Tag Archives: social media

తలతో 46 టాయిలెట్లు బద్దలుకొట్టాడు.. చివరికి?

ఒకప్పుడు కార్లను చేతుల మీదకు ఎక్కించుకోవడం, ఒట్టి చేతులతో ఇటుకలు, రాళ్లు, కొబ్బరి బోండాలు పగలగొట్టడం,తాళ్ల సహాయంతో నోటి ద్వారా వాహనాలను లాగడం వంటి సాహసాలు ఎక్కువగా ట్రెండ్ అయ్యేవి. కానీ ప్రస్తుతం మాత్రం టాయిలెట్ సీట్లను బద్దలు కొట్టడం ట్రెండ్ గా మారింది. టాయిలెట్ సీట్లను బద్దలు కొట్టడం అంటే కర్రతోనో చేతితోనో కాదండోయ్.. తలతో బద్దలు కొట్టాలి. ప్రస్తుతం ఇదే ట్రెండ్ నడుస్తోంది.

తాజాగా ఇద్దరు వ్యక్తులు టాయిలెట్ పై ఉన్న సీట్లను తలతో బద్దలుకొట్టి గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకున్నారు. గిన్నిస్ వరల్డ్ బుక్ లోరికార్డు సొంతం చేసుకోవడం కోసం ఇద్దరు వ్యక్తులు పోటా పోటీ పడి మరీ టాయిలెట్ సీట్లను తలతో పగలగొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో గిన్నీస్ వరల్డ్ రికార్డ్సకు చెందిన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ సందర్భంగా ఎవరు ఎక్కువ టాయిలెట్ సీట్లను తలతో బద్దలు కొడతారో వారే విజేత.ఈ పోటీని గిన్నీస్ బుక్ రికార్డుల్లో కూడా నమోదవుతుంది. దీంతో పోటీ మహా రంజుగా సాగింది. పోటీలో భాగంగా చెక్కతో తయారుచేసిన టాయిలెట్ సీట్లను తలతో బద్దలు కొట్టాలి. ఇందులో భాగంగానే మొదటి వ్యక్తి తల తో ఏకంగా43 టాయిలెట్ సీట్లను పగలగొట్టగా, రెండవ వ్యక్తి ఏకంగా 46 టాయిలెట్ సీట్లను పగలగొట్టి విజయం సాధించాడు. ఈ విధంగా రెండవ వ్యక్తి గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. మరి ఈ సాహసానికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సాహస వీడియో పై మీరు ఓ లుక్కేయండి.

పాపం.. ప్రగతి ఆంటీ ఆ కోరికను ఇలా తీర్చుకుంటోంది..!!

తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పద్దతి గల తల్లి పాత్రలకీ కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన ప్రగతి.. ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ బిజీ అయిపోయింది.. ఏకంగా తనకు సంబంధించిన బోల్డ్ ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ వస్తోంది..నెట్టింట్లో అవి బాగా వైరల్ కూడా అవుతున్నాయి.’ఏమైంది ఈవేళ’ సినిమాలో హీరో తల్లిగా అద్భుతంగా నటించి ఆ పాత్రకు గానూ ఏకంగా నంది అవార్డు కూడా సాధించింది.

అంత మంచి నటి, వయసు పెరిగే కొద్దీ పద్దతిగా ఉండాల్సింది పోయి, స్లీవ్ లెస్ లో కనిపిస్తూ.. టైట్ డ్రెస్ లు వేసుకుంటూ ఫోటోలు వీడియోలు దిగి.. పైగా వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తెగ ఎంజాయ్ చేయడం అందర్నీ షాక్ కి గురి చేస్తోంది. అసలు ప్రగతి ఆంటీ ఎందుకు ఇలా చేస్తోందో తెలియదు గానీ, అవకాశం వస్తే.. హీరోయిన్ గా కూడా చేయడానికి తానూ రెడీ అన్న మాదిరిగా ఉంది ఆమె వ్యవహారం. తెలుగు హీరోలకు వదిన..అక్క.. తల్లిగా నటించి మెప్పించిన ఈ ఆంటీ మరి హీరోయిన్ గా కూడా నటిస్తోందేమో.

ఏది ఏమైనా ఎలాంటి పాత్రలో నటించినా ప్రగతి అద్భుతంగా అభినయించగలదు. అక్కడక్కడా ఓవర్ యాక్టింగ్ చేస్తోన్నట్టు అనిపించినా మొత్తంగా చూస్తే.. ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ… ప్రేక్షకులను మెప్పించడం ఆమె ప్రత్యేకత. ఇప్పుడున్న బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టులలో ప్రగతి టాప్ ప్లేస్ లో ఉంటుంది. అయితే ఆమె సన్నిహితులు మాత్రం ఆమె గురించి కొన్ని విషయాలు చెప్పుకొస్తున్నారు.ఆమెకు హీరోయిన్ గా నటించాలనే ఆశ చిన్నప్పటి నుండి ఉందట.

పైగా ప్రగతి తన కెరీర్ ఆరంభంలో పలు తమిళ సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించి ఆకట్టుకుంది. కానీ తన వివాహం తర్వాత ఆమె నటనకు దాదాపు మూడేళ్ళ పాటు గ్యాప్ ఇచ్చింది. అనంతరం కొన్ని సీరియల్స్ లో నటించినా కుటుంబ బాధ్యతలు కారణంగా ప్రగతి హీరోయిన్ గా కంటిన్యూ చేయలేకపోయింది.ఇక ఆంటీ ఏజ్ వచ్చాక తల్లి పాత్రలతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. కానీ తనలోని హీరోయిన్ కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది…!!

కూతురు గదిలోకి వెళ్లి షాకైన తల్లి.. అసలేం జరిగిందంటే..?

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో చోటు చేసుకున్న ఒక ఘటన నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంట్లోని కూతురు గదిలోకి వెళ్లిన తల్లి వందల సంఖ్యలో సాలీడులను చూసి ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఏది పని మీద కూతురు గదిలోకి వెళ్లిన మహిళకు అక్కడ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు. గదిలోని ఏ మూల చూసినా పుట్టలుపుట్టలుగా సాలె పురుగులు ఉండటంతో ఆ మహిళ తీవ్ర భయాందోళనకు గురైంది.

పూర్తి వివరాల్లోకి వెళితే పెటీ ఆర్ అనే ఒక మహిళ సిడ్నీలోని ఒక ఇంట్లో జీవనం సాగించేది. ఒకరోజు పెటీ ఆర్ కూతురు గదిని శుభ్రం చేయాలని అనుకొని గదిలోకి వెళ్లగా డోర్ తీసిన వెంటనే గోడపై వందల సంఖ్యలో సాలె పురుగులు కనిపించాయి. అవి ఎక్కువ సంఖ్యలో ఉండటంతో అవాక్కైన మహిళ వెంటనే ఆ విషయాన్ని తన స్నేహితురాలికి తెలియజేసింది. ఆ తరువాత మహిళ, ఆమె స్నేహితురాలు ఆ సాలె పురుగులను ఇంటి నుంచి బయటకు పంపే ప్రయత్నం చేశరు.

సాలె పురుగులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అర చేయి సైజులో ఉండే ఈ సాలె పురుగులను హంట్స్‌మన్ సాలె పురుగులని పిలుస్తారని తెలుస్తోంది. ఈ సాలె పురుగులు కరిస్తే వాంతులు, తలనొప్పి లాంటి ఆరోగ్య సమస్యలతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు అపాయం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే మొదట మహిళ ఫోటోలను షేర్ చేయగా చాలామంది ఆ ఫోటోలను ఫోటో షాప్ లో ఎడిట్ చేశారని కామెంట్లు చేశారు.

దీంతో సదరు మహిళ వీడియో పోస్ట్ చేసి ఆ ఫోటోలు రియల్ ఫోటోలేనని మార్ఫింగ్ ఫోటోలు కాదని ప్రూవ్ చేసింది. ఈ సాలె పురుగులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వీడియో వైరల్: అనకొండకు దొరికి ప్రాణాల కోసం..!

సాధారణంగా మనం అనకొండకు దొరికి ప్రాణాలను పోగొట్టుకున్న మనుషులు, జంతువులను గురించి ఎన్నో సంఘటనలను విని, చూసి ఉంటాం.అయితే కావాలని మనుషులను చంపని అనకొండలు వాటికి అవకాశం దొరికినప్పుడు మాత్రం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాయి.చూడటానికి ఎంతో భయంకరంగా ఉండే అనకొండ చేతికి ఒక్కసారి దోరికామంటే మన ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. ఇలాంటి తరహాలోనే ఓ వ్యక్తి అనకొండ చేతికి దొరికి ప్రాణాలను రక్షించుకునేందుకు అనకొండ తీవ్రమైన పోరాటం చేసిన ఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది.

ఇండోనేషియాకు చెందిన ఒక వ్యక్తి ఓ భారీ అనకొండ చేతికి దొరికాడు. ఒక్కసారిగా అనకొండ అతనిపై దాడి చేసి అతనిని చుట్టేసుకుంది. దీంతో అనకొండ నుంచి తన ప్రాణాలను రక్షించుకోవడానికి ఆ వ్యక్తి విశ్వప్రయత్నం చేశాడు. ఏమాత్రం అనకొండకు భయపడకుండా, దాని మంచి తప్పించుకోవాలని తీవ్రమైన పోరాటం చేస్తున్నాడు. అంత పొడవైన అనకొండ నుంచి ఒక్కడే తనను తాను రక్షించుకోవడం సాధ్యం కాలేదు.

అతడిని అనకొండ చుట్టేసిన ఘటన చూసిన సదరు ఇద్దరు వ్యక్తులు అతనిని అనకొండ నుంచి కాపాడే ప్రయత్నం చేశారు. ఆ ఇద్దరు వ్యక్తులు అతడికి సహాయంగా వచ్చి అనకొండను అతి కష్టంతో పక్కకు తీసి దాని చెర నుంచి ఆ వ్యక్తిని కాపాడారు. అతి కష్టంపై పాము నుంచి రక్షించిన అతనికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 50 నిమిషాల పాటు నిడివి ఉన్న ఈ వీడియో అతి కొద్ది సమయంలో వైరల్ గా మారి ఎంతోమందిని ఆకట్టుకుంది.

టర్కీ వీధుల్లో గొర్రెలు కలకలం..!

ఏంటి టర్కీ వీధుల్లో గొర్రెలా? అదెలా అని మీకు సందేహం రావచ్చు.. కానీ నిజంగానే గొర్రెలు టర్కీ వీధుల్లో తిరుగుతున్నాయ్. మీకు ఆశ్చర్యం వేసిన ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్న అంశం ఇది. ఎప్పుడైనా మనం హైవేపై ప్రయాణం చేస్తున్న సమయంలో కొన్ని గ్రామాల వద్ద రోడ్లపై గొర్రెల గుంపు పోతుంటుంది. అది మనం చూస్తూనే ఉంటాం. కానీ అదే నగరాల్లో అయినా హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో రోడ్లపై గొర్రెలను, మేకలను మనం ఎప్పుడు చూసి ఉండం.

అలాంటిది టర్కీ విధుల్లో గొర్రెలు తిరగడమే కాదు మనుషులపై దాడులు కూడా చేశాయి. ఎవరైనా తరమాలని చూస్తే వారిని పరుగులు పెట్టించాయి. దీనికి సంబంధించిన ఘటన ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఏం జరిగిందో తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యానికి గురవుతారు. అలాంటి ఘటన ఆ వీడియోల్లో జరిగింది.

ఎంతో ప్రశాంతంగా ప్రజలంతా తమ పనులతో బిజీ బిజీగా గడుపుతున్న సమయంలో ఎవరు ఊహించని విధంగా ఉన్నట్టుండి ఒక రోడ్డు మీదకు వచ్చింది. అది మరేదో కాదు గొర్రెల గుంపు. సిటీ లైఫ్ కి అలవాటు పడ్డ ప్రజలు గొర్రెలను చూసి భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన టర్కీలోని నెవ్ షేహిర్ ప్రాంతంలో గొర్రెల గుంపు రోడ్డుపైకి వచ్చి హల్ చల్ చేసింది. ఎదురుపడిన మనుషులను పొడవడం ప్రారంబించాయ్. సుమారు ఒక అరగంట పాటు ఈ ఘటన చోటుచేసుకుంది.

ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు గానీ రోడ్డుపై అటుగా వెళ్ళే పాదచారులను పరుగులు పెట్టించాయి. అంతేకాకుండా వాటిని ఆపుదామని వెళ్ళిన కొంతమందిని భౌతికంగా గాయపరిచాయి. ఈ సంఘటన చోటు చేసుకొని మూడు రోజులు అవ్వగా ఈ ఘటనను నెవ్ షేహిర్ ప్రాంత మున్సిపాలిటీ అధికారులు వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

 

ప్రేమలో పడిన యాంకర్ శ్రీముఖి.. అబ్బాయి ఎవరంటే..?

బుల్లితెర షోలతో యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి ప్రేమలో పడిందా..? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమె డేటింగ్ లో ఉందని రెండేళ్ల తర్వాతపెళ్లి జరగనుందని తెలుస్తోంది. పటాస్ షో ద్వారా యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖికి బిగ్ బాస్ షో లో రన్నర్ గా మరింత పేరు, గుర్తింపు సంపాదించుకుంది. బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి శ్రీముఖి పటాస్ షోకు దూరమయ్యారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ యాంకర్ గా చేసే షోల గురించి, ఇతర విశేషాల గురించి శ్రీముఖి అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. గతంలో ఒక ప్రోగ్రామ్ లో శ్రీముఖికి పెళ్లి ఎప్పుడు…? అనే ప్రశ్న ఎదురు కాగా ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంటానని రెండు సంవత్సరాల తర్వాత యాంకరింగ్ కు గుడ్ బై చెప్పి పెళ్లికి సంబంధించిన శుభవార్త చెబుతానని అన్నారు. అయితే శ్రీముఖి ప్రేమించిన అబ్బాయి సినిమా, టీవీ రంగాలకు చెందిన వ్యక్తి కాదని తెలుస్తోంది.

శ్రీముఖి ఇష్టపడుతున్న అబ్బాయి ఎవరో తెలియాలంటే ఆమె నోరు విప్పాల్సి ఉంది. ప్రస్తుతం శ్రీముఖి బొమ్మ అదిరింది షోకు హోస్ట్ గా వ్యవహరించడంతో పాటు పలు ఈవెంట్లలో పాల్గొంటున్నారు. యూట్యూబ్ లో ఓ ఉమానియా పేరుతో శ్రీముఖి టాక్ షోను చేస్తూ అభిమానులకు మరింత చేరువవుతున్నారు. శ్రీముఖి డేటింగ్ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

యాంకర్ గా వ్యవహరించడంతో పాటు శ్రీముఖి అడపాదడపా సినిమాల్లో సైతం నటిస్తున్నారు. ప్రస్తుతం శ్రీముఖి ఒక థ్రిల్లర్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే శ్రీముఖి వైరల్ అవుతున్న వార్త గురించి స్పందించాల్సి ఉంది. శ్రీముఖి స్పందిస్తే మాత్రమే ఈ వార్తలో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంటుంది.

సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసే మహిళలకు షాకింగ్ న్యూస్..!!

ఈ మధ్య కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను విసృతంగా వినియోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగడంతో తమ ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ ఆ ఫోటోలపై స్నేహితుల, బంధువుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. అయితే సరదాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆ ఫోటోలను కొందరు పెయిడ్ సెక్స్ సర్వీస్ సైట్లలో ఉపయోగిస్తూ సదరు యువతులు, మహిళలకు కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో ఒక మహిళ సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా పని చేసేది. 40 సంవత్సరాల వయస్సు ఉన్న ఆ మహిళకు ఇద్దరు పిల్లలు. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని కావడంతో తన స్నేహితులలా ఆమె కూడా సోషల్ మీడియాలో తరచూ ఫోటోలను అప్ లోడ్ చేస్తూ ఉండేది. అయితే ఒకరోజు ఆమె కొన్ని పోర్న్, డేటింగ్ సైట్లలో తన ఫోటోలు ఉన్నట్టు గుర్తించింది. కొందరు తన ఫోటోలతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆమెకు అర్థమైంది.

ఆ మహిళ వెంటనే తన స్నేహితుడికి ఈ విషయం గురించి చెప్పి సహాయం చేయమని కోరింది. ఆమె స్నేహితుడు ఆ సైట్లలో ఉన్న నంబర్ కు కాల్ చేయగా అవతలి వ్యక్తి ఫోటోలో ఉన్న మహిళతో లైంగిక సేవలు పొందాలంటే డబ్బు జమ చేయాలని సూచించాడు. మహిళ అతని స్నేహితుని సహాయంతో నోయిడాలోని పోలీస్ స్టేషన్ లో తన ఫోటోలను వైరల్ చేస్తున్న సైట్లపై, ఫోటోలను దుర్వినియోగం చేస్తున్న వ్యక్తులపై ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని.. ఫోటోలను పోర్న్, డేటింగ్ సైట్ల నుంచి తొలగించేలా చర్యలు చేపడతామని చెప్పారు. సోషల్ మీడియాలో యువతులు, మహిళలు ఫోటోలను పోస్ట్ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్నవాళ్లు మినహా ఇతరులు ఫోటోలను చూడకుండా, ఆ ఫోటోలను డౌన్ లోడ్ చేసుకోకుండా మార్పులు చేసుకోవాలని చెబుతున్నారు.

పెళ్లికూతురుకు ఆ అలవాటు ఉండకూడదట.. పెళ్లి ప్రకటన వైరల్…?

ఈ మధ్య కాలంలో మనుషుల ఆలోచనా తీరు మారుతోంది. పెళ్లి విషయంలో నచ్చిన అబ్బాయే కావాలని అమ్మాయిలు, నచ్చిన అమ్మాయే కావాలని అబ్బాయిలు మొండిగా వ్యవహరిస్తున్నారు. తమకు నచ్చిన లక్షణాలు ఉన్న వధువు/వరుడు దొరకకపోతే మ్యాట్రిమొనీల ద్వారా, పెళ్లి ప్రకటనల ద్వారా వారి కోసం వెతుకుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వ్యక్తి వింత పెళ్లి ప్రకటన వైరల్ అవుతోంది.

పశ్చిమ బెంగాల్‌ లోని కమన్పూర్ కు చెందిన న్యాయవాది చటర్జీ పేపర్ లో తనకు సోషల్ మీడియాకు అడిక్ట్ కాని అమ్మాయి కావాలని, ఆ అమ్మాయి అందంగా పొడవుగా ఉండాలని ప్రకటన ఇచ్చాడు. ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ యువతీయువకుల జీవితంలో భాగమైపోయాయి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు సందేశాల ద్వారా మాత్రమే సమాచారం అవతలి వ్యక్తులకు చేరుతోంది. సోషల్ మీడియా యాప్స్ కు యువతీయువకులు బానిసలవుతున్నారు.

ఈ కాలంలో సోషల్ మీడియా యాప్స్ వినియోగించని వధువు లేదా వరుడు కావాలని ఆశిస్తే అది అత్యాశే అవుతుంది. చటర్జీ ‌ అనే 5 అడుగుల 7 అంగుళాల ఎత్తు ఉన్న న్యాయవాది, పరిశోధకుడు పేపర్ లో ఈ ప్రకటన ఇచ్చాడు. అతనికి ఇళ్లు, కార్లు అనీ ఉన్నాయి. అయితే అతని మనస్సులో ఏముందో తెలియదు కానీ ఇలాంటి వింత ప్రకటనను పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అతనికి జన్మలో పెళ్లి కాదని కామెంట్లు పెడుతున్నారు.

అయితే వృత్తిపరంగా ఎన్నో కేసులను చూడటం వల్లే చటర్జీ అలాంటి అభిప్రాయానికి వచ్చి ఉంటాడని మరి కొందరు భావిస్తున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం భార్యకు కనీసం సోషల్ మీడియా యాప్స్ వినియోగించే స్వేచ్ఛ కూడా ఇవ్వరా..? అని ప్రశ్నిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం హెచ్.ఐ.వీ పాజిటివ్ ఉన్న మహిళకు ఒక కులానికి చెందిన వరుడు కావాలనే ప్రకటన వైరల్ కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పెళ్లి ప్రకటన హల్చల్ చేస్తోంది.