Tag Archives: photo viral

అతడికి 72 ఏళ్లు.. కానీ 30 ఏళ్ల వయస్సు వ్యక్తిగా కనిపిస్తున్నాడు కదా.. రహస్యం ఇదే..!

ఫిట్ బాడీని మెయింటెయిన్ చేయడం, ఆరోగ్యంగా ఉండడం అనేది ఈ రోజుల్లో ప్రజలు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. అయితే అనుకున్నంత సులువగా సాధనలో మాత్రం పెట్టలేకపోతున్నారు.అయితే చైనాకు చెందిన ఓ వ్యక్తి తన ఫిట్‌నెస్ విధానంలో చాలా ప్రయోజనాలను పొందాడు .ఈ వ్యక్తి పేరు జిన్మిన్ యాంగ్. అతడికి 72 ఏళ్లు.

చైనాకు చెందిన వ్యక్తి. కానీ ఇతడిని చూస్తే.. 72 ఏళ్ల వయస్సు వ్యక్తి కాకుండా 30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తిగా కనిపిస్తున్నాడు. దానికి గల కారణం ఏంటంటే.. తన యవ్వన రూపాన్ని తిరిగి తెచ్చుకోవడంలో ఉపయోగపడింది కేవలం అతడు చేసే ఫిట్ నెస్ మాత్రమే. అవును మీరు విన్నది నిజమే.

ఫిట్‌నెస్ పట్ల అతనికి ఉన్న ఆసక్తి.. అతడు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి సహాయపడిందని అతడే స్వయంగా చెప్పాడు. ప్రతీ రోజు ఫుల్ గా వ్యాయామం చేసేవాడినని చెప్పాడు. సమయం దొరికితే ఎక్కువగా జిమ్ లోనే గడుపుతానన్నాడు. అతడికి ఈ ఫీట్ కూడా అంత తేలికగా రాలేదని.. దీని వెనుకాల ఎంతో శ్రమించినట్లు పేర్కొన్నాడు.

ఈ విషయాలను అతడు 2018లో చైనీస్ మీడియా కంపెనీ చేంజ్ ప్రొడక్షన్‌తో మాట్లాడాడు. రోజులో దాదాపు 24 గంటల సమయం ఉంటే.. అతడు దాదాపు 3 నుంచి 4 గంటల వరకు బాడీ బిల్డింగ్ పైనే ఎక్కువగా శ్రద్ధ చూపించేవాడట. ఇందంతా బాడీ బిల్డింగ్ శిక్షణలో పాల్గొన్నందుకే జరిగిందన్నాడు. ఇలా చేస్తే అనారోగ్యాలు కూడా దరి చేరవు అని సూచించాడు. అయితే ప్రస్తుతం అతడు అన్న మాటలు.. అతడి వయస్సుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరో వివాదంలో కంగనా.. ఆమెపై విరుచుకుపడుతున్న రైతులు..!

కొంతమంది సినీ ప్రముఖులు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు. అందులో ముఖ్యంగా కంగనా రనౌత్ ముందుంటారు. బోల్డ్‌గా, ఎవరు ఏమనుకున్నా.. అనిపించింది చెప్పేస్తుంది. సినీ పరిశ్రమలో ఇలాంటి వారు కనిపించడం చాలా అరుదు. ఏ సమస్యపై అయినా తనదైన రీతిలో స్పందిస్తూ కంగనా ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది.

అంతే కాకుండా తనకు అవసరం లేని విషయాల్లో కూడా స్పందిస్తూ ఏరికోరి సమస్యలను తెచ్చుకుంటుంది. తాజాగా ఆమె సిక్కులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా రైతులు దాదాపు సంవత్సరం నుండి నిరసనలు చేపట్టారు. అయితే ఇన్ని రోజుల తర్వాత ప్రభుత్వం వారి నిరసనలకు తలొంచి సాగు చట్టాలను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం ప్రకటనను ఇచ్చిన విషయం తెలిసిందే.

తర్వాత రైతులు ఆనందంతో సంబరాలు చేసుకుంటున్న సందర్భంలో తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కంగనా స్పందించారు. ఆమె ఢిల్లీ సరిహద్దులో ఏకధాటిగా నిరసనలు చేస్తున్న ఖ‌లిస్థానీ ఉద్య‌మంతో రైతులను పోలుస్తూ పోస్ట్ పెట్టింది. దీనిపై సిక్కు మతస్తులు ఆమెపై కేసు నమోదు చేశారు.

సబ్‌ అర్బన్‌ ఖార్‌ పోలీస్ స్టేషన్‌లో కంగనాపై కేసు నమోదయ్యింది. ఆమె ఉద్దేశ్యపూర్వకంగా ఆ పోస్టు చేశారని.. సిక్కులను ఖలిస్తానీ టెర్రరిస్టులంటూ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో సిక్‌ గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సహజనటి జయసుధ ఎలా మారిపోయారో తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సహజనటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని ఎన్నో అద్భుతమైన పాత్రలో అద్భుతమైన సినిమాలలో స్టార్ హీరోలందరి సరసన నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె వివిధ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి విశేష ఆదరణ దక్కించుకుంది.

ఇదిలా ఉండగా జయసుధ తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఎంతో బిజీగా గడిపారు. ఎన్నో చిత్రాలలో తల్లి పాత్రలో నానమ్మ పాత్రలలో ఒదిగిపోయి నటించారు. ఇలా నాటి తరం నుంచి నేటి వరకు అందరికీ అభిమాన నటిగా మారిపోయిన జయసుధ గత కొంత కాలం నుంచి వెండితెరకు దూరమయ్యారు.

ఈ క్రమంలోనే జయసుధ వెండితెరకు దూరం కావడానికి కారణం ఏమిటి అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేశారు.అయితే ఈమెకు అనారోగ్యం కారణంగా విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకుంటుందనే వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే జయసుధ వెండితెరకు దూరం అయినట్లు తెలుస్తోంది.

తాజాగా జయసుధ సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని షేర్ చేశారు ఈ ఫోటో చూస్తుంటే నిజంగా జయసుధ ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసిపోతుంది. ఈ ఫోటోలో జయసుధ పూర్తిగా తన అందాన్ని కోల్పోయి ఎంతో సన్నగా అయ్యారు. దీన్ని బట్టి చూస్తుంటే ఆమెకు నిజంగానే అనారోగ్యం చేయటంవల్ల ఇండస్ట్రీకి దూరమయ్యారని చెప్పవచ్చు.

గొడ్డలి పట్టుకున్న మంచు లక్ష్మి.. ఎవరైనా అలా చెప్తే ఫసక్!

తెలుగు సినీ నటి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ పరిచయం గురించి అందరికి తెలిసిందే. పలు సినిమాలలో నటించగా అంత గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది. మోహన్ బాబు కూతురుగా బాగా పరిచయం పెంచుకుంది. తను మాట్లాడే భాష పట్ల అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఫోటోలతో, వీడియోలతో బాగా రచ్చ చేస్తుంది. బాగా ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా అందులో బ్లూ జీన్స్, బ్లాక్ టాప్ ధరించి.. ఓ చేతిలో గొడ్డలి పట్టుకొని మరో చేతిని ఆవేశంగా చూపిస్తున్నట్లు ఫోటోకి ఫోజ్ ఇచ్చింది. ఇక ఈ ఫోటోకి వెకేషన్ అయిపోయిందని చెబితే.. తను అలా రియాక్ట్ అవుతానని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.

తెలుగు సినీ నటి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ పరిచయం గురించి అందరికి తెలిసిందే.

పలు సినిమాలలో నటించగా అంత గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది.

మోహన్ బాబు కూతురుగా బాగా పరిచయం పెంచుకుంది.

తను మాట్లాడే భాష పట్ల అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

నిత్యం ఫోటోలతో, వీడియోలతో బాగా రచ్చ చేస్తుంది.

బాగా ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.

తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా అందులో బ్లూ జీన్స్, బ్లాక్ టాప్ ధరించి..

ఓ చేతిలో గొడ్డలి పట్టుకొని మరో చేతిని ఆవేశంగా చూపిస్తున్నట్లు ఫోటోకి ఫోజ్ ఇచ్చింది.

ఇక ఈ ఫోటోకి వెకేషన్ అయిపోయిందని చెబితే..

తను అలా రియాక్ట్ అవుతానని క్యాప్షన్ ఇచ్చింది.

ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఫోటో వైరల్: బంగారు మాస్కు ధరించిన బాబా.. మాస్క్ ధర ఎంతంటే!

ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్నటువంటి కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే బయటకు వెళ్లాలంటే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలి. లేదంటే ఈ మహమ్మారి బారిన పడాల్సి వస్తుంది.ఈ క్రమంలోనే మనకు మార్కెట్లోకి ఎన్నో రకాల మాస్కులు అందుబాటులోకి వచ్చాయి.

క్లాస్ మాస్క్ లు, సర్జికల్ మాస్కులు, ఎన్ -95 మాస్క్, వంటి వివిధ రకాల మాస్కులు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి.ఈ విధంగా మాస్క్ లను ధరించి బయటకు వెళ్లడం వల్ల కరోనా నుంచి కొంత వరకు మనల్ని మనం రక్షించుకోవచ్చు.అయితే మార్కెట్లో ఇన్ని రకాల మాస్కులు అందుబాటులో ఉన్నప్పటికీ ఓ వ్యక్తి మాత్రం అందరికీ ఎంతో భిన్నంగా బంగారంతో తయారు చేయించిన మాస్క్ ధరించాడు.ఈ విధంగా బంగారు మాస్క్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన మనోజ్‌ సెంగార్‌ మాస్క్‌ను బంగారంతో మాస్క్ చేయించుకున్నారు. గోల్డెన్‌ బాబాగా పేరుగాంచిన మనోజానంద మహారాజ్‌ బంగారం మాస్కును ధరించాడు. ఈ సందర్భంగా ఇతను మాట్లాడుతూ తన చేయించుకున్న మాస్క్ మూడు పొరలతో తయారయిందని, దీనిని పూర్తిగా శానిటైజర్ చేసి ఉందని తెలిపారు.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యాపించి ఉన్న కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండటం కోసం తన ఈ విధంగా అక్షరాల ఐదు లక్షల రూపాయలను ఖర్చు చేసి ఈ విధమైనటువంటి బంగారు మాస్క్ తయారు చేయించుకున్నట్లు తెలిపారు. ఈ మాస్క్ ధరించడం వల్ల తను పూర్తిగా వైరస్ నుంచి రక్షణ పొందుతారని, తన బంగారం మాస్క్ 3 సంవత్సరాల పాటు పని చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఏది ఏమైనా బంగారం మాస్క్ ధరించినటువంటి ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.