Tag Archives: rana daggupati

బోర్‌డ‌మ్‌కు చెప్పేయ్ గుడ్‌బై.. అంటూ బిగ్ బాస్ 5 ప్రోమో వచ్చేసింది..

ఎప్పుడెప్పుడా అని తెలుగు ప్రేక్ష‌కులు ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. ఐదో సీజన్ కూడా నాగార్జునే హోస్ట్ చేస్తున్నాడు. చాలా రోజులుగా దీనిపై కూడా అనుమానాలు ఉన్నాయి. నాగార్జున కాకుండా రానా దగ్గుబాటి వస్తున్నాడని.. నాగ్ బిజీ కారణంగా తప్పుకున్నాడని జరుగుతున్న ప్రచారానికి కూడా తెర పడింది.

స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా బిగ్ బాస్ సీజ‌న్ 5 ప్రోమోను విడుద‌ల చేశారు. ఒకటిన్నర నిమిషం ఉన్న ప్రోమో చాలా ఆసక్తికరంగా డిజైన్ చేసారు మేకర్స్. గతేడాది బిగ్ బాస్ 4 అందరినీ అలరించింది. రేటింగ్స్ కూడా బాగానే వచ్చాయి. అన్నింటికంటే ముఖ్యంగా కరోనా సమయంలో వచ్చిన బిగ్ బాస్ 4కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వ‌ర‌లోనే బిగ్ బాస్ సీజ‌న్ 5 ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే బిగ్ బాస్ 5 లోగోను విడుద‌ల చేసిన బిగ్ బాస్ యాజ‌మాన్యం.. తాజాగా హోస్ట్ నాగార్జున ఉన్న ప్రోమోను రిలీజ్ చేశారు.

బోర్‌డ‌మ్‌కు చెప్పేయ్ గుడ్‌బై.. వ‌చ్చేసింది బిగ్‌బాస్‌ తెలుగు సీజ‌న్ 5’ అంటూ నాగార్జున సరికొత్తగా ఎంట్రీ ఇచ్చాడు. నాగార్జున అంద‌రితో చిందులేస్తూ చెప్పే మాట‌లు తెలుగు ప్రేక్ష‌కుల‌కు హుషారును తెప్పిస్తారు. ఈ ప్రోమోతో బిగ్‌బాస్‌ను క్రేజ్‌ను మరింత పెంచేశాడు నాగార్జున. అది చూసి ఫిదా అయిపోతున్నారు అభిమానులు. దీనిని 120 రోజులు ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సీజన్ గత సీజన్ కంటే అదిరిపోతుందని షో నిర్వాహకులు నమ్మకంగా చెబుతున్నారు.

ఇప్పటికే కంటెస్టెంట్ల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్, శ్వేత, యాంకర్ రవి, నటి ప్రియా, ట్రాన్స్‏జెండర్ ప్రియాంక, లోబో,సిరి హన్మంత్, ఆట సందీప్ భార్య జ్యోతి, యాంకర్ వర్షిణి, యానీ మాస్టర్, కార్తీక దీపం భాగ్య అలియాస్ ఉమ, నటి లహరి, నవ్వస్వామి, యూట్యూబర్ నిఖిల్, వీజే సన్నీ, ఆర్జే కాజల్ లపేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో అందరు లేకున్నా కొంతమంది పేర్లను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

పవన్, రానా మూవీ నుండి మరో లేటెస్ట్ అప్డేట్..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు. ఇక ఈయన సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న అయ్యప్పన్ కోషియుమ్ రీమేక్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉండగా ఇందులో పవన్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. అంతే కాకుండా ఇందులో రానా దగ్గుబాటి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రానా విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

ఇక ఈ సినిమా గురించి ఏదో ఒక అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సినిమా కోసం పవన్ బాగా కష్టపడుతున్నాడట. ఇక రానా పాత్ర పవన్ పాత్రతో సమానంగా ఉండేటట్లు ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా మొత్తం యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కనుంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కి సంబంధించిన ప్రాజెక్టు పూర్తయింది. రెండో షెడ్యూల్ ప్రారంభించడానికి ప్లాన్ చేయగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా వాయిదా పడింది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి మరో అప్ డేట్ బయటికి వచ్చింది. ప్రస్తుతం లాక్ డౌన్ ఎత్తివేయడంతో షూటింగ్ ప్రారంభించడానికి ఆలోచనలు చేస్తున్నారు. జూలై మొదటి వారంలో ఈ సినిమా సెట్ లోకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే అల్యూమినియం ఫ్యాక్టరీలో పోలీస్ స్టేషన్ సెట్ నిర్మిస్తున్నారట.

ఇందులో పవన్, రానా ఒకరినొకరు తలపడే సన్నివేశాలు ఎదురవడంతో పాటు.. ఇది సినిమాకు హైలెట్ గా మారుతుందని సమాచారం. ఇక మొత్తానికి ఈ సినిమా గురించి పవన్ అభిమానులు ఎదురు చూడగా త్వరలోనే సెకండ్ షెడ్యూల్ పూర్తి చేయనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ మొదటి రోజు నుండే సెట్ లోకి అడుగు పెట్టానున్నాడట. అంతే కాకుండా పవన్ హరిహర వీరమల్లు సినిమాలో కూడా బిజీగా ఉన్నాడు. ఇక రానా కూడా విరాటపర్వం సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

‘రానా’ టాటూ వెనక అంత పెద్ద సీక్రెట్ ఉందా..??

మన సినీ సెలెబ్రిటీలు ఏం చేసినా అది ఫ్యాషనే..ముఖ్యంగా చాలామంది సెలెబ్రిటీలు తమ ఒంటిపై టాటూస్ వేయించుకుంటుంటారు.. అది కూడా ఒక ఫ్యాషన్ అని ఫీలవుతుంటారు వాళ్లు.. హీరోల్లో కొంతమంది మాత్రమే దీన్ని ఫాలో అయితే.. ముఖ్యంగా చాలా మంది హీరోయిన్స్ మాత్రం పర్మినెంట్ టాటూలు వేయించుకుంటారు. త్రిష, నయనతార, సమంతా, రష్మిక ఒకరేమిటీ చాలా మంది నటీమణు తమ ఒంటిపై పచ్చబొట్లు పొడిపించుకున్నారు.

పలువురు హీరోలు సైతం తమకు నచ్చిన టాటూలు వేయించుకున్నారు. నాగార్జున భుజంపై పెద్ద చక్రం టాటూ ఉంటుంది. రానా కూడా ఒంటిపై ఓ పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. కాకపోతే ఆ టాటూ ఎక్కడ వేసుకున్నాడు? దాని వెనుకున్న సీక్రెట్ ఏంటి అనే విషయాలను మాత్రం రివీల్ చేయలేదు. ఆ పచ్చబొట్టు లేకపోతే బాగుండు అని తాజాగా ఆయన వెల్లడించాడు.రీసెంట్ గా రానా హోస్ట్ చేస్తున్న ఓ షోకు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు మోహన్ బాబు ముద్దుల బిడ్డ కలిసి వచ్చారు.

కాసేపు షోలో ఫన్నీ ముచ్చట్లు పెట్టారు. ఒకరిపై మరొకరు క్వశ్చన్లు వేసుకున్నారు. ఈ క్రమంలోనే ఓ టాటూ వేసుకోవాలని అనుకంటే ఎవరిది వేసుకుంటావని రానాను అడిగారు.దీనికి రానా ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పాడు. ఎవరి పేరును వేయించుకుంటాను అనే విషయం పక్కనపెడితే.. ముందుగా తన ఒంటిపై ఉన్న టాటూ డిజైన్ మార్చుకోవాలని ఉందన్నాడు. అది తనను బాగా ఇబ్బంది పెడుతున్నట్లు చెప్పాడు.

ఇక ఎవరి పేరో వేయించుకోవడం కంటే తన పేరునే తన ఒంటిపై పచ్చబొట్టుగా వేయించుకుంటానని చెప్పాడు. దాని వలన ఎవరికి ఎలాంటి అనుమానం కలుగదని చెప్పాడు. పైగా తన పేరుతో తన తాత పేరు కూడా ఉందన్నాడు.అయితే.. ఇప్పటికే తన ఒంటిపై ఉన్న టాటూ సీక్రెట్ ఏంటి అనేది మాత్రం రానా చెప్పలేదు. కానీ నెటిజన్లు ఆ టాటూ గురించి వెతికే పనిలోపడ్డారు. రానా డేటింగ్ చేసిన ఏ హీరోయిన్ పేరో అయి ఉంటుందని కామెంట్ చేస్తున్నారు..!!

మరో పాన్ ఇండియా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రానా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత రామానాయుడు మనవడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తనదైన శైలిలో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. కేవలం హీరోగా మాత్రమే కాకుండా విలన్ పాత్రలో కూడా నటిస్తూ ఎంతో గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే రానా విరాటపర్వం అనే సినిమాలో ఓ విలక్షణమైన పాత్రలో కనిపించనున్నారు.

తాజాగా రానా నటించిన అరణ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో అడవి, అడవి జంతువుల నేపథ్యంలో వాటి హక్కులు రక్షణ గురించి చర్చించారు. ఇక ఆయన ప్రస్తుతం విరాటపర్వం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే రానా మరో పాన్ ఇండియా చిత్రాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది.

రానా హీరోగా పాన్ ఇండియా తరహాలో విశ్వశాంతి పిక్చర్స్ నిర్మాణంలో ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఈ సినిమాను సీహెచ్ రాంబాబుతో కలిసి విశ్వశాంతి పిక్చర్స్ అధినేత ఆచంట గోపినాథ్ నిర్మించనున్నారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్, రానా మల్టీస్టారర్ చిత్రంగా ఓ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా తర్వాత రానా ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొన్నట్లు సమాచారం.

గతంలో ఈ నిర్మాణ సంస్థలో బాలకృష్ణ టాప్ స్టొరీ, దేవుడు, ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన జంబలకడిపంబ అనే బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించారు. ఈ సినిమా విషయానికి వస్తే మంత్ర తంత్రాలు.. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ మూవీగా దీనిని తెరకెక్కనున్న ఈ చిత్రానికి గృహం ఫేమ్‌ డైరెక్టర్ మిలింద్ రావ్ దర్శకత్వం వహించనున్నాడని సమాచారం.ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర బృందం తెలియజేసింది.

రానా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సాయి పల్లవి!

శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన “ఫిదా” సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన సాయి పల్లవి తన నటన ద్వారా అందరినీ ఆకట్టుకుంది. కమర్షియల్ పాత్రలకు దూరంగా ఉంటూ, నటనకు ఎక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్రలపై ఆమె దృష్టి సారించింది.ఫిదా సినిమాతో మంచి హిట్ ని సంపాదించుకున్న సాయిపల్లవి వరుస సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న తాజా చిత్రం “విరాట పర్వం”సినిమాలో హీరో రానా సరసన నటిస్తున్నారు.

తాజాగా జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సాయి పల్లవి, విరాట పర్వం సినిమాలో రానా పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. విరాట పర్వం సినిమాలో ఎంతో కీలకమైన పాత్రలో తను నటిస్తున్నారు. సాధారణంగా ఏ సినిమాలో అయినా హీరోయిన్ ది కీలక పాత్ర అయినప్పటికీ ముందుగా హీరోయిన్ల పేర్లను పెట్టడానికి ఇష్టపడరు. కానీ విరాటపర్వం టైటిల్ కార్డ్స్ లో తన పేరు కంటే నా పేరే ముందు ఉండాలని రానా చెప్పారు. రానా సమానత్వానికి విశ్వసించే వ్యక్తి అని ఇంటర్వ్యూ ద్వారా సాయి పల్లవి రానా గురించి తెలిపారు.

రానా లాంటి ఒక మంచి వ్యక్తితో ఈ సినిమా చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా సాయి పల్లవి తెలియజేశారు. అయితే ఈ రోజు రానా పుట్టిన రోజు కావడంతో విరాటపర్వం ఫస్ట్ లుక్ విడుదల చేశారు.ఎస్‌.ఎల్‌.వి సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విరాటపర్వం ఫస్ట్లుక్ గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేయడంతో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ సినిమాలో ప్రియమణి, నందితాదాస్, నవీన్ చంద్ర, తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి నాగచైతన్య సరసన “లవ్ స్టోరీ” సినిమాలో కూడా నటిస్తున్నారు.