Tag Archives: sai pallavi

ప్రీ రిలీజ్ వేడుకలో సారంగదరియా అంటూ రెచ్చిపోయిన సాయిపల్లవి..!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం లవ్ స్టోరీ. ఈచిత్రం కరోనా రెండవ దశ రాకముందే విడుదల కావాల్సి ఉండగా.. థియేటర్లు మూత పడటంతో ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమాకు ఏర్పడిన అడ్డంకులను ఇంటిని తొలగించుకొని ఈనెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలోనే నేడు(ఆదివారం) హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎంతో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఈ వేడుకకు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ విధంగా ఆదివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న ఈ నటుడు నాగచైతన్యతో కలిసి గ్రీన్ ఇండియా చాలెంజ్ లో నాగచైతన్యతో కలిసి మొక్కలు నాటారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సింగర్ మంగ్లీ పాల్గొని లవ్ స్టోరీ సినిమాలో ఎంతో ఫేమస్ అయినటువంటి సారంగదరియా పాటను ఆలపించగా అందుకు సాయిపల్లవి రెట్టింపు ఉత్సాహంతో మరోసారి స్టేజ్ పై చిందులు వేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అందించిన ఈ పాట ఇప్పటికి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్ లు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని సినిమాలపై అంచనాలు పెంచాయి. ఈ క్రమంలోనే ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ప్రేక్షకుల కోసం మరోసారి సాయి పల్లవి వేదికపై సారంగదరియా స్టెప్పులతో.. అందరినీ సందడి చేసింది.

తెలంగాణ యాసలో మాట్లాడి సందడి చేసిన హీరో హీరోయిన్స్ వీళ్ళే!

దేశం అన్నాక ఒకే కుల, మతాలు ఉండవు. అదే విధంగా ఒకే విధమైన భాష మాట్లాడేవారు కూడా ఉండరు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన భాషతో మాట్లాడుతుంటారు. మరి మన తెలుగు రాష్ట్రాలలో మాట్లాడేది తెలుగు భాష అయినప్పటికీ తెలంగాణలో ఒక విధంగా రాయలసీమలో ఒక విధంగా మాట్లాడుతుంటారు.ఈ క్రమంలోనే తెలంగాణలో మాట్లాడేది తెలుగు భాషే అయినప్పటికీ ఒక విధమైన యాస ఉంటుంది. తెలంగాణ వాసులు మాట్లాడే మాటతీరు కొంత భిన్నంగా ఉంటుంది. ఈ క్రమంలోనే తెలంగాణ యాసలో ఎన్నో సినిమాలు తెరకెక్కి ప్రేక్షకులను సందడి చేశాయి. మరి తెలంగాణ యాసతో మాట్లాడి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆ సినిమాలు ఏమిటి? ఆ హీరో హీరోయిన్లు ఎవరు? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

  • పెళ్లి చూపులు -విజయ్ దేవరకొండ: పెళ్లి చూపులు సినిమా ద్వారా హీరోగా పరిచయమైన నటుడు విజయ్ దేవరకొండ హైదరాబాద్ వాసి అయినప్పటికీ ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడడం పెద్ద కష్టమేమీ కాలేదు. ఈ సినిమాకి విజయ్ దేవరకొండ తెలంగాణ యాస ఎంతో గుర్తింపు తీసుకువచ్చింది.
  • ఫిదా -సాయి పల్లవి: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా పరిచయమైన సినిమా ఫిదా. ఈ సినిమాలో సాయి పల్లవి అచ్చు తెలంగాణ అమ్మాయిల తెలంగాణ భాషను ఎంతో అద్భుతంగా మాట్లాడి ఎంతో మంచి గుర్తింపు తీసుకువచ్చింది.
  • ఫలక్ నుమా దాస్ -విశ్వక్ సేన్: విశ్వక్ సేన్ హీరోగా వచ్చినటువంటి ఫలక్ నుమా దాస్ చిత్రంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను, బోనాల ఉత్సవాలను ఎంతో అద్భుతంగా చూపించారు.
  • NET -రాహుల్ రామకృష్ణ: కమెడియన్ రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించినటువంటి చిత్రం
    NET. ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ మరియు ప్రణీత పట్నాయక్ మొత్తం తెలంగాణ యాసతో మాట్లాడి ప్రేక్షకులను సందడి చేశారు.
  • ఇస్మార్ట్ శంకర్ -రామ్ పోతినేని: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ చిత్రం ఇస్మార్ట్ శంకర్ సినిమాలో మాట్లాడినటువంటి తెలంగాణ యాసతో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
  • మల్లేశం -ప్రియదర్శి: మల్లేశం సినిమాలో కమెడియన్ ప్రియదర్శి స్లాంగ్ తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా ఉందనీ చెప్పవచ్చు.
  • జాతి రత్నాలు -నవీన్ పోలిశెట్టి: ఈ ఏడాది విడుదలైన జాతిరత్నాలు సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఇందులో నవీన్ పోలిశెట్టి అచ్చమైన తెలంగాణ యాసతో ప్రేక్షకులను ఎంతో సందడి చేశారు
  • లవ్ స్టోరీ -నాగ చైతన్య: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి నాగచైతన్య జంటగా తెరకెక్కిన లవ్ స్టోరీ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో కూడా సాయి పల్లవి నాగ చైతన్య ఇద్దరు తెలంగాణ యాసతో ప్రేక్షకులను సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది.

పిచ్చిదానిలా మారిపోయిన సాయి పల్లవి..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో సాయి పల్లవి. గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ కథా ప్రాముఖ్యత ఉన్న పాత్రలను ఎంపిక చేసుకొని తనదైన శైలిలో దూసుకుపోతోంది.కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న సాయి పల్లవి,ఫహ‌ద్ ఫాజిల్ జంటగా నటించిన మలయాళ చిత్రం  ‘అతిరన్‌’. 2019 లో థియేటర్ లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది .

ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న  ‘అతిరన్‌’. ఈ సినిమా త్వరలోనే డిజిటల్ మాధ్యమం లో సందడి చేయనుంది. మలయాళంలో  ‘అతిరన్‌’పేరుతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ‘అనుకోని అతిథి’ పేరుతో ప్ర‌ముఖ ఓటీటీ ఆహాలో మే 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే ఆహా ఈ సినిమాకి సంబంధించి నటువంటి టీజర్ విడుదల చేసింది.

ఈ టీజర్ లో సాయి పల్లవి పిచ్చిదానిగా మారిపోయి చేసిన నటన ప్రేక్షకులలో ఎంతో ఆసక్తిని రేపుతోంది. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో వివేక్ తెర‌కెక్కించిన ఈ సినిమాలో ప్ర‌కాశ్ రాజ్‌, అతుల్ కుల‌క‌ర్ణి కీల‌క పాత్ర‌లు పోషించారు. జిబ్రాన్ సంగీతం అందించారు.

ఇకపోతే మలయాళ నటుడు ఫహ‌ద్ ఫాజిల్ ప్రస్తుతం తెలుగులో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో సందడి చేయనున్నారు. అదే విధంగా సాయి పల్లవి నాని “శ్యామ్ సింగ రాయ్ ” సినిమాలో నటిస్తున్నారు. అదేవిధంగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సరసన “లవ్ స్టోరీ” సినిమాలో నటించారు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

‘సాయి పల్లవి’ రిజెక్ట్ చేసిన సినిమాలు ఏంటో తెలుసా.. ఆ స్టార్ హీరోలకు కూడా నో చెప్పిందా..??

టాలీవుడ్ లో మెగా హీరో వరుణ్ తేజ్ సరసన ‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందాల భామ సాయి పల్లవి.. ఆ సినిమాలో తన అందంతో పాటు చక్కటి అభినయాన్ని కనబరుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. చూడటానికి అచ్చం తెలుగమ్మాయిలా కనిపించే పల్లవి. తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ..టాప్ హీరోయిన్ రేస్ లో దూసుకుపోతుంది.

తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సాయి పల్లవి సినిమాలు చేస్తుంది.యంగ్ హీరోలు ఏమాత్రం ఛాన్స్ దొరికిన సాయిపల్లవిని హీరోయిన్ గా ఎంపిక చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. తాను ఎంచుకున్న సినిమాల ద్వారా.. మంచి నటిగా.. పాత్రకు తగ్గట్లు హావ భావాలను చక్కగా ప్రదర్శించగల భామగా పేరు తెచ్చుకుంది.ఈ భామ ప్రస్తుతం తెలుగులో ‘విరాట పర్వం’ అనే సినిమాను చేస్తోంది. ఈ సినిమాను వేణు ఊడుగుల (నీది నాది ఒకే కథ ఫేమ్‌) దర్శకత్వం వహిస్తున్నారు.

తెలంగాణ నేపథ్యంలో నక్సలైట్స్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో సాయిపల్లవి పేదింటి యువతిగా కనిపించనున్నది. అలాగే మరో సారి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తుంది. అయితే గత మూడేళ్ళలో సాయి పల్లవి నాలుగు సినిమాలని వదులుకుందట. వాటిలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమా ఒకటి. ముందుగా ఈ సినిమా కోసం సాయిపల్లవిని సంప్రదించారట కానీ పాత్ర నచ్చకపోవడంతో ఆమె రిజెక్ట్‌ చేసిందట.

అలాగే ఆ తర్వాత మహేశ్‌ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’లో కూడా మొదట సాయిపల్లవినే హీరోయిన్ గా అనుకున్నారట. కానీ ఆ సినిమాను కూడా ఈ అమ్మడు సున్నితంగా తిరస్కరించిందట. అలాగే.. అయ్యప్పనుమ్ కోషియం( రీమేక్), బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కర్ణన్ (రీమేక్) వంటి సినిమాలు రిజెక్ట్ చేసిందట. వీటితో పాటు దాదాపు 6 కమర్షియల్‌ యాడ్స్‌ని కూడా ఒప్పుకోలేదట ఈ న్యాచురల్ బ్యూటీ…!!

‘సాయి పల్లవి’కి ఆ పేరు పెట్టడానికి అసలు కారణం అదేనట..!!

ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో టాప్ స్టార్ గా దూసుకుపోతోంది న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి.సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో మాత్రమే నటిస్తూ.. స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోవడంతో పాటు తన నటనతో ఫిదా చేస్తూ,ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అందుకే తెలుగు,తమిళ,మలయాళ భాషల్లో సైతం నటిగా ఆఫర్లను సాధిస్తూ విజయాలను నమోదుచేస్తున్న సాయిపల్లవి నటనతోనే కాదు డ్యాన్స్ తో సైతం మెప్పిస్తూ రౌడీ హీరోయిన్ గా మారింది.

ఇక సాయిపల్లవి నటించిన లవ్ స్టోరీ, విరాటపర్వం సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. అలాగే శ్యామ్ సింగరాయ్, మరికొన్ని సినిమాలలో సాయిపల్లవి చేస్తోంది.ఫలితాలతో సంబంధం లేకుండా సినిమా సినిమాకు సాయిపల్లవికి క్రేజ్ పెరుగుతూనే ఉంది. అదే సమయంలో ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే తన రెమ్యునరేషన్ ను సైతం సాయిపల్లవి వెనక్కు ఇచ్చేసిన సందర్భాలున్నాయి.

సాయిపల్లవి వివరాల్లోకి వెళ్తే, తల్లి రాధ నాట్యకారిణి. తండ్రి కన్నణ్ కస్టమ్స్ అధికారిగా పని చేసేవారు. ఆమె తల్లి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో ఆమె పేరులో సాయిని చేర్చింది. చిన్నప్పటి నుంచి సాయిపల్లవికి మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే చాలా భయం. తొలిసారి తమిళంలో ధామ్ ధూమ్ అనే సినిమాలో నటించి, ఆ తరువాత మీరాజాస్మిన్ కు క్లాస్ మేట్ గా నటించింది.అయితే స్టడీస్ పై దృష్టి పెట్టి, జార్జియాలో మెడిసిన్ పూర్తిచేసి, మలయాళంలో తెరకెక్కిన ప్రేమమ్ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.

ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఫిదా సినిమాలో నటించి టాలీవుడ్ ఆడియన్స్ ని ఫిదా చేసింది. కాగా అల్లు అర్జున్ డ్యాన్సులంటే సాయిపల్లవికి ఇష్టం. అయితే ఫిదాలో తన డ్యాన్స్ ను అల్లు అర్జున్ ప్రశంసించడం ఎప్పటికీ మరిచిపోలేనని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది సాయి పల్లవి.. ఇక ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది ఈ ఫిదా బ్యూటీ…!!

మరోసారి రిపీట్ కానున్న ‘ఫిదా’ కాంబో.. ఇక ఆడియన్స్ కి పండగే..!!

మెగా హీరో వరుణ్ తేజ్, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన ‘ఫిదా’ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం హిట్ సినిమాకు కొత్తం అర్దం చెప్పినట్లుగా కలెక్షన్స్ వర్షం కురిపించింది..అంతేకాదు సినిమాలో సాయి పల్లవి తన అందం, అభినయం తో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేసింది.. అంతే కేవలం ఆ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారి ఫుల్ బిజీ అయ్యిపోయింది.

దాంతో ఇప్పుడు అదే కాంబినేషన్ ని రిపీట్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరా డైరక్టర్, ఏమా కథ అంటారా..కరోనా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు వరుణ్ తేజ్. ప్రస్తుతం కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో ‘గని’ అనే స్పోర్ట్స్‌ డ్రామా చేస్తున్నారు వరుణ్‌ తేజ్‌.అలాగే అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్‌తో కలసి ‘ఎఫ్‌ 3’ చిత్రంలోనూ నటిస్తున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఈ రెండు సినిమాల చిత్రీకరణకు బ్రేక్‌ పడింది.

ఈ గ్యాప్‌లోనే ‘ఛలో, భీష్మ’ చిత్రాల ఫేమ్‌ వెంకీ కుడుముల చెప్పిన స్టోరీ లైన్‌ విన్నారట వరుణ్‌. వెంకీ చెప్పిన స్టోరీ లైన్‌ నచ్చడంతో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వరుణ్‌ తేజ్‌.ప్రస్తుతం నటిస్తున్న ‘గని, ఎఫ్‌ 3’ చిత్రాల షూటింగ్‌ పూర్తయిన వెంటనే వెంకీ కుడుముల ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారని సమాచారం. అన్నీ కుదిరితే దసరాకి చిత్రీకరణ మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ నిర్మించనుందని తెలిసింది.

ఈ సినిమాలో వరణ్ సందేశ్ సరసన సాయి పల్లవిని ఎంపిక చేసారు. ప్రస్తుతం ఈ మేరకు టాక్స్ జరుగుతున్నాయి. అయితే కరోనా సమస్యతో డేట్స్ అందరివీ డిస్ట్రబ్ అయ్యిపోయాయి. దాంతో సాయి పల్లవి తను ఖచ్చితంగా ఫలానా తేదీ నుంచి డేట్స్ ఇవ్వగలను అని చెప్పలేనని అందిట. ఇక మరోవైపు దర్శకుడు వెంకీ ఇప్పటికే వరుణ్ కి ఒక నెరేషన్ ఇచ్చాడు. త్వరలోనే ఫైనల్ స్క్రిప్ట్ చెప్పాల్సి ఉంది. ప్రస్తుతం కథకు తుది మెరుగులు దిద్దే పనిలో బిజీగా ఉన్నాడు వెంకీ కుడుముల..!!

బర్త్ డే స్పెషల్ : ఆ రికార్డులు సాయి పల్లవికి మాత్రమే సొంతం..!!

ఫిల్మ్ ఇండస్ట్రీలో అందం, తనదైన అభినయంతో గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూనే సౌత్ లో భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి.. అంతేకాదు సౌత్ లో ఏ హీరోయిన్ క్రియేట్ చేయలేని రికార్డులను సైతం తన పేరున క్రియేట్ చేసుకుంది ఈ మలయాళ భామ. తమిళ దర్శకుడు అల్ఫోన్సో తెరకెక్కించిన ‘ప్రేమమ్’ చిత్రం వెండితెర అరంగ్రేటం చేసిన సాయిపల్లవి…తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది.

భానుమతిగా తన నటనతో అందరినీ ‘ఫిదా’ చేసేసింది. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని స్వంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంది.తర్వాత నాని సరసన ఎం.సి.ఏ చిత్రంలో నటించింది. ఆ తరువాత తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు చిత్రాలు చేసింది. తమిళ స్టార్ హీరో ధనుష్ సరసన ‘మారి-2’ చిత్రంతో నటించి కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సాయి పల్లవి. కానీ ఆమెకు కోలీవుడ్ పెద్దగా కలిసి రాలేదనే చెప్పొచ్చు. మారి-2, దియా అనే తమిళ హార్రర్ మూవీ, ఆ తరువాత సూర్యతో కలిసి సాయి పల్లవి నటించిన ‘ఎన్జికే’ చిత్రాలు భారీ ఫ్లాప్ లుగా నిలిచాయి. టాలీవుడ్ లో మాత్రం ఆమె నటించిన చిత్రాలన్నీ మంచి ఫలితాలనే ఇచ్చాయి.

ఒక్క ‘పడి పడి లేచే మనసు’ తప్ప. ఇక తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా భారీ సంఖ్యలో అభిమాన గణాన్ని సొంతం చేసుకుంది.గతంలో కూడా సాయి పల్లవి, ధనుష్ జంటగా నటించిన ‘మారి-2’ చిత్రంలోని ‘రౌడీ బేబీ’ సాంగ్ 1.14 బిలియన్ల వ్యూస్ దాటేసి హిస్టరీ క్రియేట్ చేసింది. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి నటించిన ‘ఫిదా’ చిత్రంలోని ‘వచ్చిండే’ సాంగ్ 300 మిలియన్ల వ్యూస్ దాటింది. ఇక తాజాగా ‘సారంగదరియా’ సాంగ్ 17.6 మిలియన్ వ్యూస్ దాటింది. సౌత్ లో ఒక హీరోయిన్ సాంగ్స్ కు ఇంతటి ఆదరణ రావడం విశేషం.ఇక ప్రస్తుతం సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న రొమాంటిక్ యూత్ ఫుల్ మూవీ ‘లవ్ స్టోరీ’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రం విడుదల గురించి ఎంతోమంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ‘లవ్ స్టోరీ’ విడుదలకు బ్రేక్ పడింది. మరోవైపు సాయిపల్లవి, రానా దగ్గుబాటి జంటగా నటిస్తున్న మూవీ ‘విరాటపర్వం’ కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. పుట్టినరోజు సందర్భంగా ఆమె అభిమానుల కోసం తాజాగా సాయి పల్లవి బర్త్ డే సీడీపీ రిలీజ్ అయ్యింది. ఇందులో సాయి పల్లవి రెడ్ కలర్ సారీలో తన స్మైల్ తో అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది. మరోవైపు ఇటీవల సెన్సేషనల్ గా మారిన ‘సారంగదరియా’ అనే ఫోక్ సాంగ్ కు స్టెప్పులేస్తున్న సాయి పల్లవి లుక్, మరోవైపు అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న ‘విరాటపర్వం’ చిత్రంలోని సాయిపల్లవి లుక్ తో సీడీపీని రెడీ చేశారు. ఇక మన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విషెస్ ని అందజేస్తూ.. ఫ్యూచర్ లో మరిన్ని మంచి సినిమాల్లో నటించాలని కోరుకుందాం…!!

ఒకేసారి రెండు సినిమాలను పూర్తి చేయనున్న నాని..!!

టాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు.. హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో దూసుకెళ్తున్నాడు… ఇప్పటికే వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న నాని త్వరలో మరో సినిమాను పట్టాలెక్కించనున్నాడు.. శివ నిర్వాణ దర్శకత్వములో ఇప్పటికే టక్ జగదీష్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసాడు నాని.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్, పాటలు విడుదలై మంచి రెస్పాన్స్ ని తెచ్చుకున్నాయి..

ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది..ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సిన కరోనా పరిస్థితుల దృష్ట్యా సినిమా విడుదల వాయిదా పడింది.. ఇక ఈ సినిమాలో రీతువర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లు గా నటించారు. ఈ సినిమా తర్వాత టాక్సీ వాల ఫెమ్ రాహుల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నాని. ఈ సినిమా శ్యామ్ సింగరాయ్ అనే ఆసక్తికర టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది.

ఈ సినిమాలో సాయి పల్లవి , ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి, అధితిరావు హైదరి నటిస్తున్నారు. ఈ సినిమాతోపాటు ‘అంటే .. సుందరానికీ’ అనే సినిమా కూడా చేస్తున్నాడు నాని.కరోనా కారణంగా చాలా సినిమాలు పేకప్ చెప్పేసుకుని లొకేషన్లు వదిలేసి వెళ్లిపోయాయి. కానీ నాని మాత్రం తన సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటూ ఉండటం విశేషం. అటు కొన్ని రోజులు .. ఇటు కొన్ని రోజులు కేటాయిస్తూ సినిమా షూటింగులు కానిచ్చేస్తున్నాడట.

అయితే తాను చాలా జాగ్రత్తలు తీసుకుంటూ .. టీమ్ ను అప్రమత్తం చేస్తున్నాడని అంటున్నారు. నాని ఒప్పుకున్న ‘శ్యామ్ సింగ రాయ్’ .. ‘ అంటే .. సుందరానికీ!’ రెండు ప్రాజెక్టులు కూడా సెట్స్ పైనే ఉన్నాయి. ఈ రెండు సినిమాలను ఒకేసారి పూర్తి చేయాలనే ప్లాన్ చేస్తున్నాడట నాని.. అంతేకాదు ఈ రెండు సినిమాల తర్వాత మారుతి దర్శకత్వంలో కూడా మరో సినిమా చేయనున్నాడని ఫిల్మ్ నగర్ లో వార్తలు వస్తున్నాయి…!!

మాది తమిళనాడులోని బాడుగ తెగ..మా భాషకు లిపి లేదు… సాయి పల్లవి

మలయాళ భామ సాయి పల్లవి కి తెలుగులో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. నిజానికి తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకముందే ఆమెకు టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. మలయాళం నుంచి ఒకటో రెండో సినిమాలు తెలుగులోకి రావడంతో పాటు ప్రేమమ్ సినిమా ఒరిజినల్ వెర్షన్ ని చూసి సాయి పల్లవి కి ఫిదా అయిపోయారు తెలుగు ప్రేక్షకులు.. ఆమె టాలీవుడ్ ఎంట్రీ కోసం ఎంతగానో వెయిట్ చేశారు. అందరు అనుకున్నట్లే ఆమె తొలి సినిమా గా ఫిదా చేసింది.. ఆ సినిమాలో ఆమె సహజమైన నటనతో ప్రేక్షకులను మంత్రం ముగ్దులను చేసి ఆకట్టుకుంది..

ఒక్కసారిగా కుర్రకారు గుండెలని కొల్లగొట్టిన సాయి పల్లవి ఆ తర్వాత నాని సరసన MCA చిత్రంలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆమె లవ్ స్టోరీ సినిమా లో నటిస్తుంది.. ఇంకా రానా విరాట పర్వంలో కూడా సాయి పల్లవి నటిస్తుంది.. ఇవే కాకుండా మరో రెండు మూడు తెలుగు సినిమాలు కూడా ఆమె సైన్ చేసింది..ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ సాయిపల్లవి తన ఫ్యామిలీ.. తన పర్సనల్ విషయాలను పంచుకుంది. ఒక వేళా నటి కాకుంటే ఏం చేసుండే వారని అడగగా.. సాయి పల్లవి స్పందిస్తూ.. ఎంబీబీఎస్‌ తరవాత కార్డియాలజీ ఎంచుకుని కార్డియాలజీస్ట్ అయ్యేదాన్నని తెలిపింది.

ఎవరికి తెలియని విషయం చెప్పండని అడగగా… మాది తమిళనాడులోని బడుగ అనే గిరిజన తెగ. మా భాష బడుగకు లిపి లేదని సమాదానం ఇచ్చింది. ఇక ఎప్పుడైన ఏడ్చారా.. అని ప్రశ్నించగా..ఎన్జీకే సమయంలో చేసిన సీన్‌నే పదే పదే రీషూట్‌ చేస్తుండేవారు ఆ సినిమా దర్శకుడు. దాంతో ఒకరోజు సినిమాలను వదిలేస్తానని అమ్మకు చెప్పి ఇంట్లో ఏడ్చేశాను అని చెప్పింది. ఇదిలా ఉంటే ఇక ఆమె నటించిన లవ్ స్టోరీ సినిమాలోని సారంగదారియా పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారం రోజుల్లో రెండు కోట్ల మంది ఈ పాటను వీక్షించారంటే ఆమె కి ఎంత పోపులతిరి ఉందొ అర్థం చేసుకోవచ్చు..