Tag Archives: oxygen cylinders

కొరియర్ లో ఆక్సిజన్ సిలిండర్.. సోనుసూద్ వినూత్న ప్రయత్నం!

దేశంలో వ్యాపించిన కరోనా క్లిష్ట పరిస్థితులలో ఎంతోమంది నిస్సహాయులను, వలస కూలీలను,రక్షించి గొప్ప మనసు చాటుకున్న సోనుసూద్ రెండోదశ కరోనా సమయంలో కూడా అదే మానవతా దృక్పథంతో ఎంతో మందికి సహాయం చేస్తూ అందరిపట్ల ఆపద్బాంధవుడిగా మన్ననలు పొందుతున్నాడు.కరోనా రెండవ దశ తీవ్రస్థాయిలో విజృంభిస్తూ ఎంతోమంది ఆక్సిజన్ లభించక ప్రాణాలు కోల్పోతున్న సమయంలో సోనూసూద్ పలు ప్రాంతాలలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఎంతోమందికి ప్రాణదానం చేశారు.

ఈ విధంగా ఈ క్లిష్ట పరిస్థితులలో ఎంతో సహాయం చేస్తున్న సోన సూద్ కరోనా బాధితుల కోసం మరో అడుగు ముందుకు వేశారు.కరోనాతో బాధపడుతున్న ఏ ఒక్కరు ఆక్సిజన్ లభించక ప్రాణాలు కోల్పోకూడదన్న ఉద్దేశంతోనే ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ఆక్సిజన్ కోసం ఇబ్బందిపడుతున్న బాధితుల కోసం ఇంటివద్దకే ఆక్సిజన్ సిలిండర్ సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశారు.

దేశంలో ఎవరికైనా ఆక్సిజన్ సిలిండర్ అవసరమైతే
www.umeedbysonusood.com వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలని, ఆక్సిజన్ కోసం ఎవరైతే ఈ వెబ్సైట్ సంప్రదిస్తారో, సరాసరి వారి ఇంటికి ఆక్సిజన్ సిలిండర్ కొరియర్ ద్వారా వెళ్తుందని తెలిపారు. అవసరమైన వారికి ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను పంపిస్తామని తెలియజేశారు. అందుకోసం డీటీడీసీ కొరియర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.

దేశంలో ఏ మారుమూల ప్రాంతంలో అయిన ఆక్సిజన్ అవసరమయ్యే బాధితులు ఎక్కడి నుంచి బుక్ చేసుకున్న వారి ఇంటికి సరాసరి ఆక్సిజన్ సిలిండర్ వెళ్లేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ విధంగా కరోనా బాధితుల పట్ల సోనుసూద్ చేస్తున్నటువంటి సహాయం పట్ల ఎంతో మంది అతని పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

భారత్ లోని కరోనా రోగులకు మరో షాకింగ్ న్యూస్..?

భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గతంతో పోలిస్తే కేసుల సంఖ్య్ తగ్గినా కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. ప్రతిరోజూ 50,000కు అటూఇటుగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ డిసెంబర్ లేదా జనవరిలో అందుబాటులోకి వస్తుందని వార్తలు వచ్చినా ఇప్పట్లో వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో భారత్ లోని కరోనా రోగులకు ఊహించని ఉపద్రవం ముంచుకొస్తోంది.

దేశంలోని ప్రభుత్వ ఆస్పత్రులు ఆక్సిజన్ సిలిండర్ల కొరత వల్ల ఇబ్బందులు పడుతున్నాయి. కరోనా వైరస్ సోకిన రోగుల్లో శ్వాస సంబంధిత సమస్యలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. వెంటిలేటర్ల ద్వారా సరైన సమయంలో చికిత్స అందించడం ద్వారా మాత్రమే ఈ సమస్యను అధిగమించడం సాధ్యమవుతుంది. దేశంలో కరోనా రోగులకు చికిత్స అందించడం కోసం కొన్ని లక్షల వెంటిలేటర్ల అవసరం ఉంది.

అయితే మనుషులతో పాటు గ్యాస్, స్టీల్ పరిశ్రమలు కూడా ఆక్సిజన్ సిలిండర్ల అవసరం ఉంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమలకు సిలిండర్లను తగ్గించి వైద్య చికిత్స కోసం వినియోగిస్తున్నా దాదాపు 3,000 మెట్రిక్ టన్నుల కొరత సెప్టెంబర్ నాటికే ఏర్పడిందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా వైద్య అవసరాలకు కావాల్సిన ఆక్సిజన్ కొరత ఉంది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో 5 శాతం కేసులకు ఆక్సిజన్ సిలిండర్ల అవసరం ఉంది.

గతంతో పోలిస్తే ఆక్సిజన్ సిలిండర్ల వినియోగం ఏడెనిమిది రెట్లు పెరిగిందని సమాచారం. ఆక్సిజన్ అవసరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అదే స్థాయిలో ఉత్పత్తిని పెంచాల్సి ఉంటుంది. ఉత్పత్తిని పెంచలేకపోతే మాత్రం భవిష్యత్తులో ఆక్సిజన్ కొరత వల్ల కరోనా రోగుల ప్రాణాలు పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేద్.