Tag Archives: samjam show

పెళ్లి అయితే ఏంటి? సమంతనే సౌత్ స్టార్ హీరోయిన్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకున్న సమంత అక్కినేని ఏప్రిల్ 28న తన 34 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నది. ఈ క్రమంలోనే ఆమెకి అభిమానులు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఏ మాయ చేసావే సినిమాలో ఎంతో అమాయకంగా జెస్సీ పాత్రలో నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న తరువాత అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకొని తెలుగింటి కోడలుగా అడుగుపెట్టింది.

పెళ్లి కాక ముందు వరుస సినిమాలతో దూసుకుపోతున్న సమంతా పెళ్లయిన తర్వాత తన స్పీడ్ కి బ్రేక్ పడుతుందని ఎంతో మంది భావించారు. కానీ పెళ్లి అయిన తరువాత సమంత రెట్టింపు వేగంతో దూసుకు పోతూ మరింత గుర్తింపును సంపాదించుకుంది. పెళ్లయిన తర్వాత గ్లామరస్ పాత్రలు కాకుండా ఎంతో అద్భుతంగా నటించే అవకాశాలను పొందుతున్నారు. కేవలం వెండి తెరపై మాత్రమే కాకుండా బుల్లితెర పై బిగ్ బాస్ కార్యక్రమానికి కొన్ని రోజులు వ్యాఖ్యాతగా వ్యవహరించి తనలో ఉన్న నైపుణ్యాన్ని బయటపెట్టింది.

అదేవిధంగా ఓటీటీ ప్లాట్ ఫామ్ వేదికగా ఆహా యాప్ ద్వారా ప్రసారమైన “సామ్ జామ్”షో కి వ్యాఖ్యాతగా వ్యవహరించి తన మార్క్ ఏంటో నిరూపించుకున్నారు. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లో నటిస్తూ, గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “శాకుంతలం”అనే పౌరాణిక సినిమాలో నటిస్తున్నారు. వృత్తిపరంగా కెరియర్ పరంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న సమంత మంచి మనసున్న అమ్మాయిగా కూడా గుర్తింపు పొందింది.

ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది అనాధ పిల్లలను ఆదుకొని వారికి విద్య వైద్యం అందిస్తూ ఎంతో గొప్ప మనసున్న అమ్మాయిగా గుర్తింపు సంపాదించుకుంది. ఇవేకాక బిజినెస్ రంగం వైపు అడుగులు వేస్తూ తన సత్తా ఏంటో నిరూపించుకుంది.’సాకీ’ పేరుతో మహిళల ఫ్యాషన్ దుస్తులను అందుబాటులోకి తెస్తూ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది. ఈ వ్యాపారం తన బిడ్డ లాంటిదని సమంత చెప్పడం విశేషం.ఈ విధంగా వివిధ రంగాలలో ఎంతో చురుకుగా పాల్గొంటూ మంచి గుర్తింపును సాధించుకున్న అక్కినేని సమంత ఎప్పుడు స్టార్ హీరోయిన్ అని చెప్పవచ్చు

కళ్లకు గంతలు కట్టుకుని మెగాస్టార్ ఏం చేశారో తెలుసా?

కరోనా సమయంలో లాక్ డౌన్ కారణంగా చిత్ర నిర్మాణ పనులు ఆగిపోవడంతో ప్రముఖ సినీ సెలబ్రిటీస్ మొత్తం ఇంటికే పరిమితమయ్యారు.అయితే ఇంటికే పరిమితమైన హీరోలందరూ ఛాలెంజ్ లో భాగంగా రోజు ఇంటి పనులను చేస్తూ తమ చాలెంజ్ పూర్తి చేసేవారు. ఈ చాలెంజ్ లో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి తన ఇంటిని శుభ్రం చేస్తూ, అలాగే దోసెలను వేస్తూ తన చాలెంజ్ పూర్తి చేసిన సంగతి మనకు తెలిసిందే.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి సమంత వ్యాఖ్యాతగా “ఆహా” యాప్ ద్వారా నిర్వహిస్తున్న సామ్ జామ్ అనే టాక్ షో కి మెగాస్టార్ చిరంజీవి వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు. అయితే క్రిస్మస్ కానుకగా మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో సందడి చేయనున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఒక ప్రోమోను విడుదల చేశారు.

ఈ వీడియోలో సమంత అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సమంత చిరంజీవిని “మీరు ఎప్పుడైనా సినిమా చూస్తూ ఏడ్చారా”? అనే ప్రశ్నను అడగడంతో అందుకు చిరంజీవి గారు సమాధానం చెబుతూ… ఓ సినిమాకు వెళ్లి కన్నీళ్ళు పెట్టుకున్నానని, కిందకు వంగి కళ్ళు తుడుచుకుంటున్న సమయంలో లైట్లు వేశారు తాను పైకి లేచేసరికి పైట చేతిలో ఉందని నవ్వుతూ చెప్పారు. అంతేకాకుండా ఈ షోలో చేతులు లేని బాలుడు ఎంతో అద్భుతంగా చిరంజీవి బొమ్మను నోటితో గీయడంతో ఎంతో ఆనంద పడ్డారు.

అంతే కాకుండా సమంత కరోనా సమయంలో దోస చాలెంజ్ ను గుర్తు చేస్తూ ఇప్పుడు కూడా చిరంజీవిగారితో దోసెలను వేయించారు. అయితే ఈసారి మాత్రం చిరంజీవిగారు కళ్ళకు గంతలు కట్టుకొని దోసే వేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరిని ఆకట్టుకుంది.

సమంత పారితోషకం చూసి నోరెళ్లబెడుతున్న స్టార్ హీరోయిన్లు..?

సమంత.. ఏమాయ చేసావే అంటూ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా ఈ హీరోయిన్.. ఆతర్వాత తన నటనతో క్యూట్ నెస్ తో అందరిని ఆకట్టుకుంది. తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్న ఈ భామ అక్కినేని వారి కోడలు అయ్యి అందరిని ఆశ్చర్యపరిచింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ తన అభిమానులకు దగ్గర ఉన్న ఈ భామ సినిమాలు మాత్రమే కాకుండా బుల్లితెరపై, ఓటిటిపై యాంకర్ గా కూడా షోస్ చేస్తూ మరింత దగ్గరగా ఉంటుంది.

అందుకే మొన్నటి వరకు సినిమాకు 2 కోట్లు తీసుకునే ఈ హీరోయిన్ ఇప్పుడు ఓ రేంజ్ కు వెళ్ళిపోయింది. ఒక షో కి సమంత ఏకంగా అక్షరాల కోటి రూపాయల పారితోషకం అందుకుంది. విని షాక్ అవుతున్నారా..! నిజంగానే ఈ హీరోయిన్ అక్షరాల కోటి రూపాయిల పారితోషికం అందుకుంది. ఓటిటి ‘ఆహా’లో ప్రసారం అవుతున్న సామ్ జామ్ షోలో హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో కి ఆమె ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోటి రూపాయలు పారితోషికం అందుకుంది.

పెళ్లి తర్వాత సమంత అసలు సినిమాల్లోకి రాదు అనుకుంటే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఈ లాక్ డౌన్ లో సైతం సమంత అభిమానులకు దగ్గరగా ఉంటూనే బోలెడన్ని అడ్వేర్టైజ్మెంట్లు చేసి కోట్లలో సంపాదించిది అంటూ ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ లు కూడా వైరల్ అయ్యాయి. ఇక లాక్ డౌన్ లో టెర్రాస్ గార్డెనింగ్, వంటకాలు చెయ్యడంతో పాటు మెగా కోడలు ఉపాసనతో కలిసి ప్రజలకు హెల్త్ టిప్స్ కూడా ఇచ్చింది. అంతేకాదు ఈ లాక్ డౌన్ సఖీ అంటూ బట్టల షాప్ ని కూడా ప్రారంభించింది సమంత. ప్రస్తుతం ది ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్ లో విలన్ పాత్రలో నటిస్తుంది. ఏది ఏమైనా అక్కినేని కోడలు అన్నిటిలోను ముందు ఉంటుంది అని అనడంలో సందేహం లేదు.

సమంత టాక్ షోలో సందడి చేసిన మెగాస్టార్.!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరైన అక్కినేని సమంత “ఆహా” అనే యాప్ ద్వారా “సామ్ జామ్”అనే టాక్ షో కి వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆహా అనే యాప్ ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్వహించగా, ఈ యాప్ లో “సామ్ జామ్” అనే టాక్ షో ద్వారా ప్రముఖ సెలబ్రిటీస్ వారి వ్యక్తిగత విషయాల గురించి సమంత ఇంటర్వ్యూ చేసి వారి సమాధానాలను ఈ షో ద్వారా అభిమానులకు తెలియజేస్తుంటారు.

ఇప్పటికే ఈ యాప్ ద్వారా “సామ్ జామ్”నవంబర్ 13న మొదటి ఎపిసోడ్ ప్రసారమైంది. ఫస్ట్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ ఎంట్రీ అవడంతో ఈ షో ప్రారంభమైంది. అయితే ఈ యాప్ కు ఎక్కువమంది సబ్స్క్రైబర్లలను పెంచుకునే ప్రయత్నంలో ఈ షో ను సమంతతో నిర్వహిస్తున్నారు. ఈ షోలో భాగంగా ప్రముఖ సెలబ్రిటీస్ ను ఈ షో కి ఆహ్వానించి వారిని సమంత ఇంటర్వ్యూ చేస్తారు. తర్వాత వచ్చే ఎపిసోడ్ లలో తమన్నా, రష్మిక, అల్లు అర్జున్ వంటి సెలబ్రిటీస్ ఈ షోలో పాల్గొని సందడి చేయనున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సామ్ జామ్ షో లో సందడి చేయనున్నట్లు ప్రచారం జోరుగా సాగింది. అయితే అనుకున్నట్లుగానే మెగాస్టార్ చిరంజీవి షోలో పాల్గొన్నారు. దీనికిసంబంధించిన కొన్ని ఫోటోలను ప్రముఖ సినీ పీఆర్వో బీఏ రాజు తన ట్విటర్ ఖాతా ద్వారా ఈ ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ ఎపిసోడ్ త్వరలోనే ఆహా ద్వారా ప్రసారం కానుంది. సమంత అడిగే ప్రశ్నలకు మెగాస్టార్ ఎలాంటి సమాధానాలు చెబుతారో అని ప్రేక్షకాభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.