ఏంటి టర్కీ వీధుల్లో గొర్రెలా? అదెలా అని మీకు సందేహం రావచ్చు.. కానీ నిజంగానే గొర్రెలు టర్కీ వీధుల్లో తిరుగుతున్నాయ్. మీకు ఆశ్చర్యం వేసిన ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్న అంశం ఇది. ఎప్పుడైనా మనం హైవేపై ప్రయాణం చేస్తున్న సమయంలో కొన్ని గ్రామాల వద్ద రోడ్లపై గొర్రెల గుంపు పోతుంటుంది. అది మనం చూస్తూనే ఉంటాం. కానీ అదే నగరాల్లో అయినా హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో రోడ్లపై గొర్రెలను, మేకలను మనం ఎప్పుడు చూసి ఉండం.
అలాంటిది టర్కీ విధుల్లో గొర్రెలు తిరగడమే కాదు మనుషులపై దాడులు కూడా చేశాయి. ఎవరైనా తరమాలని చూస్తే వారిని పరుగులు పెట్టించాయి. దీనికి సంబంధించిన ఘటన ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఏం జరిగిందో తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యానికి గురవుతారు. అలాంటి ఘటన ఆ వీడియోల్లో జరిగింది.
ఎంతో ప్రశాంతంగా ప్రజలంతా తమ పనులతో బిజీ బిజీగా గడుపుతున్న సమయంలో ఎవరు ఊహించని విధంగా ఉన్నట్టుండి ఒక రోడ్డు మీదకు వచ్చింది. అది మరేదో కాదు గొర్రెల గుంపు. సిటీ లైఫ్ కి అలవాటు పడ్డ ప్రజలు గొర్రెలను చూసి భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన టర్కీలోని నెవ్ షేహిర్ ప్రాంతంలో గొర్రెల గుంపు రోడ్డుపైకి వచ్చి హల్ చల్ చేసింది. ఎదురుపడిన మనుషులను పొడవడం ప్రారంబించాయ్. సుమారు ఒక అరగంట పాటు ఈ ఘటన చోటుచేసుకుంది.
ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు గానీ రోడ్డుపై అటుగా వెళ్ళే పాదచారులను పరుగులు పెట్టించాయి. అంతేకాకుండా వాటిని ఆపుదామని వెళ్ళిన కొంతమందిని భౌతికంగా గాయపరిచాయి. ఈ సంఘటన చోటు చేసుకొని మూడు రోజులు అవ్వగా ఈ ఘటనను నెవ్ షేహిర్ ప్రాంత మున్సిపాలిటీ అధికారులు వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…