Y.S Vivekananda Reddy Murder Case: ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి 2019 లో దారుణంగా హత్యకు గురైన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ హత్య గురించి అప్పటి నుంచి విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ కేసులో రోజుకో కొత్త మలుపు తిరుగుతూ ఎన్నో వార్తలు తెరపైకి వస్తున్నాయి.ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని తనకు మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సహకరిస్తున్నారంటూ వీరి గురించి ఎన్నో వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి తనపై వస్తున్న వార్తల గురించి తాజాగా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది కనుక తాను ఈ విషయాల గురించి మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చారు. అవినాష్ రెడ్డి, సురేంద్రనాధ్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి తనను ఎప్పుడు కలవలేదని మాజీ డీజీపీ సవాంగ్ స్పష్టంచేశారు.
వైయస్ వివేకానంద రెడ్డి,అవినాష్ రెడ్డి కుటుంబాలు వైయస్ జగన్ కు రెండు కళ్ళు లాంటివని ఈ విషయం గురించి జగన్ నాతో ఎప్పుడు చెప్పేవారని గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ఇక వివేకా హత్య కేసు చట్ట ప్రకారమే ముందుకు వెళ్లాలని ఈ కేసు విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరగాలని సీఎం జగన్ తనతో చెప్పినట్లు ఈ సందర్భంగా గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.
కోర్టు ఆదేశాలతో సీబీఐ విచారణకు కావాల్సిన అన్ని వివరాలు ఇవ్వాలని సీఎం జగన్ తనని కోరినట్లు తెలియజేశారు ఈ కేసు విషయంలో దోషులకు తప్పకుండా శిక్ష పడాలని శిక్షపడేలా చూడమని జగన్ ఎల్లప్పుడు ఈ కేసు గురించి తనతో చర్చించే వారని గౌతమ్ సవాంగ్ వెల్లడించారు ఇక ఈ కేసుపై వివేకా కూతురు సునీత తన భర్త రాజశేఖర్ రెడ్డి తనను కలిసినప్పుడు కూడా ముఖ్యమంత్రి చెప్పిన విషయాలను వారికి తెలియ చేశానని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…