ఎల్లప్పుడు ఈ కేసు గురించి తనతో చర్చించే వారని గౌతమ్ సవాంగ్ వెల్లడించారు ఇక ఈ కేసుపై వివేకా కూతురు సునీత తన భర్త రాజశేఖర్ రెడ్డి తనను కలిసినప్పుడు కూడా ముఖ్యమంత్రి చెప్పిన విషయాలను వారికి తెలియ చేశానని వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…